AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోలీస్ స్టేషన్‌లో లేడీ కానిస్టేబుల్ నిర్వాకం.. దిమ్మతిరిగే షాకిచ్చిన నెటిజన్లు

పోలీస్ స్టేషన్‌లో లేడీ కానిస్టేబుల్ నిర్వాకం.. దిమ్మతిరిగే షాకిచ్చిన నెటిజన్లు

Phani CH
|

Updated on: Jun 28, 2026 | 6:29 PM

Share

రాజస్థాన్‌లోని దుంగార్పూర్ జిల్లా పోలీస్ స్టేషన్‌లో విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వృద్ధుడిని పట్టించుకోకుండా డెస్క్‌పై కాళ్లు పెట్టుకుని కూర్చున్న ఫొటోపై తీవ్ర విమర్శలు రావడంతో అధికారులు ఆమెను సస్పెండ్ చేసి శాఖాపరమైన విచారణ ప్రారంభించారు.

కొందరు ప్రభుత్వ ఉద్యోగులు అధికారముందనే అహంకారంతో ఇష్టారీతిన ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రజా సేవకులుగా ప్రభుత్వం వారిని నియమిస్తుంది. కానీ కొందరు మాత్రం తాము ప్రజలపై అధికారం చెలాయించేందుకు ఉన్నాం అన్నట్టుగా ప్రవర్తిస్తారు. అవసరం కోసం తమ వద్దకు వచ్చే ప్రజలను చిన్నచూపు చూస్తూ కనీస మర్యాద కూడా ఇవ్వరు. రాజస్థాన్‌లోని ఓ పోలీస్‌ స్టేషన్‌లో అలాంటి ఘటనే జరిగింది. పోలీస్‌ స్టేషన్‌లోని ఓ లేడీ కానిస్టేబుల్‌ నిర్వాకం నెట్టింట తీవ్ర చర్చకు దారి తీసింది. అసలేం జరిగిందంటే… రాజస్థాన్‌లోని దుంగార్పూర్ జిల్లాలో ఉన్న బిచ్చివార పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు ఓ వృద్ధుడు వచ్చాడు. అయితే అక్కడ ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఆ వృద్ధుడిని లెక్కచేయకుండా డెస్క్‌పై రెండు కాళ్లు పెట్టుకుని నిర్లక్ష్యంగా కూర్చుంది. ఈ ఘటనను ఎవరో ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. దాంతో అదికాస్తా వైరల్‌గా మారింది. నెట్టింట ఈ ఫోటో చూసిన నెటిజన్లు పోలీస్‌ స్టేషన్‌లో సిబ్బంది ప్రజలతో వ్యవహరించే తీరు ఇదేనా అంటూ తీవ్రంగా విమర్శించారు. ఈ పోస్ట్ అధికారుల దృష్టికి వెళ్ళింది. ఈ ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో జిల్లా పోలీసు అధికారులు వెంటనే స్పందించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, క్రమశిక్షణా ఉల్లంఘనకు పాల్పడినట్లు భావించి మహిళా కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. అంతేకాకుండా ఆమెపై శాఖాపరమైన క్రమశిక్షణా చర్యలను కూడా ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రజలకు సేవలందించాల్సిన పోలీస్‌ సిబ్బంది ఇలాంటి ప్రవర్తనకు పాల్పడటం సరైంది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఇలాంటి ఘటనలు పోలీస్‌ శాఖ ప్రతిష్ఠను దెబ్బతీస్తాయని సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు పూర్తి స్థాయి నివేదిక కోరినట్లు సమాచారం. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే ప్రతి పౌరుడితో మర్యాదపూర్వకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించడం పోలీసు సిబ్బంది విధి అని అధికారులు స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి పట్ల ఇలాంటి నిర్లక్ష్య వైఖరి సరికాదని, పోలీస్‌ స్టేషన్లలో ప్రజలకు గౌరవప్రదమైన వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రెచ్చిపోయిన ఉప్పల్‌ బాలు.. ఆధ్యాత్మిక క్షేత్రంలో ప్రమాదకర స్టంట్స్‌!

ఆధార్, పాస్‌పోర్ట్ ఉన్నా భారతీయులు కాదా? పౌరసత్వానికి అసలైన రుజువు ఏంటి?

చైనాకు కౌంటర్‌గా .. భారత్ అతి పెద్ద డ్యామ్‌ నిర్మాణం

జీతం రూ.లక్ష.. సేవింగ్స్ సున్నా.. ముంచుతున్నవి ఈ అలవాట్లే!

RAAKA: ‘రాకా’ తో హాలీవుడ్‌తో ఢీ! ది పాత్ బ్రేకర్ బన్నీ!

Follow Us