Mancherial: తెల్లావారుతుండగానే తెల్లారిన జీవితాలు.. ఇంట్లో చెలరేగిన మంటలు.. ఆరుగురు సజీవ దహనం..

మంచిర్యాల జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. నిద్రపోతున్న వారు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఇది. ఇంట్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి.. ఆరుగురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు...

Mancherial: తెల్లావారుతుండగానే తెల్లారిన జీవితాలు.. ఇంట్లో చెలరేగిన మంటలు.. ఆరుగురు సజీవ దహనం..
Fire Accident
Follow us

|

Updated on: Dec 17, 2022 | 6:12 AM

 మంచిర్యాల జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. నిద్రపోతున్న వారు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఇది. ఇంట్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి.. ఆరుగురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. మందమర్రి మండలం వెంకటాపూర్‌లో ఈ ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు ఇంటి యజమాని శివయ్య, ఆయన భార్య పద్మ, పద్మ అక్క కుమార్తె మౌనిక, ఆమె ఇద్దరు కుమార్తెలుగా గుర్తించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే అలర్ట్ అయ్యి.. మంటలను అదుపు చేశారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. డీసీపీ అఖిల్‌ మహాజన్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం