Telangana: కాశీయాత్రకు వెళ్తుండగా ప్రమాదం.. బీహార్‌లో తెలంగాణ వాసి మృతి.. మరో ఐదుగురికి..

బీహార్‌లోని ఔరంగబాద్‌కు చేరుకున్న తర్వాత ఓ హోటల్ వద్ద బస్సును ఆపేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. ఈ సమయంలో వెనక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో బస్సు బోల్తా పడింది.

Telangana: కాశీయాత్రకు వెళ్తుండగా ప్రమాదం.. బీహార్‌లో తెలంగాణ వాసి మృతి.. మరో ఐదుగురికి..
Follow us

|

Updated on: May 25, 2022 | 8:38 AM

Road Accident: తెలంగాణ వాసుల కాశీ పర్యటనలో విషాదం చోటుచేసుకుంది. నిజామాబాద్ నుంచి కాశీకి వెళ్తున్న ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఓ వృద్ధురాలు మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. 38 మంది యాత్రికులతో మంగళవారం ట్రావెల్స్ బస్సు నిజామాబాద్ నుంచి కాశీయాత్రకు బయలుదేరింది. ఈ క్రమంలో బీహార్‌లోని ఔరంగబాద్‌కు చేరుకున్న తర్వాత ఓ హోటల్ వద్ద బస్సును ఆపేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. ఈ సమయంలో వెనక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో బస్సు బోల్తా పడింది.

ఈ ఘటనలో నిజామాబాద్ జిల్లాలోని వెల్మడ్‌కు చెందిన వృద్ధురాలు సరలమ్మ (70) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన ఐదుగురిని వెంటనే ఔరంగాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పర్యాటకులు కుటుంబసభ్యులకు తెలియజేశారు. కాగా ఈ బస్సులో నిజామాబాద్‌ జిల్లాలోని వెల్మల్, దత్తపూర్, తలవేద, డొంకేశ్వర్ గ్రామాలకు చెందిన వారితోపాటు నిర్మల్ జిల్లా బాసరకు చెందిన యాత్రికులు ఉన్నారు. దీంతో వారి కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి