AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఘోరం.. కన్నతల్లిని బండరాయితో కొట్టి చంపి.. కొడుకు ఆత్మహత్య! కారణం అదేనా?

యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యంత విషాదకరమైన, ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. కన్నతల్లిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఒక కొడుకు, ఆ తర్వాత తానూ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి విచారణ చేపట్టారు.

ఘోరం.. కన్నతల్లిని బండరాయితో కొట్టి చంపి.. కొడుకు ఆత్మహత్య! కారణం అదేనా?
Yadadri Crime
M Revan Reddy
| Edited By: |

Updated on: Jun 29, 2026 | 6:37 PM

Share

యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యంత విషాదకరమైన, ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. కన్నతల్లిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఒక కొడుకు, ఆ తర్వాత తానూ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి విచారణ చేపట్టారు.

పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం పరిధిలోని పెద్ద రావులపల్లి గ్రామంలో ఈ ఘోర ఉదంతం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన సంగం శ్రీనివాస్ అనే వ్యక్తి, తన తల్లి సంగం పోచమ్మతో తీవ్రమైన గొడవకు దిగాడు. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన శ్రీనివాస్, కన్నతల్లి అనే విచక్షణ కూడా మరచి ఆమె తలపై రాయితో బలంగా కొట్టాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో పోచమ్మ ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచింది. తల్లి మరణించిన విషయాన్ని గమనించిన శ్రీనివాస్, తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. ఆ వెంటనే తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఒకే ఇంట్లో తల్లి, కొడుకు ఇద్దరూ విగతజీవులుగా పడి ఉండటం చూసి స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న భూదాన్ పోచంపల్లి పోలీసులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబంలో గత కొంతకాలంగా నడుస్తున్న భూ వివాదమే ఈ దారుణ హత్య, ఆత్మహత్యకు కారణమై ఉండొచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఈ ఘోర ఉదంతంపై కేసు నమోదు చేసుకుని, అన్ని కోణాల్లోనూ లోతైన దర్యాప్తు ప్రారంభించారు. పెద్ద రావులపల్లి గ్రామంలో ఈ ఘటనతో ఒకేసారి విషాద ఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us