AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమ్మర్‌ స్పెషల్‌.. ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు

Summer Special Trains: ఈ సమ్మర్‌లో రైల్వే ప్రయాణం చేసే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే సూపర్ గుడ్‌ న్యూస్ చెప్పింది. వేసవి కాలంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల మధ్య ప్రత్యేక రైళ్లను నడుపున్నటు పేర్కొంది. ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైల్వే శాఖ పేర్కొంది. కాబట్టి ఈ ప్రత్యేక రైళ్లు, ఏ ఏ మార్గాల్లో ఎప్పుడు అందుబాటులో ఉండనున్నాయో తెలుసుకుందాం.

సమ్మర్‌ స్పెషల్‌.. ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
Scr Special Trains
Anand T
|

Updated on: Apr 17, 2026 | 1:04 PM

Share

సమ్మర్‌లో పిల్లలకు సెలవులు ఉండడంతో చాలా మంది తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారు. దీంతో రైల్లలో ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షణ భారత రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయం తీసుకుంది ఈ మేరకు మొత్తం 4 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు చర్లపల్లి – సంత్రాగచ్చి – హైదరాబాద్, కాకినాడ టౌన్ – హిసార్ – కాకినాడ టౌన్ మధ్య రాకపోకలు సాగిస్తాయని పేర్కొంది.

రైల్వే శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. చర్లపల్లి – సంత్రాగచ్చి – హైదరాబాద్, మధ్య రాకపోకలు సాగించే 07677 నెంబర్ ప్రత్యేక రైలు 21-04-26 మంగళవారం రాత్రి 10.30 గంటలకు చర్లపల్లి స్టేషన్ నుంచి బయల్దేరి బుధవారం మధ్యాహ్నం 14.30 కు సంత్రాగచ్చి చేరుకుంటుంది. ఇక 07678 నెంబర్ గల మరో ప్రత్యేక రైలు బుధవారం సాయంత్రం 4.45కు సంత్రాగచ్చి స్టేషన్ నుంచి బయల్దేరి గురువారం రాత్రి 11గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటుంది.

చర్లపల్లి – సంత్రాగచ్చి – హైదరాబాద్ సాగించే ఈ రెండు ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, ఎలమంచిలి, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మపూర్, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలాసోర్, ఖరగ్‌పూర్. మీదుగా రాకపోకలు సాగిస్తాయి. ఈ రైళ్లలో 2AC, 3AC, స్లీపర్ మరియు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి

కాకినాడ టౌన్ – హిసార్ – కాకినాడ టౌన్ 07717, 07718 నెంబర్ గల రెండు ప్రత్యేక రైళ్లు ఏప్రీల్ 21,24 తేదీల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి. 07717 ప్రత్యేక రైలు ఏప్రిల్ 21 ఉదయం 5 గంటల 40 నిమిషాలకు కాకినాడ నుంచి బయల్దేరి గురువారం మధ్యాహ్నం 1.40 కి హిసార్‌కు చేరుకుంటుంది. ఇక 07718 నెంబర్ గల మరో ప్రత్యేక రైలు ఏప్రిల్ 24 రోజు మధ్యాహ్నం 2.10కి బయల్దేరి ఇదివారం రాత్రి 9.35కు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుంది.

కాకినాడ టౌన్ – హిసార్ – కాకినాడ టౌన్ మధ్య రాకపోకలు సాగించే 07717, 07718 నెంబర్ గల రెండు ప్రత్యేక రైళ్లు సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి, మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ధర్మాబాద్, ముద్ఖేడ్, నాందేడ్, పూర్ణ, బాస్మత్, హింగోలి, వాషిమ్, అకోలా, షేగావ్, మల్కాపూర్, భుసావల్, జల్గావ్, అమల్నేర్, నందూర్బార్, ఉద్నా, వడోదర, రత్లాం, మందసౌర్, నీమచ్, చిత్తోర్‌గఢ్, భిల్వారా, బిజయనగర్, నసీరాబాద్, అజ్మీర్, కిషన్‌గఢ్, ఫులేరా, రింగాస్, సికార్, నవల్‌గఢ్, ఝుంఝును, చిరావా, లోహారు, సాదుల్పూర్ మీదుగా రాకపోకలు సాగిస్తాయి.ఈ రైళ్లలో 1AC, 2AC, 3AC, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us