చెరువు వద్ద ప్యాంటు లేకుండా శవమై కనిపించిన 9 ఏళ్ల బాలుడు.. వెలుగులోకి ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే నిజాలు!
తమిళనాడులో అత్యంత అమానుషమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పుదుక్కోట్టై జిల్లాలో తొమ్మిదేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడి, ఆపై అత్యంత పాశవికంగా హతమార్చాడు దుర్మార్గుడు. ఈ ఆరోపణలపై 17 ఏళ్ల బాలుడిని పోలీసులు సోమవారం (జూన్ 29) అరెస్టు చేశారు. మొదట ఈ కేసును అనుమానాస్పద మరణంగా నమోదు చేసినప్పటికీ, పోలీసుల లోతైన దర్యాప్తులో నమ్మలేని నిజాలు వెల్లడికావడంతో దీనిని హత్య, పోక్సో (POCSO) చట్టం కిందకు మార్చారు.

తమిళనాడులో అత్యంత అమానుషమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పుదుక్కోట్టై జిల్లాలో తొమ్మిదేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడి, ఆపై అత్యంత పాశవికంగా హతమార్చాడు దుర్మార్గుడు. ఈ ఆరోపణలపై 17 ఏళ్ల బాలుడిని పోలీసులు సోమవారం (జూన్ 29) అరెస్టు చేశారు. మొదట ఈ కేసును అనుమానాస్పద మరణంగా నమోదు చేసినప్పటికీ, పోలీసుల లోతైన దర్యాప్తులో నమ్మలేని నిజాలు వెల్లడికావడంతో దీనిని హత్య, పోక్సో (POCSO) చట్టం కిందకు మార్చారు.
కరంబకుడి సమీపంలోని కరుక్కకురిచి గ్రామానికి చెందిన ఒక వ్యవసాయ దినసరి కూలీ కుమారుడు నాలుగో తరగతి చదువుతున్నాడు. జూన్ 27వ తేదీ సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి బయటకు వెళ్లాడు. అయితే, రాత్రి పొద్దుపోయాక కూడా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతకడంతో.. ఇంటికి సుమారు 100 మీటర్ల దూరంలో ఉన్న ఒక చెరువు సమీపంలో ఆ చిన్నారి విగతజీవిగా కనిపించాడు. బాలుడి మెడ, ముఖంపై తీవ్రమైన గాయాల గుర్తులు ఉన్నాయి. అలాగే మృతదేహానికి ప్యాంటు లేకపోవడాన్ని గమనించిన స్థానికులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
దర్యాప్తు అధికారులు రంగంలోకి దిగి, పోలీస్ జాగిలం సహాయంతో ఆ ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో జూన్ 28వ తేదీ ఉదయం పోలీసులకు ఒక కీలకమైన పురోగతి లభించింది. బాధితుడితో కలిసి ఆడుకుంటున్న మిగతా పిల్లలు, అసలు విషయాన్ని పోలీసులకు చెప్పారు. అదే ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల యువకుడు, ఆ బాలుడు అదృశ్యం కావడానికి కారణమని గుర్తించారు. అతడిని తన వెంట తీసుకుని వెళ్లాడని పిల్లలు తెలిపారు. ఈ సమాచారం ఆధారంగా, పోలీసులు ఆ మైనర్ యువకుడిని వెంటనే అదుపులోకి తీసుకుని విచారించారు.
“పోలీసుల విచారణ సందర్భంగా నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. తొమ్మిదేళ్ల బాలుడిపై తాను లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. అయితే, ఆ చిన్నారి తన నుండి తప్పించుకోవడానికి గట్టిగా ప్రతిఘటించి, పారిపోవడానికి ప్రయత్నించడంతో.. భయపడిపోయిన నిందితుడు ఒక గుడ్డతో బాలుడి గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు” అని ఒక ఉన్నత పోలీస్ అధికారి వెల్లడించారు.
నిందితుడు మైనర్ కావడంతో సోమవారం ఉదయం అతడిని బాలల ప్రత్యేక గృహానికి తరలించారు. నిందితుడి అంగీకార మూలకం, దర్యాప్తులో వెల్లడైన ఆధారాల ప్రకారం.. మొదట భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS) సెక్షన్ 194 కింద నమోదైన అనుమానాస్పద మరణం కేసును, ఇప్పుడు పోక్సో, హత్య కేసుగా మార్చి పోలీసులు తదుపరి చర్యలు చేపట్టారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
