AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉస్మానియాలో ప్రపంచంలోనే అరుదైన ఆపరేషన్.. 18 గంటల పాటు కష్టపడ్డ 30మంది డాక్టర్లు… రికార్డ్

ఆరు నెలలకే చిన్నారిలో ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. చర్మం మొత్తం పొడిబారి, పొలుసులు రాలటం ప్రారంభమైంది. జుట్టు ఊడిపోతుండేడి. పసివాడిలో ఎదుగుదల లేదు. దాంతో తల్లిదండ్రులు బాలుడిని హైదరాబాద్‌లోని..

ఉస్మానియాలో ప్రపంచంలోనే అరుదైన ఆపరేషన్.. 18 గంటల పాటు కష్టపడ్డ 30మంది డాక్టర్లు... రికార్డ్
Rare Syndrome
Jyothi Gadda
|

Updated on: Jul 01, 2022 | 3:34 PM

Share

దేశంలోనే పేరున్న హైదరాబాద్‌ ఉస్మానియా ఆస్పత్రి మరో ఘనత సాధించింది. దేశంలోనే తొలిసారిగా, ప్రపంచంలో నాలుగో అరుదైన ఆపరేషన్‌ జరిగింది హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో..ఇందుకోసం మొదటిసారిగా ఉస్మానియా, నిలోఫర్‌ డాక్టర్లు ఏకమయ్యారు. డాక్టర్లు, పీజీ విద్యార్థులు, నర్సింగ్‌ సిబ్బంది కలిపి మొత్తం 30 మంది సభ్యుల బృందం పద్దెనిమిదిన్నర గంటలపాటు ఆపరేషన్‌ థియేటర్‌లోనే అవిశ్రాంతంగా శ్రమించి ఓ చిన్నారికి ప్రాణం పోశారు. అదే కార్పొరేట్‌ ఆస్పత్రిలో అయితే, దాదాపు రూ. 30లక్షల వరకూ ఖర్చవుతుందని కానీ, ఉస్మానియా ఆస్పత్రిలో ఉచితంగా నిర్వహించి రికార్డ్‌ క్రియేట్‌ చేశారు. ఇంతకీ ఏంటా సర్జరీ, చిన్నారికి వచ్చిన వ్యాధి ఏంటి…? పూర్తి వివరాల్లోకి వెళితే..

జగిత్యాల జిల్లా బట్టపల్లి పోతారం గ్రామానికి చెందిన ప్రేమలత, నారాయణ దంపతులకు పదినెలల క్రితం రెండో సంతానంగా శివాన్ష్‌ పుట్టాడు. ప్రేమలత అంగన్‌వాడీ కార్యకర్త కాగా, నారాయణ వ్యవసాయ కూలీ. తొలిచూరు బిడ్డ పురిట్లోనే మరణించిన తర్వాత.. శివాన్ష్‌ పుట్టడంతో ఆ కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది. అయితే అది కొద్దిరోజులు మాత్రమే. ఆరు నెలలకే చిన్నారిలో ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. చర్మం మొత్తం పొడిబారి, పొలుసులు రాలటం ప్రారంభమైంది. జుట్టు ఊడిపోతుండేడి. పసివాడిలో ఎదుగుదల లేదు. దాంతో తల్లిదండ్రులు బాలుడిని హైదరాబాద్‌లోని నిలోఫర్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. మొదట్లో పసరికలు (జాండిస్‌) అని భావించిన వైద్యులు.. ఆ మేరకు రెండు వారాలపాటు చికిత్స అందించారు. ఫలితం లేకపోగా, శివాన్ష్‌ ఆరోగ్యం మరింత క్షీణించింది. మరోమారు వైద్యపరీక్షలు జరిపిన నిలోఫర్‌ వైద్యులు జన్యువ్యాధి లక్షణాలున్నట్టు గుర్తించారు. దీంతో పీడియాట్రిక్‌ విభాగాధిపతి డాక్టర్‌ ఉషారాణి శివాన్ష్‌ను ఉస్మానియా దవాఖానకు రెఫర్‌ చేశారు.

