AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Munugodu: మంత్రి కాన్వాయ్ ను తనిఖీ చేసిన పోలీసులు.. అణువణువూ శోధన.. ఆ తర్వాత..

తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న మునుగోడు ఉప ఎన్నికకు గడువు సమీపిస్తోంది. దీంతో ఓటర్లను ఎలాగైనా తమ వైపు తిప్పికునేందుకు సరికొత్త ప్రయత్నాలకు తెర లేపుతున్నారు. అందులో భాగంగా..

Munugodu: మంత్రి కాన్వాయ్ ను తనిఖీ చేసిన పోలీసులు.. అణువణువూ శోధన.. ఆ తర్వాత..
Errabelli Dayakar
Ganesh Mudavath
|

Updated on: Oct 27, 2022 | 1:57 PM

Share

తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న మునుగోడు ఉప ఎన్నికకు గడువు సమీపిస్తోంది. దీంతో ఓటర్లను ఎలాగైనా తమ వైపు తిప్పికునేందుకు సరికొత్త ప్రయత్నాలకు తెర లేపుతున్నారు. అందులో భాగంగా ప్రలోభాలు చేస్తున్నారు. మద్యం, బిర్యానీ, మాంసం పంచడంతో పాటు డబ్బు, చీరలు కూడా ఇస్తున్నారు. ఒక పార్టీ ఇచ్చిన మొత్తం కంటే అధికంగా మరో పార్టీ ఇస్తున్నారు. ఇలా ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అక్రమంగా తరలించే డబ్బుపై అధికారులు, పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. వాహనాలు, కార్లను ఆపి చెక్ చేస్తున్నారు. తాజాగా లక్కలపల్లి చెక్ పోస్ట్ వద్ద రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాన్వాయ్ ని ఆపి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మంత్రి ప్రయాణిస్తున్న కారులో బ్యాగులతో పాటు అణువణువూ శోధించారు. మంత్రి వెంట కాన్వాయ్ లోని అన్ని వాహనాలను పరిశీలించారు. తనిఖీ చేస్తున్న పోలీసులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సహకారం అందించారు. కాన్వాయ్ ను చెక్ చేసిన అనంతరం మంత్రి వాహనాలు వెళ్లేందుకు పోలీసులు అనుమతిచ్చారు.

కాగా.. గతంలోనూ అక్రమంగా తరిస్తున్న డబ్బు పట్టుబడింది. హైదరాబాద్‌ శివారులో నిర్వహించిన తనిఖీల్లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంబంధీకులు తరలిస్తున్న రూ.కోటి నగదును పోలీసులు పట్టుకొన్నారు. ఈ నగదు మునుగోడుకు తరలిస్తున్నట్టు విచారణలో తేలిందని, వారిని అరెస్టు చేసినట్టు మాదాపూర్‌ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. ఈ సొమ్మును కోమటిరెడ్డి రాజేందర్‌రెడ్డి తనయుడు సుమంత్‌రెడ్డికి అందజేయడానికి తీసుకెళ్తున్నట్టు చెప్పారు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం మాల్‌లో ఆదివారం రూ.8 లక్షల నగదును పోలీసులు సీజ్‌ చేశారు. సుద్దపల్లి, వింజమూరు సరిహద్దుల్లో దేవరకొండ డీఎస్పీ నాగేశ్వర్‌రావు, నాంపల్లి సీఐ విఠల్‌రెడ్డి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..