మనీ ప్లాంట్ పెంచుతున్నారా?.. ఈ తప్పులు అస్సలు చేయకండి! లేదంటే?

29 Jun 2026

Anand T

మనీ ప్లాంట్‌ ఇది మన ఇంటికి అందంతో పాటు సానుకూలతను తెచ్చిపెట్టే అందమైన మొక్క. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ ఈ మొక్క కనిపిస్తుంది.

మనీ ప్లాంట్ క్రేజ్!

అయితే ఈ మొక్కకు సరైన సరక్షణ లేకపోతే ఆకులు పసుపు రంగులోకి మారి, మొక్క వాడిపోయే ప్రమాదం ఉంది.

 పసుపు రంగు ఆకులు

మనీ ప్లాంట్లు ఆకులు పసుపు రంగులోకి మారడానికి ప్రధాన కారణం నీరు ఎక్కవగా పోయడం. మీరు ఎప్పుడూ ఈ తప్పు చేయకండి

ఎక్కవ నీరు

మనీ ప్లాంట్ ఆరోగ్యంగా పెరగాలంటే వారానికి కేవలం రెండు నుండి మూడు సార్లు మాత్రమే నీరు పోయడం ఉత్తమం.

నీరు ఎలా పోయాలి?

మొక్క పెరగడానికి కాంతి అవసరమే, కానీ ప్రత్యక్ష సూర్యరశ్మి పడితే ఆకులు త్వరగా కాలిపోయి రంగు మారుతాయి.

సూర్యరశ్మి

మీ మనీ ప్లాంట్‌ను నేరుగా ఎండ పడకుండా... ఇంటి లోపల, కిటికీ దగ్గర లేదా నీడ ఉన్న ప్రదేశంలో ఉంచడం చాలా మంచిది.

సరైన ప్రదేశం

మొక్కను నాటే కుండీకి కింద నీరు బయటకు పోవడానికి ఖచ్చితంగా రంధ్రాలు ఉండాలి. లేదంటే నీరు నిలిచిపోయి వేర్లు కుళ్ళిపోతాయి.

 కుండీకి రంధ్రాలు  

మొక్క ఎప్పుడూ పచ్చగా, బలంగా పెరగడానికి ఎండిపోయిన, పసుపు రంగులోకి మారిన ఆకులను, కాండాలను క్రమం తప్పకుండా కత్తిరిస్తూ ఉండాలి.

ఎండిన ఆకుల

సరైన మోతాదులో నీరు, నీడ, కాస్త సంరక్షణ ఉంటే మీ ఇంట్లోని మనీ ప్లాంట్ ఎల్లప్పుడూ పచ్చగా, అందంగా కళకళలాడుతుంది.

జాగ్రత్తలు