Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వందే భారత్‌

వందే భారత్‌

దేశంలోని మొదటి సెమీ హై స్పీడ్ రైలు వందే భారత్. దీనిని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. అత్యాధునిక సదుపాయాలతో ఈ రైళ్లను తయారు చేశారు. ప్రస్తుతం దేశంలో 23 వందేభారత్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. 10 గంటల లోపు ప్రయాణ సమయంతో కూడిన దేశంలోని ప్రధాన నగరాల మధ్య ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను రైల్వే శాఖ నడుపుతోంది. గంటకు 180 కి.మీ వేగం కంటే ఎక్కువ స్పీడ్‌తో ప్రయాణించగల సామర్థ్యం ఈ రైళ్లకు ఉన్నప్పటికీ.. ప్రయాణీకుల భద్రత దృష్ట్యా ఈ రైళ్లను గరిష్ఠంగా గంటకు 160 కి.మీ వేగంతో నడుపుతున్నారు. కేవలం 52 సెకన్ల వ్యవధిలో గంటకు 0 నుంచి 100 కి.మీ వేగాన్ని పుంజుకోవడం వందే భారత్ రైళ్ల ప్రత్యేకత. 16 కోచ్‌ల వందే భారత్ రైలు తయారీకి దాదాపు రూ.115 కోట్ల వ్యయం అవుతుంది. తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను 2019 ఫిబ్రవరి 15న లాంఛ్ చేశారు. ఈ అత్యాధునిక రైలును గతంలో ట్రైన్ 18 అని పిలిచేవారు.

చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ని డిజైన్ చేసి తయారు చేసింది. భారత ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా చొరవ కింద మొదటి రైలును రూ.97 కోట్ల వ్యయంతో 18 నెలల్లో తయారు చేయబడింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం నాలుగు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు నడుపుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మొదటి వందే భారత్ రైలును 2023 జనవరి 15న సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య ప్రధాని నరేంద్ర మోదీ వచ్చువల్‌గా ప్రారంభించారు. మరో మూడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను సికింద్రాబాద్- తిరుపతి, కాచిగూడ-యశ్వంత్‌పూర్, విజయవాడ – చెన్నై మధ్య నడుపుతున్నారు.

ఇంకా చదవండి

ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్.. విజయవాడ-బెంగళూరు మధ్య వందే భారత్.. ఏకంగా 9 గంటల్లోనే..

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో విజయవాడ - బెంగళూరు మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ నడిపేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రతిపాదనలను సిద్ధం చేసింది. షెడ్యూల్‌తో పాటు ప్రయాణ సమయం తొమ్మిది గంటలుగా రైల్వే శాఖ నిర్ణయించింది. దీంతో ప్రయాణికులకు దాదాపు మూడు గంటల ప్రయాణ సమయం ఆదా అవుతుంది..

Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై చిప్స్, బిస్కెట్స్, కూల్ డ్రింక్స్ కూడా…

వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు దేశవ్యాప్తంగా పరుగులు తీస్తున్నాయి. దాదాపు అన్ని నగరాలకు కనెక్ట్ అయిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించే ప్రయాణీకులు ఇప్పుడు తమ ప్రయాణ సమయంలో..

Vande Bharat Train: వందే భారత్ రైలులో చైన్‌ పుల్లింగ్‌ ఆప్షన్‌ ఉంటుందా? ఉండదా?

Vande Bharat Train: మన భారత రైల్వే ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉంది. దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థలో ఒకటిగా ఉంది. భారత రైల్వేలో ఎన్నో అత్యాధునిక రైళ్లను ప్రవేశపెడుతున్నారు. ఇక వందేభారత్‌ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. అత్యాధునిక సదుపాయలతో పాటు టెక్నాలజీతో కూడిన రైలు ఇది. ఇందులో చైన్‌ పుల్లింగ్‌ ఆప్షన్‌ ఉంటుందా? లేదా అనే అనుమానం అందరిలో ఉంటుంది. ఒక వేళ ఉండకుంటే అందుకు కారణం ఏంటి?

Indian Railways: త్వరలో 100 అమృత్‌ భారత్‌ రైళ్లు.. తెలుగు రాష్ట్రాలకు భారీగా కేటాయింపులు.. కాజీపేటలో..

2026లోపు దేశమంతా కవచ్‌ టెక్నాలజీ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర రైల్వే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ముఖ్య స్టేషన్ల పరిధిలో కవచ్‌ టెక్నాలజీని వేగంగా ఏర్పాటు చేస్తున్నామని, త్వరలో అన్ని చోట్ల పూర్తిచేస్తామని తెలిపారు. అలాగే.. సికింద్రాబాద్‌లో కవచ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకపై ఎల్‌టీసీ కింద రైళ్లలోనూ ప్రయాణం చేయొచ్చు..

ఇప్పటి వరకు ఎల్‌టీసీ కింద రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రయాణించడానికి అనుమతి ఉంది. ఇకపై తేజస్, వందే భారత్, హమ్‌ సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలోనూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రయాణించడానికి అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకున్నామని.. డీవోపీటీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎల్‌టీసీ ద్వారా రైలు ప్రయాణాలు చేసేటప్పుడు జీతంతో కూడిన సెలవుతోపాటు, టికెట్లపై రీయింబర్స్‌మెంట్‌ కూడా పొందనున్నారు.

