Munugode Bypoll: మునుగోడు బీఎస్పీ అభ్యర్థిని ప్రకటించిన ప్రవీణ్ కుమార్
మునుగోడు ఎన్నిక కాక రోజురోజుకు పెరుగుతుంది. పొలిటికల్ పరిణామాలు గంటగంటకు మారిపోతున్నాయి. సెమీ ఫైనల్లో సత్తా చాటాలని అన్ని పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి.

మునుగోడులో అసలైన యుద్ధం మొదలైంది. ఎన్నికల కమిషన్ నుంచి నోటిఫికేషన్ వచ్చేసింది, అటు పార్టీలు కూడా అభ్యర్ధులను ఖరారు చేశాయి. ఊహించినట్టుగానే మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి అధికారపార్టీ టీఆర్ఎస్ టికెట్ కన్ఫామ్ చేసింది. ఇక కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి ఇప్పటికే ప్రచారం చేస్తుండగా.. తాజాగా రాజగోపాల్ రెడ్డిని తమ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించింది బీజేపీ. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే.. బహుజన్ సమాజ్ పార్టీ కూడా తమ అభ్యర్థిని అనౌన్స్ చేసింది. ఆందోజు శంకరా చారిని తమ పార్టీ తరఫున బరిలోకి దింపనున్నట్లు తెలిపింది. ఈ మేరకు తమ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి నుంచి అనుమతి వచ్చినట్లు.. రాష్ట్ర శాఖ అధ్యక్షులు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
It’s official now. Mr Andoju Shankara Chary is #BSP Candidate for 93-Munugode By-election. We all wish him the very best. మునుగోడు ఉప ఎన్నికకు #BSP అభ్యర్థిగా ఎంపికైన ఉన్నత విలువలున్న యువనాయకుడు శ్రీ. ఆందోజు శంకరాచారి గారికి హృదయపూర్వక అభినందనలు. కలుద్దాం-నిలుద్దాం-గెలుద్దాం.✊? pic.twitter.com/741Hu7Hywi
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) October 8, 2022
పార్టీల మధ్య ఎత్తులు.. పై ఎత్తులుతో నియోజకవర్గం వేడెక్కింది.. అప్పుడే మనీ పాలిటిక్స్ కూడా రాజ్యమేలుతున్నాయి.. కోడ్ అమల్లోకి వచ్చిన తొలిరోజే ఏకంగా 13లక్షల రూపాయల నగదు పట్టుకున్నారు. నిఘా కోసం భారీ ఎత్తున బలగాలను, ప్రత్యేక టీమ్లను రంగంలోకి దింపింది ఎన్నికల సంఘం. కాంగ్రెస్ పార్టీ నుంచి పాల్వాయి స్రవంతిని ఇప్పటికే అభ్యర్థిగా ప్రకటించడంతో ఆమె ప్రచారంలో స్పీడు పెంచారు. పీసీసీ సీనియర్ నాయకులు మండలాలవారీగా బాధ్యతలు తీసుకుని మరీ ప్రచారం పరుగులు పెట్టిస్తున్నారు. ఇక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రోజు నుంచే కదనరంగంలో దిగిన బీజేపీ అభ్యర్ధి రాజగోపాల్ రెడ్డి నోటిఫికేషన్ రావడంతో మరింత దూకుడుగా పెంచుతున్నారు. హైకమాండ్ నుంచి వచ్చిన ఇంఛార్జులు.. రాష్ట్ర పార్టీ నాయకత్వం అంతా కూడా ఇక్కడే మకాం వేసి విజయం కోసం శ్రమిస్తున్నారు. ముందు నుంచీ ప్రచారంలో జోరుమీదన్న టీఆర్ఎస్ అభ్యర్ధి విషయంలో చాలకాలం పాటు మేథోమథనం చేసిన చివరకు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే ఓకే చేసింది. గతంలో ప్రాతినిధ్యం వహించిన అనుభవం, ఆర్ధిక, అంగబలం అనుకూలంగా ఉండటంతో మొగ్గుచూపారు.
బీసీలు కీలకం.. కానీ రెడ్లకే టికెట్లు
మునుగోడులో బీసీలు బలంగా ఉన్నారు. వారి ఓటు బ్యాంకే ఎన్నికల్లో కీలకం, కానీ ప్రధానపార్టీలు రెడ్డి సామాజికవర్గానికే టికెట్ ఇవ్వడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడ సామాజిక వర్గం కంటే కూడా అభ్యర్ధి ఎంపికలో మనీ పాలిటిక్స్ కీలకపాత్ర పోషించినట్టు చెబుతున్నారు. సహజంగానే రాజగోపాల్ రెడ్డి సిట్టింగ్ కావడం, బీజేపీలో బీసీల నుంచి బలమైన నాయకులు స్థానికంగా లేకపోవడంతో ఈ వర్గాల నుంచి పోటీ లేకుండా పోయింది. కానీ కాంగ్రెస్, టీఆర్ఎస్ల నుంచి బీసీ వర్గానికి చెందిన కీలక నేతలు టికెట్లు ఆశించారు. కానీ అధిష్టానాన్ని ఒప్పించలేకపోయారు. మరి ఎన్నికల్లో నియోజకవర్గం ఓటరు నాడి ఎలా ఉండబోతుందో చూడాలి.
మునుగోడులో సామాజికవర్గాలు – ఓటుశాతం మొత్తం ఓటర్లు – 2లక్షల 27వేల 101
ఎస్సీలు – 35,411 (15.6 శాతం)
ఓసీలు – 20,290 (8.9 శాతం)
ఎస్టీలు – 13000 (5.7 శాతం)
మైనారిటీలు- 8000 (3.5 శాతం)
———————
బీసీల్లో
గౌడ – 38,000 (16.7)
గొల్ల, కురుమ -35,000 (15.4)
ముదిరాజ్ -34,500 (15.2)
పద్మశాలి -19,000 (8.4)
వడ్డెర -8300 (3.6)
విశ్వ బ్రాహ్మణ -7800 (3.4)
కుమ్మరి -7800 (3.4)
—————
ఎస్సీలలో
మాదిగ -25000 (11.0)
మాల -10411 (4.6)
——–
ఓసీలలో
రెడ్డి – 7701 (3.3)
కమ్మ -4,880 (2.1)
వెలమ -2,360 (1.0)
వైశ్య -3760 (1.6)
ఇతరులు- 1, 589 (0.9)
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
