AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మరదలిపై కన్నేసిన అక్క భర్త.. పెళ్లి వేళ ట్విస్ట్ ఇచ్చాడు.. మరి ఆ యువతి ఏం చేసిందంటే..!

Telangana: అక్క భర్త అంటే ఇంటికి పెద్దగా భావిస్తారు ఏ కుటుంబం అయినా. కానీ ఈ వ్యక్తి గురించి తెలిస్తే మాత్రం ఛీ అని అసహ్యించుకుంటారు.

Telangana: మరదలిపై కన్నేసిన అక్క భర్త.. పెళ్లి వేళ ట్విస్ట్ ఇచ్చాడు.. మరి ఆ యువతి ఏం చేసిందంటే..!
Khammam
Shiva Prajapati
|

Updated on: Mar 26, 2022 | 9:34 PM

Share

Telangana: అక్క భర్త అంటే ఇంటికి పెద్దగా భావిస్తారు ఏ కుటుంబం అయినా. కానీ ఈ వ్యక్తి గురించి తెలిస్తే మాత్రం ఛీ అని అసహ్యించుకుంటారు. వీడి చర్య వల్ల ఓ యువతి నిండు ప్రాణం పోయింది. అప్పటికే అక్కను పెళ్లి చేసుకున్నాడు.. తండ్రి లేని ఇంటికి పెద్దగా భావించారంతా. కానీ, అతని బుద్ధికి చెదలు పట్టింది. భార్య చెల్లిపై కన్నేశాడు. ఆమెకు కూడా పెళ్లి చేసుకోవాలని భావించాడు. అప్పటికే ఆ యువతికి పెళ్లి నిశ్చయమైనా.. తననే పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేస్తూ వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టాడు. అయితే, బావ వేధింపులు తాళలేక.. యువతి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా ఎన్కూరు మండలంలోని భగవాన్ నాయక్ తండాకు చెందిన గుగులోతు శ్రీను, చిన్ని దంపతులు. వీరికి ఐదుగురు ఆడపిల్లలు ఉన్నారు. కొన్నాళ్ల క్రితం శ్రీను అనారోగ్యంతో చనిపోయాడు. దాంతో ఆ ఐదుగురు ఆడ పిల్లలను తల్లి అయిన చిన్ని పోషిస్తూ వచ్చింది. అలా తన ఐదుగురు ఆడ పిల్లల్లో నలుగురికి వివాహం చేసింది. చిన్న అమ్మాయికి కూడా అబ్బాయిని చూసి పెళ్లి నిశ్చయించారు. ఏప్రిల్ 10వ తేదీన పెళ్లి ముహూర్తం ఖరారు చేశారు. పెళ్లికి సంబంధించి అన్ని పనులు చేసుకుంటున్నారు.

అయితే, మూడు అమ్మాయి భర్త సంతోష్.. ఆ అమ్మాయిపై కన్నేశాడు. తన మరదలిని తానే దక్కించుకోవాలని భావించాడు. ఎలాగైనా ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఆ క్రమంలో తనలోని షాడిజాన్ని ప్రదర్శించడం మొదలు పెట్టాడు. తననే పెళ్లి చేసుకోవాలంటూ యువతిపై ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టాడు. ఇంట్లో వారిని కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో సంతోష్ వేధింపులు భరించలేక తల్లితో పాటు.. చిన్న కూతురు ఇంటిని వదిలి వేరే ఇంటికి మకాం మార్చారు. అయినా వదలని సంతోష్.. వారు ఉన్న చోటకు వచ్చి ఘర్షణకు దిగాడు. ఇలా సంతోష్ వేధింపులు మరింత తీవ్రం అవడంతో.. తీవ్ర మనస్తాపానికి గురైంది యువతి. ఈ క్రమంలో ఈనెల 22వ తేదీన అర్థరాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. పరుగులు మందు తాగిన తరువాత వాంతులు చేసుకుంటుండంతో గమనించిన కుటుంబ సభ్యులు.. హుటాహుటిన ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది యువతి. అల్లుడు సంతోష్ వేధింపుల కారణంగా తన కూతురు ఆత్మహత్య చేసుకుందని బాధిత తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సంతోష్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

Yadadri Temple: నవ వైకుంఠం మన యాదాద్రి.. ఇక్కడి విగ్రహాలు, గోపురాల ప్రత్యేకత ఏంటో ఇప్పుడే తెలుసుకోండి..!

Gold Mines: రాష్ట్రంలో బంగారు నిక్షేపాలు.. పది చోట్ల గుర్తించిన పరిశోధకులు.. ఆ ప్రాంతాలేంటంటే..!

Mirracle: అద్భుతం అంటే ఇదే మరి.. అతనికి వచ్చిన కళ నిజమైంది.. చెప్పిన చోట శివలింగం ప్రత్యక్ష్యమైంది..!