Vande Bharat: కొత్తగా నాలుగు వందే‌భారత్‌లు.. సికింద్రాబాద్ నుంచి మరొకటి.. ఏ రూట్‌లోనంటే.?

పూణే రైల్వే స్టేషన్‌కు మరో 4 వందేభారత్ రైళ్లు త్వరలోనే రానున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపధ్యంలో.. అది పూర్తికాగానే ప్రధాని మోదీ ఈ రైళ్లకు జెండా ఊపే అవకాశం ఉందని తెలుస్తోంది.

5 వందేభారత్‌ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ.. విశాఖ రైల్వే జోన్‌పై కేంద్రమంత్రి రామ్మోహన్ కీలక వ్యాఖ్యలు..

గుజరాత్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సుడిగాలి పర్యటన కొనసాగుతోంది. అహ్మదాబాద్‌లో ఐదు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. విశాఖ-దుర్గ్‌ , సికింద్రాబాద్‌-నాగ్‌పూర్‌, ఆగ్రా-బనారస్‌, కొల్హాపూర్‌-పుణే, పుణే-హుబ్లీ మధ్య ఈ రైళ్లు నడుస్తాయి.

Vande Bharat Sleeper Coach: ప్రయాణంలో నూతన అధ్యాయం.. వరల్డ్ క్లాస్ ప్రమాణాలతో వందే భారత్ స్లీపర్ రైలు

రైలు ప్రయాణంలో నూతన అధ్యాయం ప్రారంభం కానుంది.. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది.. వందే భారత్ స్లీపర్ రైలు అధునాతన సాంకేతికత, సౌకర్యాల మేళవింపుతో రైలు ప్రయాణానికి సరి కొత్త ప్రమాణాన్ని నెలకొల్పుతుంది.

Vande Bharat: సికింద్రాబాద్ నుంచి తొలి ‘వందే స్లీపర్’.. ఏ రూట్‌లోనో తెల్సా.. ముహూర్తం ఫిక్స్.!

ప్రస్తుతం దేశమంతా వందేభారత్ సర్వీసులకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. దీంతో ఇండియన్ రైల్వేస్.. వచ్చే నెల నుంచి వందేభారత్ స్లీపర్ రైళ్లను పట్టాలెక్కించేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్ నుంచి..

AP News: ఏపీ ప్రజలకు ‌గుడ్‌న్యూస్.. ఆ స్టేషన్ వరకు వందేభారత్ రైలు పొడిగింపు.!

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. మరీ ముఖ్యంగా భీమవరం, ఏలూరు, పాలకొల్లు, కైకలూరు వాసులకు ఇది అద్దిరిపోయే శుభవార్త. వచ్చే నెల నుంచి భీమవరం మీదుగా వందేభారత్ రైలు పరుగులు పెట్టనుంది. ప్రస్తుతం చెన్నై-విజయవాడ మధ్య నడుస్తోన్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను భీమవరం వరకు పొడిగించేందుకు..

మరో వారం రోజుల్లో అదృష్టంపట్టబోయే రాశులు ఇవే..మీ రాశి ఉందా మరి!
మరో వారం రోజుల్లో అదృష్టంపట్టబోయే రాశులు ఇవే..మీ రాశి ఉందా మరి!
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై తిరుమల తిరుపతిలో ఉచితంగానే..
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై తిరుమల తిరుపతిలో ఉచితంగానే..
ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. అత్యవసర ల్యాండింగ్
ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. అత్యవసర ల్యాండింగ్
రైలు బోగీలో మహిళకు పురిటి నొప్పులు.. పండంటి బిడ్డ జననం
రైలు బోగీలో మహిళకు పురిటి నొప్పులు.. పండంటి బిడ్డ జననం
అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకున్నా వదలట్లేదు..వెలుగులోకి కొత్త స్కామ్
అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకున్నా వదలట్లేదు..వెలుగులోకి కొత్త స్కామ్
కంటెంట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్.. ఛాన్స్ ఇచ్చిన అల్లు అర్జున్..
కంటెంట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్.. ఛాన్స్ ఇచ్చిన అల్లు అర్జున్..
అడవిలో సింహాన్ని చూసి గుక్కపట్టి ఏడుస్తున్న నెటిజన్లు.. ఎందుకంటే?
అడవిలో సింహాన్ని చూసి గుక్కపట్టి ఏడుస్తున్న నెటిజన్లు.. ఎందుకంటే?
అహ్మదాబాద్ విమాన ప్రమాదం: బాధితులకు భారీ పరిహారం!
అహ్మదాబాద్ విమాన ప్రమాదం: బాధితులకు భారీ పరిహారం!
ఇంట్లోనే పసుపుతో చార్‌కోల్ మాస్క్‌ చేసుకోండి.. రెసిపీ మీ కోసం
ఇంట్లోనే పసుపుతో చార్‌కోల్ మాస్క్‌ చేసుకోండి.. రెసిపీ మీ కోసం
1.80 లక్షల మోసపూరిత లింక్‌లను బ్లాక్‌ చేసిన ఎయిర్‌టెల్‌
1.80 లక్షల మోసపూరిత లింక్‌లను బ్లాక్‌ చేసిన ఎయిర్‌టెల్‌