Telangana Municipal Elections 2026 Live: 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్

Telangana Municipal Corporation Elections 2026 Live updates in Telugu: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మరికాసేపట్లో పురపోరు పోలింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్ జరగనుండగా, ఇందుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఎన్నికల్లో మొత్తం 52 లక్షల 17 వేల 413 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

Telangana Municipal Elections 2026 Live: 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్
Telangana Municipal Elections

Updated on: Feb 11, 2026 | 9:21 AM

LIVE NEWS & UPDATES

  • 11 Feb 2026 09:21 AM (IST)

    పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్‌ చంద్రశేఖర్‌

    ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మున్సిపల్‌ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే పట్టణ ఓటర్లు పోలింగ్ బూతుల మధ్య క్యూ కట్టారు. పోలింగ్ సరళని నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ పరిశీలించారు. జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని కలెక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటేసేలా ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటివరకూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని, ఈసారి పోలింగ్ శాతం పెరుగుతుందని భావిస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. అన్ని కేంద్రాల్లో వెబ్ కాస్ట్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించి, తగిన సూచనలు ఇస్తున్నామన్నారు.

  • 11 Feb 2026 09:18 AM (IST)

    కుటుంబ సమేతంగా ఓటేసిన మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్

    వికారాబాద్‌ మున్సిపాలిటీకి పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్. పోలింగ్ శాతం పెంచడానికి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఇక ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్‌ బూత్‌లకు క్యూ కట్టారు.

  • 11 Feb 2026 08:14 AM (IST)

    అభ్యర్థి కుటుంబానికి కిషన్ రెడ్డి పరామర్శ

    నారాయణపేట్ జిల్లా మక్తల్‌ మున్సిపాలిటీ పరిధిలో బీజేపీ అభ్యర్థి మరణంతో 6వార్డులో ఎన్నిక వాయిదా పడింది. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన మహదేవ్‌ ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రత్యర్థుల ఒత్తిళ్లవల్లే సూసైడ్‌ చేసుకున్నట్టు ఆరోపణలు రావడంతో BJP దీన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. కాగా, అభ్యర్థి మహాదేవ్ కుటుంబాన్ని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పరామర్శించారు. బుధవారం కిషన్‌రెడ్డి ఈ అంశాన్ని లోక్‌సభలో కూడా ప్రస్తావించారు. ఎంపీ డీకే అరుణ, బీజేపీ కార్యకర్తలతో కలిసి మహదేవ్‌ ఇంటికి వెళ్లిన కిషన్‌రెడ్డి.. ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు. పార్టీ పరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

  • 11 Feb 2026 07:34 AM (IST)

    ఓటర్‌ కార్డు లేకపోయినా పర్లేదు..!

    ఓటు వేయడానికి ఓటర్‌ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.

    ఈ పత్రాల ద్వారా కూడా మీ ఓటు వేయవచ్చుః

    1. ఆధార్ కార్డ్

    2. పాస్‌పోర్ట్

    3. డ్రైవింగ్ లైసెన్స్

    4. PAN కార్డ్

    5. హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డ్

    6. అధికారిక గుర్తింపు కార్డ్

    7. పెన్షన్ డాక్యుమెంట్ (ఫోటోతో)

    8. సర్వీస్ ఐడెంటిటీ కార్డ్

    9. స్మార్ట్‌కార్డ్ (RGI ద్వారా జారీ చేయబడింది)

    10. బ్యాంక్ పాస్‌బుక్ (ఫోటోతో)

    11. దివ్యాంగ్ ప్రత్యేక ID

  • 11 Feb 2026 07:21 AM (IST)

    ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్

    – ఒక కార్పోరేషన్‌.. 10 మున్సిపాలిటీలకు ఎన్నికలు

    — 328 వార్డుల్లో ఓటు వేయనున్న6,69,212 ఓటర్లు

    — సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత పెంపు

    — భైంసా, నిర్మల్, కాగజ్ నగర్, క్యాతన్ పల్లిలో బలగాల మోహరింపు

    — అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గా 432

    — సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 130

    — అత్యంత సమస్యాత్మక మున్సిపాలిటీ బైంసా పై ఫోకస్ పెట్టిన పోలీసులు

  • 11 Feb 2026 07:13 AM (IST)

    పోలింగ్‌ను పరిశీస్తున్న ఎస్ఈసీ రాణి కుముదిని

    తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ మొదలైంది. పోలింగ్ సరళిని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ రాణి కుముదిని పరిశీలించారు. ఎన్నికల సంఘం బిల్డింగ్‌లో వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ సరళి ఆమె పరిశీలించారు. ఎన్నికల పరిశీలకులు, కలెక్టర్ల ద్వారా ఎప్పటికప్పుడు వివరాలను అందించాలని సూచించారు.

