AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.10 లక్షలకు అమ్ముడైన ఆవు..! అంత భారీ ధర ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన గుమ్మి రామిరెడ్డి గారి గోశాలలోని గిర్ జాతి ఆవు రూ. 10 లక్షలకు అమ్ముడుపోయింది. రోజుకు 16 లీటర్ల పాలను ఇచ్చే ఈ ఆవు యొక్క అద్భుతమైన పాల దిగుబడి దీనికి కారణం. ఈ ఆవును ఆంధ్రప్రదేశ్ లోని సత్యసాయి జిల్లాకు చెందిన అమిత్ కిషన్ కొనుగోలు చేశారు.

రూ.10 లక్షలకు అమ్ముడైన ఆవు..! అంత భారీ ధర ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Cow
SN Pasha
|

Updated on: Jun 23, 2025 | 1:24 PM

Share

సాధారణంగా ఓ ఆవు ధర ఎంతుంటుంది.. రూ.10 వేల నుంచి రూ.50 వేల మధ్య ఉంటుంది. బాగా పాలిచ్చే ఆవు అయితే రూ.60 వేల ధర పలుకుతుంది. కానీ, ఈ ఆవు ఏకంగా రూ.10 లక్షల ధర పలికింది. అంత ధర పెట్టి ఆ ఆవును ఎందుకు కొన్నారు? దాని ప్రత్యేకత ఏంటి? ఇంతకీ రూ.10 లక్షలు చెల్లించి ఆ ఆవును కొన్న వ్యక్తి ఎవరో ఏంటో ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని లక్ష్మాపురంలో గుమ్మి రామిరెడ్డి గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ ​నుంచి నాలుగున్నరేళ్ల క్రితం రెండు గిర్​ జాతి ఆవులను తెప్పించి గోశాల ప్రారంభించారు. అలా ప్రారంభించిన ఆ గోశాల బాగా అభివృద్ధి చెందింది. ప్రస్తుతం రామిరెడ్డి గోశాలలో 132 గిర్​ జాతి ఆవులు ఉన్నాయి.

అయితే.. ఆయన రూ.10 లక్షలకు అమ్మిన ఆవు ఉదయం 8 లీటర్లు, సాయంత్రం 8 లీటర్ల చొప్పున మొత్తం ఒక రోజులో ఏకంగా 16 లీటర్ల పాలు ఇస్తుంది. ఆవులు ఇన్ని లీటర్ల పాలు ఇవ్వడం అరుదు. గేదెలు అయితే అలా ఇస్తాయి. అయితే.. రోజుకు 16 లీటర్ల పాలు ఇచ్చే ఈ ప్రత్యేకమైన గిర్‌ జాతి ఆవును తాజాగా ఏపీకి చెందిన వ్యక్తి కొనుగోలు చేశారు. ఆవు కోసం ఆయన రూ.10 లక్షలు ధర చెల్లించారు. ఏపీలోని సత్యసాయి జిల్లాలోని పెనుగొండకు చెందిన హెబ్బేవ్ గోశాల నిర్వాహకుడు అమిత్ ​కిషన్ ఈ ఆవును రూ.10 లక్షలకు కొనుగోలు చేశారు. ఆదివారం ఈ ఆవును వాహనంలో పెనుగొండకు తరలించారు. మరి ఇంత భారీ ధర పలికిన ఈ ఆవు ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి