AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: రీల్ హీరో కాదు రియల్ హీరో.. వ్యాన్ డ్రైవర్ కు అస్వస్థత నడుస్తున్న వ్యాను నుంచి దూకి.. 16మంది ప్రాణాలు కాపాడిన ఎస్సై

హైదరాబాద్ నగర నడిబొడ్డున ఓ ఎస్సై రీల్ హీరో మాత్రమే కాదు.. ప్రజలకు అనుకోని ఆపద వస్తే రియల్ గా కూడా ప్రాణాలను ఫణంగా పెట్టి కాపాడతాం అని నిరూపించారు.

Hyderabad:  రీల్ హీరో కాదు రియల్ హీరో.. వ్యాన్ డ్రైవర్ కు అస్వస్థత నడుస్తున్న వ్యాను నుంచి దూకి.. 16మంది ప్రాణాలు కాపాడిన ఎస్సై
Cop Saves Lives
Surya Kala
|

Updated on: Mar 22, 2023 | 12:56 PM

Share

అదుపు తప్పిన పోలీసు వాహనాన్ని ఆపేందుకు ఓ పోలీసు ఛేజ్ చేస్తూ.. ఎంతో ధైర్య సాహసాలతో కాపాడే సన్నివేశాలు ఎక్కువగా సినిమాల్లో చూస్తూ ఉంటాం.. అలాంటి హీరోలకు అభిమానులు ఫిదా.. అయితే నిజ జీవితంలో కూడా అటువంటి సాహసవంతమైన పోలీసు అధికారి ఉంటే బాగుండును అని కొందరు కామెంట్ కూడా చేస్తారు. హైదరాబాద్ నగర నడిబొడ్డున ఓ ఎస్సై రీల్ హీరో మాత్రమే కాదు.. ప్రజలకు అనుకోని ఆపద వస్తే రియల్ గా కూడా ప్రాణాలను ఫణంగా పెట్టి కాపాడతాం అని నిరూపించారు. వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్‌ నడిబొడ్డున ఓ ఎస్సై పెద్ద సాహసమే చేశారు. అదుపుతప్పిన వాహనాన్ని కంట్రోల్ చేయడంతో అందులో ప్రయాణిస్తున్న 16 మంది ఏబీవీపీ కార్యకర్తలు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ.. ఏబీవీపీ విద్యార్థులు ప్రగతి భవన్‌ ముట్టడికి యత్నించారు. రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థులను అరెస్టు చేసి డీసీఎం వ్యాన్‌లో ఎక్కించారు. పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. ఈ వాహనానికి కాపలాగా బంజారాహిల్స్‌కు చెందిన ఎస్సై కరుణాకర్‌రెడ్డి, పోలీసు సిబ్బంది వ్యానులో కూర్చున్నారు.

అరెస్ట్ చేసిన వారిని సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా.. డ్రైవర్ హోంగార్డుకు ఫిట్స్ రావడంతో స్టీరింగ్‌పై వాలిపోయాడు. ప్రసాద్ ఐమ్యాక్స్ సమీపంలో వాహనం ప్రమాదానికి గురైంది. వాహనం అదుపుతప్పి రోడ్డుపై అడ్డదిడ్డంగా పరుగులు తీస్తోంది. ఇది గమనించిన ఎస్సై కరుణాకర్‌రెడ్డి వెంటనే అప్రమత్తమయ్యారు.

ఇవి కూడా చదవండి

నడుస్తున్న వాహనం నుంచి కిందికి దూకి వాహనం ముందువైపు పరుగులు తీశారు. డ్రైవర్ కూర్చున్న డోర్ తెరిచి స్టీరింగ్ పట్టుకుని, బ్రేక్ వేశారు. దీంతో వాహనం రోడ్డు పక్కనున్నపెద్ద పూలకుండీని ఢీకొట్టి ఆగిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పింది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వాహనాన్ని అక్కడి నుంచి తొలగించారు. అరెస్ట్ చేసిన వారిని మరో వాహనంలో తరలించారు. కాగా, ఘటనలో ఎస్సై కరుణాకర్‌రెడ్డితోపాటు హోంగార్డు రమేశ్, మరో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..