Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుక్కలు బాబోయ్ అంటున్న స్థానికులు.. నష్టపరిహారం కోసం నిరసన..

కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపల్ పరిధిలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. కొత్తపల్లి మున్సిపల్ పట్టణానికి చెందిన అజీజుద్దీన్ ఫైజాన్‎కి చెందిన మేకలను బుధవారం ఉదయం కుక్కలు దాడి చేసి చంపేసాయి. గతంలో ఇదే యువకుడికి చెందిన మేకలను, కోళ్లను కూడా ఇదేవిధంగా దాడి చేసి చంపేసాయి.

కుక్కలు బాబోయ్ అంటున్న స్థానికులు.. నష్టపరిహారం కోసం నిరసన..
Karimnagar
Follow us
G Sampath Kumar

| Edited By: Srikar T

Updated on: May 15, 2024 | 4:37 PM

కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపల్ పరిధిలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. కొత్తపల్లి మున్సిపల్ పట్టణానికి చెందిన అజీజుద్దీన్ ఫైజాన్‎కి చెందిన మేకలను బుధవారం ఉదయం కుక్కలు దాడి చేసి చంపేసాయి. గతంలో ఇదే యువకుడికి చెందిన మేకలను, కోళ్లను కూడా ఇదేవిధంగా దాడి చేసి చంపేసాయి. అయితే దీనిపై యువకుడు గతంలో కూడా పలుమార్లు ఫిర్యాదు చేశారు. కోళ్లు, మేకలు పెంపకం చేపడుతుంటే ఇలా వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ దాడికి పాల్పడి చంపేస్తున్నాయని యువకుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మరోసారి కుక్కలు దాడి చేసి మేకలను చంపేశాయి. దీంతో కొత్తపల్లి మున్సిపల్ కార్యాలయం ముందు యువకుడు నిరసనకు దిగారు.

ఇప్పటివరకు సుమారు రూ.2 లక్షల విలువైన మేకలను తాను వేటకుక్కల దాడిలో కోల్పోయానని చెప్పాడు. అధికారులను అడిగితే నిర్లక్ష్యమైన సమాధానం చెబుతున్నారని అన్నారు. దీనికి సంబంధించి మున్సిపల్ కమిషనర్‎ను ప్రశ్నించగా ఆయన సైతం యువకుడిని అక్కడ నుంచి వెళ్లిపోవాలని సమాధానం ఇచ్చారు. కుక్కలు దాడి చేస్తే మాకేం సంబంధం అంటున్నారని అధికారుల తీరుపై తప్పు పడుతున్నాడు బాధితుడు. గతంలో కూడా ఇదే యువకుడు తన మేకలపై జరిగిన దాడిలో జిల్లా కలెక్టర్‎ను కలిసి వినతి పత్రం అందించారు. కుక్కలు.. కోళ్లపై దాడి చేశాయి. చనిపోయిన కోడిని మున్సిపల్ ఆఫీస్‎కి కట్టారు. తనకు నష్ట పరిహారం అందించాలని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..