  • 11 Feb 2026 07:11 AM (IST)

    భైంసాలో పరిస్థితి ఉద్రిక్తం

    –నిర్మల్ జిల్లా భైంసాలో ఉద్రిక్త పరిస్థితులు

    –9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి భర్త అరవింద్‌పై స్వతంత్ర అభ్యర్థి భర్త దాడి

    –అరవింద్‌తో పాటు ఆయన కారు డ్రైవర్‌ మునీమ్‌పై దాడి

    –ఏజెంట్‌ ఫామ్స్‌ ఫిల్ చేస్తుండగా దాడి చేశారని ఆరోపణలు

    –సీసీ కెమెరాల్లో రికార్డ్‌ అయిన దాడి దృశ్యాలు

    –పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు అరవింద్

  • 11 Feb 2026 07:10 AM (IST)

    ఖమ్మం ఓటరు తీర్పు ఎవరికో..!

    — ఖమ్మం ఓటరు తీర్పు ఎప్పుడూ కాస్త విలక్షంగానే ఉంటుంది.

    — కాంగ్రెస్‌, BRS, BJP, కమ్యూనిస్టులు ఎవరికివారు సత్తా చాటుతామనే ధీమాలో ఉన్నారు.

    — జిల్లా మంత్రులు ముగ్గురూ కూడా తమ తమ పరిధిలో ఆధిపత్యం కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నారు.

    — ఖమ్మం జిల్లాలో ఒక కార్పొరేషన్‌, 7మున్సిపాలిటీల్లో ఇవాళ పోలింగ్‌ జరుగుతోంది..

    — కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి.. అలాంటి చోట భద్రత రెట్టింపు చేశారు.

  • 11 Feb 2026 07:08 AM (IST)

    ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పోలింగ్ షురూ

    ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 2 కార్పొరేషన్లు, 13మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రారంభమైంది.

    –కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లలో పోలింగ్‌ జరుగుతుంది.

    –126 డివిజన్లలో 713 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

    –13 మున్సిపాలిటీల్లో 1,570 మంది అభ్యర్థుల పోటీలో ఉన్నారు.

    –1,581 పోలింగ్ కేంద్రాలు దగ్గర 8వేల900 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో ఉన్నారు.

  • 11 Feb 2026 07:07 AM (IST)

    మహబూబ్‌ నగర్ కార్పొరేషన్ సహా 18 మున్సిపాలిటీలకు ఎన్నికలు

    — ఉమ్మడి మహబూబ్‌ నగర్ జిల్లాలో మున్సిపల్ పోలింగ్

    — ఒక కార్పొరేషన్, 18 మున్సిపాలిటీలకు ఎన్నికలు

    — అందులో 59 డివిజన్‌లు, 314 వార్డుల.

    — ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 971 పోలింగ్ కేంద్రాలు

    — మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 58వ డివిజన్ ఏకగ్రీవం కాగా..

    అలంపూర్‌లో 10వ వార్డు కూడా ఏకగ్రీవం అయ్యింది

    — మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 6వార్డులో బీజేపీ అభ్యర్థి మరణంతో ఎన్నిక వాయిదా పడింది.

    — మున్సిపల్ బరిలో 15వందల 70 మంది అభ్యర్థులు

  • 11 Feb 2026 07:03 AM (IST)

    ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 17 మున్సిపాలిటీల్లో పోలింగ్

    — ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మున్సిపల్ పోలింగ్ జరుగుతోంది

    — ఒక కార్పొరేషన్‌.. 17 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి

    — మంత్రులంతా కూడా ఎలక్షన్‌ను సీరియస్‌గానే తీసుకున్నారు.

    — విపక్షాలు కూడా ప్రచారం హోరెత్తించాయి.

    – మొత్తం కార్పొరేషన్‌, మున్సిపాలిటీల్లో కలిపి మొత్తం 6లక్షల 68వేల మంది ఓటర్లు ఇప్పుడు తీర్పు ఇవ్వబోతున్నారు.

  • 11 Feb 2026 07:02 AM (IST)

    ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 7 మున్సిపాలిటీలకు పోలింగ్

    — ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ సహా 7 మున్సిపాలిటీలకు ఎన్నికలు

    — మొత్తం వార్డులు 238, పోలింగ్ కేంద్రాలు 968

    — బరిలో ఉన్న అభ్యర్థులు 1,161

    — ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 6,44,990 మంది ఓటర్లు

    — 3 వేల మంది పోలీసులతో బందోబస్తు

    — అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 247గా గుర్తింపు

  • 11 Feb 2026 07:01 AM (IST)

    వరంగల్‌ జిల్లాలో 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు

    ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు

    260 వార్డులకు జరుగుతున్న ఎన్నికల్లో 1073 మంది అభ్యర్థుల పోటీ

    ఓటింగ్ శాతం పెంచేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు

  • 11 Feb 2026 06:59 AM (IST)

