AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

20 ఏళ్ల తర్వాత తెలంగాణలో కొడుకు ఆచూకీ లభ్యం.. వెతుక్కుంటూ వచ్చిన యూపీ కుటుంబం

20 ఏళ్ల క్రితం ముంబైలో తప్పిపోయిన ఓ బాలుడు 30 ఏళ్ల యువకుడై తిరిగి రావడంతో ఆ కుటుంబ సభ్యుల్లో ఆనంద వెల్లివెరిసింది. ఉఫాది కోసం ఉన్న ఊరు వదిలి వలస వెళ్లిన ఓ కుటుంబంలోని కొడుకు మిస్ అవడం.. ఆ తర్వాత కుటుంబానికి‌ దూరమైన ఆ కొడుకు కూలీగా మారడం.. 20 ఏళ్ల తర్వాత తమ కొడుకు క్షేమంగా ఉన్నాడని తెలియడంతో కొడుకును‌ వెతుక్కుంటూ కుటుంబమంతా పరుగు పరుగున అక్కడి చేరుకోవడం సినిమా కథను తలపించింది.

20 ఏళ్ల తర్వాత తెలంగాణలో కొడుకు ఆచూకీ లభ్యం.. వెతుక్కుంటూ వచ్చిన యూపీ కుటుంబం
Family
Naresh Gollana
| Edited By: |

Updated on: Jul 29, 2023 | 11:09 AM

Share

మంచిర్యాల జిల్లా జులై 29: 20 ఏళ్ల క్రితం ముంబైలో తప్పిపోయిన ఓ బాలుడు 30 ఏళ్ల యువకుడై తిరిగి రావడంతో ఆ కుటుంబ సభ్యుల్లో ఆనంద వెల్లివెరిసింది. ఉఫాది కోసం ఉన్న ఊరు వదిలి వలస వెళ్లిన ఓ కుటుంబంలోని కొడుకు మిస్ అవడం.. ఆ తర్వాత కుటుంబానికి‌ దూరమైన ఆ కొడుకు కూలీగా మారడం.. 20 ఏళ్ల తర్వాత తమ కొడుకు క్షేమంగా ఉన్నాడని తెలియడంతో కొడుకును‌ వెతుక్కుంటూ కుటుంబమంతా పరుగు పరుగున అక్కడి చేరుకోవడం సినిమా కథను తలపించింది. తమ కొడుకు తెలంగాణలో‌ క్షేమంగా ఉన్నాడని తెలియడంతో ఆ కుటుంబం ఆనందంతో ఉప్పొంగిపోతోంది. 20 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు అయిన‌వారిని కలుసుకోవడంతో ఆ కొడుకు ఆనందం అంతా ఇంతా కాదు. వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ జిల్లా తాసిల్ మొహందాబాద్ రఘువర్ గంజ్ గ్రామానికి చెందిన మహేందర్ బింద్ అనే బాలుడు ఐదవ తరగతి చదువుతున్న సమయంలో మహారాష్ట్రలోని ముంబైకి కుటుంబంతో కలిసి చుట్టపు చూపుగా వెళ్లారు‌. పని కోసం తండ్రి బయటకు వెళ్లగా కొడుకును‌ తీసుకుని తల్లి మరో చోట పని వెతుక్కుంటూ వెళ్లింది. ఆ సమయంలో కొడుకు మిస్ అవడంతో తల్లి ఆందోళనకు గురైంది. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి‌ గాలించినా లాభం లేకుండా పోయింది. మహానగరంలో కొడుకు జాడ తెలియక ఉఫాది కానరాక తిరిగి స్వగ్రామానికి తిరిగి వెళ్లారు మహేందర్ బింద్ తల్లిదండ్రులు.

చివరికి మహేందర్ బిన్ ముంబాయిలోని ఓ బేకరీలో పనికి‌ కుదిరాడు. అక్కడే పని చేస్తూ జీవనం సాగించాడు. ఈ క్రమంలో బెల్లంపల్లిలో ఓ బేకరీలో పనిచేస్తున్న శివకుమార్ యాదవ్ ముంబైకి వెళ్లడంతో అక్కడ మహేందర్ బింద్ కలిశాడు. పని కోసం బెల్లంపల్లిలోని మనీషా బేకరీకి మహేందర్ తీసుకువచ్చాడు శివకుమార్. మహేందర్ బింద్ అనే యువకుడు తనది ఘాజీపూర్ జిల్లా అని చెప్పడంతో శివ కుమార్ కూడా తనది ఉత్తరప్రదేశ్ అని చెప్పడంతో తన కుటుంబ సభ్యులు దొరుకుతారేమోనని ఆశపడ్డాడు. ఇదే సమయంలో శివ కుమార్ యాదవ్ ఘాజీపూర్ పోలీసులకు మహేందర్ బింద్ కోసం సమాచారం అందించాడు. అడ్రస్ దొరకడంతో మహేందర్ బింద్ వివరాలను కుటుంబ సభ్యులకు చేరవేశారు పోలీసులు.

