AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వందే భారత్‌

వందే భారత్‌

దేశంలోని మొదటి సెమీ హై స్పీడ్ రైలు వందే భారత్. దీనిని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. అత్యాధునిక సదుపాయాలతో ఈ రైళ్లను తయారు చేశారు. ప్రస్తుతం దేశంలో 23 వందేభారత్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. 10 గంటల లోపు ప్రయాణ సమయంతో కూడిన దేశంలోని ప్రధాన నగరాల మధ్య ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను రైల్వే శాఖ నడుపుతోంది. గంటకు 180 కి.మీ వేగం కంటే ఎక్కువ స్పీడ్‌తో ప్రయాణించగల సామర్థ్యం ఈ రైళ్లకు ఉన్నప్పటికీ.. ప్రయాణీకుల భద్రత దృష్ట్యా ఈ రైళ్లను గరిష్ఠంగా గంటకు 160 కి.మీ వేగంతో నడుపుతున్నారు. కేవలం 52 సెకన్ల వ్యవధిలో గంటకు 0 నుంచి 100 కి.మీ వేగాన్ని పుంజుకోవడం వందే భారత్ రైళ్ల ప్రత్యేకత. 16 కోచ్‌ల వందే భారత్ రైలు తయారీకి దాదాపు రూ.115 కోట్ల వ్యయం అవుతుంది. తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను 2019 ఫిబ్రవరి 15న లాంఛ్ చేశారు. ఈ అత్యాధునిక రైలును గతంలో ట్రైన్ 18 అని పిలిచేవారు.

చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ని డిజైన్ చేసి తయారు చేసింది. భారత ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా చొరవ కింద మొదటి రైలును రూ.97 కోట్ల వ్యయంతో 18 నెలల్లో తయారు చేయబడింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం నాలుగు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు నడుపుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మొదటి వందే భారత్ రైలును 2023 జనవరి 15న సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య ప్రధాని నరేంద్ర మోదీ వచ్చువల్‌గా ప్రారంభించారు. మరో మూడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను సికింద్రాబాద్- తిరుపతి, కాచిగూడ-యశ్వంత్‌పూర్, విజయవాడ – చెన్నై మధ్య నడుపుతున్నారు.

ఇంకా చదవండి

Vande Bharat: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్‌.. ఈ వందే భారత్‌ రైలుకు అదనపు బోగీలు

Vande Bharat Train: భారత రైల్వే తన తొలి వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభానికి సిద్ధమవుతున్న తరుణంలో ఈ అప్‌డేట్‌ వచ్చింది. ప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపరచడానికి ప్రస్తుతం చిన్నపాటి మరమ్మతులు జరుగుతున్నాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల వెల్లడించారు..

గుడ్‌న్యూస్‌.. విజయవాడ టూ బెంగళూరు వయా తిరుపతి రూట్‌లో కొత్త వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌! ప్రారంభ తేదీ, టైమ్‌ టేబుల్‌ ఇదే!

రైల్వే ప్రయాణికులకు, ముఖ్యంగా తిరుపతి భక్తులకు శుభవార్త. విజయవాడ-తిరుపతి-బెంగళూరు మధ్య కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం కానుంది. వందే భారత్ రైళ్లకు డిమాండ్ పెరగడంతో మరిన్ని కొత్త రైళ్లతో పాటు స్లీపర్ రైళ్లు కూడా రానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • SN Pasha
  • Updated on: Nov 26, 2025
  • 2:04 pm

అదరహో.. విమానాన్ని తలదన్నేలా వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌

భారతీయ రైల్వేస్‌లో వందే భారత్‌ రైళ్లు ఒక సంచలనం అయితే.. ఇప్పుడు వాటి స్థాయిని పెంచేలా వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్లు వచ్చేస్తున్నాయి. వందే భారత్ స్లీపర్ అనేది సుదూర, హై-స్పీడ్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ రైలు, ఇది వేగం, ఆధునిక సౌకర్యాలను మిళితం చేయడానికి రూపొందించారు. త్వరలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ వెర్షన్‌ను ప్రారంభించనున్నాయి.

  • Phani CH
  • Updated on: Oct 23, 2025
  • 4:14 pm

Vande Bharat: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. సికింద్రాబాద్‌ నుంచి మరో రెండు కొత్త వందే భారత్‌ రైళ్లు!