    సీతారాంపేట్‌లో ఉద్రిక్తత

    రంగారెడ్డి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపేట్‌లో ఉద్రిక్తత నెలకొంది. గడువు ముగిసినా పలువురు ఇంకా ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. ఇతర గ్రామాల వాళ్లు ఇంకా ప్రచారం చేస్తున్నారని BRS కౌన్సిలర్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ ఆందోళనతో టెన్షన్ వాతావరణం నెలకొనడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళన చేస్తున్న వారిని చెదరగొట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • 11 Feb 2026 06:58 AM (IST)

    చెన్నూరులో టెన్షన్ వాతావరణం

    మంచిర్యాల జిల్లా చెన్నూరులో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. BRS నేత, మాజీ జడ్పీ వైస్‌ చైర్మన్ మూల రాజిరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్‌ చేశారు. కాంగ్రెస్‌కు ఓటమి భయం పట్టుకుందని BRS ఆరోపించింది. అందుకే సోదాల పేరుతో తమ కార్యకర్తలను ఇబ్బందిపెడుతున్నారని రాజిరెడ్డి విమర్శించారు.

  • 11 Feb 2026 06:56 AM (IST)

    తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ షురూ..!

    116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో మొదలైన పోలింగ్

    సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్

    116 మున్సిపాలిటీల్లోని 2,569 వార్డులకు పోలింగ్

    బరిలో నిలిచిన 10,719 మంది అభ్యర్థులు

    7 మున్సిపల్ కార్పొరేషన్లలోని 412 వార్డులకు ఎన్నికలు

    పోటీలో నిలిచిన 2,225 మంది అభ్యర్థులు

    ఓటు హక్కు వినియోగించుకోనున్న 52 లక్షల 17 వేల 413 మంది ఓటర్లు

    పోలింగ్ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

    అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు

    ఎన్నికల నిర్వహణ కోసం 1,379 మంది రిటర్నింగ్ అధికారులు

    41,773 మంది పోలింగ్ సిబ్బందిని నియమించిన ఎన్నికల సంఘం

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మరికాసేపట్లో పురపోరు పోలింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్ జరగనుండగా, ఇందుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఎన్నికల్లో మొత్తం 52 లక్షల 17 వేల 413 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో పురుషులు 25.61 లక్షల మందికాగా, మహిళలు 26.80 లక్షల మంది ఉన్నారు. వీరి కోసం 8 వేల 191 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఇక ఈ ఎన్నికల కోసం మొత్తం 16 వేల 031 బ్యాలెట్ బాక్సులను వినియోగిస్తున్నారు. బ్యాలెట్ బాక్సులను భద్రపరిచేందుకు 137 స్ట్రాంగ్ రూమ్‌లను సిద్ధం చేశారు. ఓట్ల లెక్కింపు కోసం 136 సెంటర్లను సిద్ధం చేశారు

మొత్తం 116 మున్సిపాలిటీల్లోని 2 వేల 569 వార్డులకు పోలింగ్ జరగనుంది. తొమ్మిది మున్సిపాలిటీల్లో 12 మంది అభ్యర్థులు ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మున్సిపాలిటీల్లో అధికార కాంగ్రెస్ నుంచి 2 వేల 358 మంది, బీఆర్ఎస్ నుంచి 2 వేల 478 మంది, బీజేపీ నుంచి 2 వేల 252 మంది సహా మొత్తం 10 వేల 719 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మున్సిపాలిటీల కోసం 6 వేల 17 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ఇక 7 మున్సిపల్ కార్పొరేషన్లలోని 412 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మహబూబ్‌నగర్, రామగుండం కార్పొరేషన్లలో రెండు వార్డుల్లో అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. ఈ కార్పొరేషన్లలో కాంగ్రెస్ నుంచి 410, బీఆర్ఎస్ నుంచి 401, బీజేపీ నుంచి 382 మంది సహా మొత్తం 2 వేల 225 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. కార్పొరేషన్ల పరిధిలో 2 వేల 174 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

పోలింగ్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు రాష్ట్రంలో వెయ్యి 302 అత్యంత సమస్యాత్మకమైన కేంద్రాలు, వెయ్యి 926 కేంద్రాలను సమస్యాత్మకమైన కేంద్రాలు గుర్తించి అక్కడ అదనపు బలగాలను మోహరించారు. పారదర్శకత కోసం అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశామని, సమస్యాత్మక ప్రాంతాల్లోని కేంద్రాల బయట నిఘా కెమెరాలు కూడా ఉపయోగిస్తున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం వెయ్యి 379 మంది రిటర్నింగ్ అధికారులు, 41 వేల 773 మంది పోలింగ్ సిబ్బందిని నియమించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. వీరిలో జనల్ అధికారులు 742 మంది, FST బృందాలు 279 మంది, SST బృందాలు 381 మంది, అసిస్టెంట్‌ ఆర్వోలు వెయ్యి 547 ఉన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..