Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై చిప్స్, బిస్కెట్స్, కూల్ డ్రింక్స్ కూడా…
వందేభారత్ ఎక్స్ప్రెస్లు దేశవ్యాప్తంగా పరుగులు తీస్తున్నాయి. దాదాపు అన్ని నగరాలకు కనెక్ట్ అయిన వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది.. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ప్రయాణించే ప్రయాణీకులు ఇప్పుడు తమ ప్రయాణ సమయంలో..

వందేభారత్ ఎక్స్ప్రెస్లు దేశవ్యాప్తంగా పరుగులు తీస్తున్నాయి. దాదాపు అన్ని నగరాలకు కనెక్ట్ అయిన వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది.. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ప్రయాణించే ప్రయాణీకులు ఇప్పుడు తమ ప్రయాణ సమయంలో చిప్స్, శీతల పానీయాలు, బిస్కెట్లు, ఇతర ప్యాక్ చేసిన ఆహార పదార్థాలను ఆస్వాదించవచ్చని పేర్కొంది.. గోరఖ్పూర్-అయోధ్య-లక్నో-ప్రయాగ్రాజ్ వందే భారత్ ఎక్స్ప్రెస్తో ఈ కొత్త సేవ అధికారికంగా ప్రారంభించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. మీడియా నివేదికల ప్రకారం, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రయాణీకుల సౌకర్యాన్ని పెంచడానికి ముందుగా బుక్ చేసుకున్న భోజనంతో పాటు, వెండర్ ట్రాలీల ద్వారా ఈ రెడీ-టు-ఈట్, పానీయాల ఎంపికలను ప్రవేశపెట్టింది. రైల్వే బోర్డు కూడా ఈ చొరవను అధికారికంగా ఆమోదించింది.
త్వరలో అన్ని వందే భారత్ రైళ్లకు విస్తరణ..
రైల్వే బోర్డు ఆమోదం తర్వాత.. IRCTC గోరఖ్పూర్ మార్గంలో ప్యాకేజ్డ్ ఫుడ్ సర్వీస్ను ప్రారంభించింది.. దేశవ్యాప్తంగా నడుస్తున్న అన్ని వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ఈ సౌకర్యాన్ని విస్తరించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం, ప్రయాణీకులు టిక్కెట్లు బుక్ చేసుకునేటప్పుడు అల్పాహారం, లంచ్/డిన్నర్ తో సహా వారి ఎంపికలను ముందస్తుగా బుక్ చేసుకోవాలి. భోజన బుకింగ్ను దాటవేసే వారు తరచుగా ప్రయాణ సమయంలో అసౌకర్యాన్ని ఎదుర్కొంటారు.. టీ, కాఫీ లేదా అందుబాటులో ఉన్న తక్షణ స్నాక్స్ వంటి పరిమిత ఎంపికలపై మాత్రమే ఆధారపడతారు.
ప్రయాణీకులకు సౌకర్యాలను పెంచడం కోసం..
వందే భారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణాన్ని సులభతరం, మరింత ఆనందదాయకంగా మార్చడమే ఈ కొత్త చొరవ లక్ష్యం. గతంలో, భోజనాన్ని ముందస్తుగా బుక్ చేసుకోని ప్రయాణీకులు ప్రాథమిక రెడీ-టు-ఈట్ వస్తువుల కోసం విక్రేతలను అభ్యర్థించాల్సి వచ్చింది. ఇప్పుడు, రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్తో, విస్తృత శ్రేణి ప్యాకేజ్డ్, డిస్పోజబుల్ (PAD) వస్తువులు ప్రయాణ సమయంలో అమ్మకానికి అందుబాటులో ఉంటాయి.
IRCTC ప్రకారం, గోరఖ్పూర్-లక్నో-ప్రయాగ్రాజ్ మార్గంలో PAD వస్తువుల అమ్మకాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. సెమీ-హై-స్పీడ్ వందే భారత్ రైళ్లలోని ప్రయాణీకులకు అగ్రశ్రేణి ప్రయాణ అనుభవాలను అందించడానికి భారతీయ రైల్వేలు చేస్తున్న విస్తృత ప్రయత్నంలో ఈ చర్య భాగం.
ప్రయాణీకులకు మెరుగైన భోజన సౌకర్యం..
గత నెలలో, వందే భారత్ రైళ్లలోని ప్రయాణికులు టికెట్ బుకింగ్ సమయంలో ఎటువంటి ఆహార ఎంపికలను ఎంచుకోకపోయినా, వారు ఇప్పుడు ఆన్బోర్డ్లోనే ఆహారాన్ని కొనుగోలు చేయవచ్చని రైల్వే బోర్డు తెలిపింది. “వందే భారత్ రైళ్లలో కరెంట్ బుకింగ్, నాన్-ఆప్టెడ్ ప్రయాణీకులకు ఎంపికలు, సేవల ఎంపిక, తగినంత క్యాటరింగ్ సౌకర్యాలను అందించడానికి, వందే భారత్ రైళ్లలో ఆహార పదార్థాల అమ్మకం, సేవలను IRCTC (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) తిరిగి ప్రారంభింస్తుంది” అని రైల్వే బోర్డు IRCTC ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్కు పంపిన సర్క్యులర్లో తెలిపింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..