తొలుత శివాన్ష్‌ను ఇన్‌పేషెంట్‌గా చేర్చుకున్నారు వైద్యులు. కాలేయ వ్యాధితోపాటు కడుపులో నీరు నిల్వ ఉన్నట్లు గుర్తించారు. మందులతో తగ్గించాలని ప్రయత్నించినా సాధ్యపడకపోవడంతో శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. చిన్నారి తల్లి కాలేయంలో కొంత భాగాన్ని సేకరించి, జూన్‌ 17న కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేసినట్టు డా.మధుసూదన్‌ తెలిపారు. శస్త్ర చికిత్స 18 గంటలపాటు జరిగిందని, చిన్నారి కోలుకోవడంతో బుధవారం డిశ్ఛార్జి చేశామని వెల్లడించారు. డాక్టర్లు, పీజీ విద్యార్థులు, నర్సింగ్‌ సిబ్బంది కలిపి మొత్తం 30 మంది సభ్యుల బృందం పాల్గొందన్నారు. వీరిలో పలు విభాగాల వైద్యులు వాసిఫ్‌ అలీ, సుదర్శన్‌, ఆదిత్య, వరుణ్‌, అమర్‌దీప్‌, పాండునాయక్‌, వెంకటేశ్వర్లు, సునీల్‌, హరీశ్‌, ఉషారాణి, రమేశ్‌, నర్సింగ్‌ సిబ్బంది పాల్గొన్నట్టు చెప్పారు. మేనరికపు వివాహాలు లేదా వంశపారంపర్యంగా సంక్రమించే కాలేయ వ్యాధిని వైద్య పరిభాషలో నియోనాటల్‌ సిరోసిస్‌ స్కాల్ప్‌ అల్ఫోసియా, కొలనాజియో హెపటైటిస్‌గా పేర్కొంటారని వైద్యులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

దాదాపు రెండున్నర నెలల అనంతరం గురువారం చిన్నారి శివాన్ష్‌ను డిశ్చార్జ్‌ చేశారు. ఈ సందర్భంగా ఉస్మానియా సిబ్బంది ఆనందంతో బాలుడికి వీడ్కోలు పలికారు. తల్లిదండ్రులు ప్రేమలత, నారాయణ భావోద్వేగానికి గురయ్యారు. సర్జరీ చేసిన వైద్యులు, నర్సింగ్‌, ఇతర సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. తమకు సహాయం అందించినందుకు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఎంత తాగావ్‌రా..? ట్రాఫిక్ కానిస్టేల్‌కి చుక్కలు చూపింని మందుబాబు!
ఎంత తాగావ్‌రా..? ట్రాఫిక్ కానిస్టేల్‌కి చుక్కలు చూపింని మందుబాబు!
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
మొబైల్, ల్యాప్‌టాప్ స్క్రీన్‌లను లాంగ్ టైం చూస్తే ఎంత ప్రమాదమో..
మొబైల్, ల్యాప్‌టాప్ స్క్రీన్‌లను లాంగ్ టైం చూస్తే ఎంత ప్రమాదమో..
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
ఆరు రాశులకు అఖండ రాజయోగం.. మీ రాశి ఉందా మరి!
ఆరు రాశులకు అఖండ రాజయోగం.. మీ రాశి ఉందా మరి!
నిమ్మకాయలు చాలా రోజుల పాటు ఫ్రెష్‌గా ఉండాలా? ఇలా చేయండి..
నిమ్మకాయలు చాలా రోజుల పాటు ఫ్రెష్‌గా ఉండాలా? ఇలా చేయండి..
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
కేవలం రూ.45 పొదుపుతో లక్షలు మీ సొంతం!
కేవలం రూ.45 పొదుపుతో లక్షలు మీ సొంతం!
ఇది నిజమేనా.. సిగరెట్ స్మోకింగ్‌ వల్ల మైండ్ రిలాక్స్‌ అవుతుందా?
ఇది నిజమేనా.. సిగరెట్ స్మోకింగ్‌ వల్ల మైండ్ రిలాక్స్‌ అవుతుందా?
పాక్ ప్లేయర్ భారీ రికార్డ్ బ్రేక్ చేసిన డేంజరస్ బ్యాటర్.. ఎవరంటే?
పాక్ ప్లేయర్ భారీ రికార్డ్ బ్రేక్ చేసిన డేంజరస్ బ్యాటర్.. ఎవరంటే?
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే
మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే
శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
'ఏదేమైనా నేను ఎప్పుడూ నీతోనే ఉంటా'త్రిష షాకింగ్ ట్వీట్!
'ఏదేమైనా నేను ఎప్పుడూ నీతోనే ఉంటా'త్రిష షాకింగ్ ట్వీట్!
నా సినిమాను రిలీజ్‌కు ముందే లీక్ చేశారు'.. హీరో శ్రీవిష్ణు ఆవేదన
నా సినిమాను రిలీజ్‌కు ముందే లీక్ చేశారు'.. హీరో శ్రీవిష్ణు ఆవేదన
కన్నీరు పెట్టిస్తున్న 'సొర' సాగు: రోడ్డు పాలైన రైతు కష్టం
కన్నీరు పెట్టిస్తున్న 'సొర' సాగు: రోడ్డు పాలైన రైతు కష్టం