రూ.2వేల నోట్లను మార్పిడి చేస్తున్నారా? ఐతే ఈ విషయం తప్పక తెలుసుకోండి..

2 వేల రూపాయల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా రూ.2వేల నోట్లను మార్పిడి ప్రక్రియ ఇప్పటికే బ్యాంకుల్లో ప్రారంభమైంది. సెప్టెంబర్‌ 30వ తేదీ వరకు..

రూ.2వేల నోట్లను మార్పిడి చేస్తున్నారా? ఐతే ఈ విషయం తప్పక తెలుసుకోండి..
Rs.2000 Notes Exchange
Follow us

|

Updated on: May 29, 2023 | 9:49 AM

2 వేల రూపాయల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా రూ.2వేల నోట్లను మార్పిడి ప్రక్రియ ఇప్పటికే బ్యాంకుల్లో ప్రారంభమైంది. సెప్టెంబర్‌ 30వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. రోజుకు రూ.20 వేల వరకు మర్చుకునే వెసులుబాటు ఉంది. ఐతే ఇదే అదనుగా కొందరు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు హెచ్చరిస్తున్నారు. రూ.2వేల నోట్లను కమీషన్లకు మార్చి ఇస్తామని మోసగిస్తున్న వారి వలలో పడవద్దని తెలంగాణ పోలీస్‌ శాఖకు చెందిన తెలంగాణ స్టేట్‌ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది. ఈ తరహా మోసాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ట్విట్టర్‌ ద్వారా పోలీస్‌ అధికారులు ప్రచారం చేస్తున్నారు.

రూ.2వేల నోట్ల మార్పిడి పేరిట మోసగించే వారిపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఎటువంటి కమిషన్ లేకుండానే బ్యాంకుల్లో నేరుగా మార్చుకోవచ్చన్నారు. అలా ఎవరైనా మోసాలకు పాల్పడుతున్నట్లు అనుమానం ఉంటే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. నోట్ల మార్పిడికి బ్యాంకులకే వెళ్లాలని, కొత్తవారిని నమ్మి మోసపోవద్దని ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్‌ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో సూచించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.