వెంటనే తల్లి సంత్ర బింద్, చిన్నమ్మ బసంత్ బింద్, బాబాయి కమలేష్ బింద్ తో కలిసి కుటుంబమంతా ఆనందంతో‌ ఘాజీపూర్ నుండి తెలంగాణలోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చేరింది. పుట్టుమచ్చల ఆధారంగా కొడుకును గుర్తు పట్టిన తల్లి సంత్ర బింద్ ఆనందంతో ఉప్పొంగి పోయింది. 30 ఏళ్ల కుమారుడిని చూసి ప్రేమతో హత్తుకొని మురిసిపోయింది ఆ కుటుంబం. శివ కుమార్ యాదవ్ సాయంతో తమ కొడుకు మళ్లీ తమకు దక్కడం తో అతనికి కృతజ్ఞతలు తెలిపారు మహేందర్ కుటుంబ సభ్యులు. ఎట్టకేలకు కుమారుని తీసుకొని బెల్లంపల్లి నుంచి రప్తి సాగర్ ఎక్స్ ప్రెస్ రైలు లో ఉత్తర్ ప్రదేశ్ కు బయలుదేరి వెళ్లింది కుటుంబం.

ఇవి కూడా చదవండి

Follow Us
తెలంగాణ పోలీస్‌శాఖ కీలక నిర్ణయం
తెలంగాణ పోలీస్‌శాఖ కీలక నిర్ణయం
వర్షాకాలంలో ఫ్రిజ్‌లో ఒక గిన్నెడు ఉప్పు ఎందుకు పెట్టాలో తెలుసా?
వర్షాకాలంలో ఫ్రిజ్‌లో ఒక గిన్నెడు ఉప్పు ఎందుకు పెట్టాలో తెలుసా?
ఒక్కరోజులోనే మొటిమలు మాయం.. ఇంట్లోనే సింపుల్‌గా ఇలా చేస్తే చాలు..
ఒక్కరోజులోనే మొటిమలు మాయం.. ఇంట్లోనే సింపుల్‌గా ఇలా చేస్తే చాలు..
వివాహానికి రాహువు అడ్డంకిగా మారుతున్నాడా? ఈ జ్యోతిష్య పరిహారాలతో
వివాహానికి రాహువు అడ్డంకిగా మారుతున్నాడా? ఈ జ్యోతిష్య పరిహారాలతో
డీఎస్పీ భీమ్‌రెడ్డి అక్రమాస్తుల కేసు: ఏసీబీ దాడుల్లో భారీ ఆస్తులు
డీఎస్పీ భీమ్‌రెడ్డి అక్రమాస్తుల కేసు: ఏసీబీ దాడుల్లో భారీ ఆస్తులు
పీఎఫ్ విత్ డ్రా కొత్త రూల్స్.. ఏడాదికి రెండుసార్లు మాత్రమే..
పీఎఫ్ విత్ డ్రా కొత్త రూల్స్.. ఏడాదికి రెండుసార్లు మాత్రమే..
50 ఏళ్ల వయసులో ప్రియురాలిని పెళ్లాడిన ప్రముఖ నటుడు.. ఫొటోస్ వైరల్
50 ఏళ్ల వయసులో ప్రియురాలిని పెళ్లాడిన ప్రముఖ నటుడు.. ఫొటోస్ వైరల్
వెండి వస్తువులు నల్లగా అయ్యాయా.. ఇంట్లోనే ఇలా చేస్తే నిమిషాల్లోనే
వెండి వస్తువులు నల్లగా అయ్యాయా.. ఇంట్లోనే ఇలా చేస్తే నిమిషాల్లోనే
ఇతరులను అవమానిస్తే అదే తిరిగి వస్తుంది.. నక్క- కొంగ కథ
ఇతరులను అవమానిస్తే అదే తిరిగి వస్తుంది.. నక్క- కొంగ కథ
పూజ గదిలో దేవతల విగ్రహాలను ఎలా అమర్చాలి? గణపతికి ఏ స్థానం ఇవ్వాలి
పూజ గదిలో దేవతల విగ్రహాలను ఎలా అమర్చాలి? గణపతికి ఏ స్థానం ఇవ్వాలి