హైదరాబాద్, పూణే మధ్య సికింద్రాబాద్-నాందేడ్ మార్గంలో రెండు కొత్త వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దీంతో తెలంగాణ, మహారాష్ట్రల మధ్య రైలు కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది. ఈ సేవలు ప్రయాణ సమయాన్ని రెండు నుండి మూడు గంటలు తగ్గిస్తాయని రైల్వే అధికారులు భావిస్తున్నారు.

  • SN Pasha
  • Updated on: Sep 26, 2025
  • 7:08 am

Vande Bharat Express: హైదరాబాద్ – బెంగళూరు మధ్య ప్రయాణించే వారికి గుడ్ న్యూస్.. పూర్తి వివరాలు ఇదిగో..

హైదరాబాద్ నుంచి బెంగళూరు ప్రయాణించే రైలు ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. అధిక డిమాండ్ కారణంగా వందే భారత్ ట్రైన్ కోచ్‌ల సంఖ్యను 16 కి పెంచుతూ ఇండియన్ రైల్వే ఉత్తర్వులు జారీ చేసింది. కాచిగూడ - యశ్వంత్‌పూర్ - కాచిగూడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు 16 కోచ్‌లతో జులై 10 2025 నుంచి అందుబాటులో రానుంది.

ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్.. విజయవాడ-బెంగళూరు మధ్య వందే భారత్.. ఏకంగా 9 గంటల్లోనే..

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో విజయవాడ - బెంగళూరు మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ నడిపేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రతిపాదనలను సిద్ధం చేసింది. షెడ్యూల్‌తో పాటు ప్రయాణ సమయం తొమ్మిది గంటలుగా రైల్వే శాఖ నిర్ణయించింది. దీంతో ప్రయాణికులకు దాదాపు మూడు గంటల ప్రయాణ సమయం ఆదా అవుతుంది..

Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై చిప్స్, బిస్కెట్స్, కూల్ డ్రింక్స్ కూడా…

వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు దేశవ్యాప్తంగా పరుగులు తీస్తున్నాయి. దాదాపు అన్ని నగరాలకు కనెక్ట్ అయిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించే ప్రయాణీకులు ఇప్పుడు తమ ప్రయాణ సమయంలో..

Vande Bharat Train: వందే భారత్ రైలులో చైన్‌ పుల్లింగ్‌ ఆప్షన్‌ ఉంటుందా? ఉండదా?

Vande Bharat Train: మన భారత రైల్వే ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉంది. దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థలో ఒకటిగా ఉంది. భారత రైల్వేలో ఎన్నో అత్యాధునిక రైళ్లను ప్రవేశపెడుతున్నారు. ఇక వందేభారత్‌ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. అత్యాధునిక సదుపాయలతో పాటు టెక్నాలజీతో కూడిన రైలు ఇది. ఇందులో చైన్‌ పుల్లింగ్‌ ఆప్షన్‌ ఉంటుందా? లేదా అనే అనుమానం అందరిలో ఉంటుంది. ఒక వేళ ఉండకుంటే అందుకు కారణం ఏంటి?

Indian Railways: త్వరలో 100 అమృత్‌ భారత్‌ రైళ్లు.. తెలుగు రాష్ట్రాలకు భారీగా కేటాయింపులు.. కాజీపేటలో..

2026లోపు దేశమంతా కవచ్‌ టెక్నాలజీ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర రైల్వే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ముఖ్య స్టేషన్ల పరిధిలో కవచ్‌ టెక్నాలజీని వేగంగా ఏర్పాటు చేస్తున్నామని, త్వరలో అన్ని చోట్ల పూర్తిచేస్తామని తెలిపారు. అలాగే.. సికింద్రాబాద్‌లో కవచ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకపై ఎల్‌టీసీ కింద రైళ్లలోనూ ప్రయాణం చేయొచ్చు..

ఇప్పటి వరకు ఎల్‌టీసీ కింద రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రయాణించడానికి అనుమతి ఉంది. ఇకపై తేజస్, వందే భారత్, హమ్‌ సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలోనూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రయాణించడానికి అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకున్నామని.. డీవోపీటీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎల్‌టీసీ ద్వారా రైలు ప్రయాణాలు చేసేటప్పుడు జీతంతో కూడిన సెలవుతోపాటు, టికెట్లపై రీయింబర్స్‌మెంట్‌ కూడా పొందనున్నారు.