AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Munugode Bypoll: మునుగోడులో ఊపందుకున్న ప్రచారం.. రంగంలోకి కీలక నేతలు

తెలంగాణలో రాజకీయాలు జోరందుకున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రచారం వేడెక్కింది. ఒకరిపై ఒకరు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నువ్వా..? నేనా అనే రీతాలో కొనసాగే..

Munugode Bypoll: మునుగోడులో ఊపందుకున్న ప్రచారం.. రంగంలోకి కీలక నేతలు
Munugode
Subhash Goud
|

Updated on: Oct 21, 2022 | 10:56 AM

Share

తెలంగాణలో రాజకీయాలు జోరందుకున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రచారం వేడెక్కింది. ఒకరిపై ఒకరు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నువ్వా..? నేనా అనే రీతాలో కొనసాగే ఈ ఉప ఎన్నిక సందర్భంగా పలువురు బడా నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రధాన పార్టీల నేతలు మునుగోడు నియోజకవర్గం బాట పట్టారు. మునుగోడు మండలంలో శుక్రవారం కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ప్రచారం చేయబోతున్నారు. అలాగే చౌటుప్పల్‌లో మంత్రి కేటీఆర్ రోడ్‌ షో నిర్వహించబోతున్నారు. అలాగే నారాయణపురంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ రోడ్‌ షో నిర్వహిస్తారు.

మునుగోడులో ప్రచారం ఊపందుకుంటున్న కొద్దీ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, వ్యక్తిగత దూషణలతో దూమారం రేపుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి టార్గెట్‌గా టీఆర్‌ఎస్ మెయిన్‌గా విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ టార్గెట్‌గా బీజేపీ ఆరోపణలు గుప్పిస్తోంది. మరోవైపు టీఆర్‌ఎస్‌, బీజేపీలోనూ కాంగ్రెస్‌ ఏకీపారేస్తోంది. మూడు పార్టీల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. పోలింగ్‌ సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారం కోసం కీలక నేతలు రంగంలోకి దిగుతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నియోజకవర్గంలో మకాం వేసి గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పర్యటిస్తున్నారు. ఈనెలాఖరులో ముఖ్యమంత్రి కేసీఆర్‌ భారీ బహిరంగ సభ ఉండటంతో టీఆర్‌ఎస్‌ ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. ఇలా ఒకరిపై ఒకరు కీలక నేతలు రంగంలోకి దిగి నియోజకవర్గంలో పర్యటిస్తుండటంతో సందడి సందడిగా నెలకొంది. ఎటు చూసినా ప్రచారాలే కనిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి