AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: పాతబస్తీలో అమానుషం.. రూ.10 కోసం ఆటో డ్రైవర్‌ను కొట్టి చంపిన ప్రయాణికుడు..!

హైదరాబాద్ మహానగరంలో దారుణం వెలుగులోకి వచ్చింది. 10 రూపాయలు కోసం ఆటో డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. రూ. 10 చెల్లించే విషయంలో ఓ ప్రయాణికుడు తీవ్ర వాగ్వాదం తర్వాత ఆటో డ్రైవర్‌ను తీవ్రంగా కొట్టాడు. దీంతో చికిత్స పొందుతూ ఆటో డ్రైవర్ గురువారం ఆసుపత్రిలో మరణించాడు.

Hyderabad: పాతబస్తీలో అమానుషం.. రూ.10 కోసం ఆటో డ్రైవర్‌ను కొట్టి చంపిన ప్రయాణికుడు..!
Auto
Balaraju Goud
|

Updated on: Jun 29, 2024 | 9:50 AM

Share

హైదరాబాద్ మహానగరంలో దారుణం వెలుగులోకి వచ్చింది. 10 రూపాయలు కోసం ఆటో డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. రూ. 10 చెల్లించే విషయంలో ఓ ప్రయాణికుడు తీవ్ర వాగ్వాదం తర్వాత ఆటో డ్రైవర్‌ను తీవ్రంగా కొట్టాడు. దీంతో చికిత్స పొందుతూ ఆటో డ్రైవర్ గురువారం ఆసుపత్రిలో మరణించాడు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న గుర్తు తెలియని ప్రయాణికుడిని పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

వట్టెపల్లి ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ మహ్మద్ అన్వర్ (39) జూన్ 12న చార్మినార్ వద్ద ఓ ప్రయాణికుడు తన ఆటో ఎక్కి షంషీర్‌గంజ్‌లో దింపాడు. షంషీర్‌గంజ్ చేరుకున్న తర్వాత, ప్రయాణీకుడు రూ.10 చెల్లించాడు, అయితే అన్వర్ మరో రూ.10 చెల్లించాలని డిమాండ్ చేశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగి ఘర్షణకు దారితీసింది. ప్రయాణికుడు అన్వర్‌ను దూషించడమే కాకుండా కనికరం లేకుండా తీవ్రంగా కొట్టాడు. ఇది గమనించిన స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో ప్రయాణికుడు అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు అన్వర్‌ను సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు తరలించగా, పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అన్వర్ జూన్ 27న మృతి చెందాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..