AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana:వద్దు మేడమ్‌..వెళ్లొద్దంటూ బోరున ఏడ్చేసిన విద్యార్థులు.. ఎందుకో తెలిస్తే అవాక్కే..!

హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ జరగడంతో 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు..

Telangana:వద్దు మేడమ్‌..వెళ్లొద్దంటూ బోరున ఏడ్చేసిన విద్యార్థులు.. ఎందుకో తెలిస్తే అవాక్కే..!
Varthannapet Tribal Girls
Jyothi Gadda
|

Updated on: Sep 06, 2022 | 7:53 PM

Share

Telangana: వరంగల్‌ జిల్లా వర్థన్నపేట గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. సస్పెండై వెళ్తున్న వార్డెన్‌ను వెళ్లొద్దంటూ విద్యార్థులు కన్నీరుమున్నీరయ్యారు. వద్దు మేడమ్‌..వెళ్లొద్దు మేడమ్‌..అధికారులకు మేం లెటర్‌ రాస్తాం..అంటూ భోరున విలపించారు విద్యార్థులు. పిల్లల ఏడుపు చూసిన స్థానికులు, తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. సదరు వార్డెన్‌ పట్ల విద్యార్థులకున్న అభిమానానికి అందరూ వాపోయారు.

అయితే, ఇదే హాస్టల్‌లో సోమవారం రోజున ఫుడ్ పాయిజన్‌ జరిగి 60మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో వార్డెన్‌పై వేటు వేశారు జిల్లా కలెక్టర్‌. దీంతో రిలీవ్‌ అయి వెళ్తున్న వార్డెన్‌ను అడ్డుకొని వెళ్లొద్దంటూ కన్నీటి పర్యంతమయ్యారు విద్యార్థినులు. అంతేకాదు, వంటమనిషి తప్పిదానికి..వార్డెన్‌ను అకారణంగా సస్పెండ్‌ చేశారంటూ ఆందోళనకు దిగారు. సస్పెన్షన్‌ ఎత్తివేసి వార్డెన్‌ను యథావిథిగా కొనసాగించాలని హాస్టల్‌ ముందు ధర్నా నిర్వహించారు.

హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ జరగడంతో 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. వీరిలో ఐదుగురు పిల్లల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. అడిషనల్ కలెక్టర్ శ్రీ వాస్తవ్ ఎంజీఎంకు చేరుకుని పిల్లల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి