AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maoist Surrender: తెలంగాణలో మావోయిస్టు పార్టీకి భారీ షాక్‌.. రామన్న భార్య సావిత్రి లొంగుబాటు..

Senior Woman Maoist Leader: తెలంగాణలో మావోయిస్టు పార్టీకి భారీదెబ్బ తగిలింది. భద్రాద్రి కొత్తగూడెం పోలీసుల ముందు మావోయిస్టు అగ్రనేత దివంగత రావుల శ్రీనివాస్ అలియాస్ రామన్న భార్య సావిత్రి లొంగిపోయారు.

Maoist Surrender: తెలంగాణలో మావోయిస్టు పార్టీకి భారీ షాక్‌.. రామన్న భార్య సావిత్రి లొంగుబాటు..
Savitri Surrendered
Sanjay Kasula
|

Updated on: Sep 21, 2022 | 8:08 PM

Share

తెలంగాణలో మావోయిస్టు పార్టీకి భారీ షాక్‌ తగిలింది. భద్రాద్రి కొత్తగూడెం పోలీసుల ముందు మావోయిస్టు అగ్రనేత దివంగత రావుల శ్రీనివాస్ అలియాస్ రామన్న భార్య సావిత్రి లొంగిపోయారు. ఇటీవలే రామన్న అనారోగ్యంతో చనిపోయారు. ప్రస్తుతం కిష్టారం ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్న సావిత్రి బుధవారం తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. మావోయిస్టు అగ్రనేత రామన్న భార్య, కామ్రేడ్‌ సావిత్రి తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయారు. మావోయిస్టు అగ్రనేత రామన్న మృతి తర్వాత ఆమె భార్య సావిత్రి పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇదే క్రమంలో సావిత్రి తాను లొంగిపోతున్నట్లు తెలంగాణ పోలీసులకు సమాచారం అందించారు.

అయితే.. తెలంగాణలో మావోయిస్టు పార్టీ కట్టడికి పోలీసులు భారీ వ్యూహాలు రచిస్తుండటం.. ఇప్పటికే, పలు జిల్లాల్లోకి మావోయిస్టు పార్టీకి చెందిన దళాలు ప్రవేశించాయన్న సమాచారంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు మొదలు పెట్టాయి.

అయితే మోస్ట్ వాంటెడ్ నక్సలిస్టుల ఫొటో జాబితాను సైతం విడుదల చేశారు పోలీసులు. ఈ క్రమంలోనే మావోయిస్టు అగ్రనేత రజితను భద్రాద్రి పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతో పాటు మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే, తాజాగా సావిత్రి లొంగుబాటుతో మావోయిస్టులకు గట్టి దెబ్బ తగిలినట్లు పేర్కొంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..