AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: సంగారెడ్డిలో ఘోరం.. ముగ్గురు పిల్లల‌కు విష‌మిచ్చి ఆపై తానూ సేవించిన త‌ల్లి! ఆ తర్వాత

ఏ కష్టం వచ్చిందో తెలియదుగానీ ఓ తల్లి దారుణానికి పాల్పడింది. కన్న బిడ్డలు ముగ్గురికి తన చేతులతోనే విషం తినిపించింది. అనంతరం తానూ తిని ఆత్మహత్య చేసుకుందామని భావించింది. కానీ తానొకటి తలిస్తే దైవం మరొకటి తలచినట్లు తల్లి మాత్రం ఆస్పత్రికి ప్రాణాలతో చేరగా.. ముగ్గురు బిడ్డల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి..

Telangana: సంగారెడ్డిలో ఘోరం.. ముగ్గురు పిల్లల‌కు విష‌మిచ్చి ఆపై తానూ సేవించిన త‌ల్లి! ఆ తర్వాత
Mother Poisons 3 Children In Sangareddy District
Srilakshmi C
|

Updated on: Mar 28, 2025 | 10:19 AM

Share

సంగారెడ్డి, మార్చి 28: ఏ కష్టం వచ్చిందో ఓ తల్లి సొంత బిడ్డలకు తన చేతులతోనే విషం తినిపించింది. అనంతరం తానూ తిని ఆత్మహత్య చేసుకుందామని భావించింది. కానీ తానొకటి తలిస్తే దైవం మరొకటి తలచినట్లు తల్లి ప్రాణాలతో బయటపడింది గానీ.. కన్న బిడ్డలు ముగ్గురూ విషానికి బలైయ్యారు. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో విషాదం నెల‌కొంది. వివరాల్లోకెళ్తే..

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో రాఘ‌వేంద్ర న‌గ‌ర్ కాల‌నీలో నివాసం ఉంటున్న ర‌జిత అనే మహిళకు భర్త చెన్నయ్య, స్కూల్‌కు వెళ్లే ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే ఏం జరిగిందో తెలియదుగానీ రంజిత త‌న ముగ్గురు పిల్లల‌కు విష‌మిచ్చి.. అనంతరం తానూ సేవించింది. దీంతో ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోగా, త‌ల్లి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థలానికి చేరుకుని ముగ్గురు పిల్లల మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి త‌ర‌లించారు. ప్రాణాలు కోల్పోయిన పిల్లల‌ను సాయికృష్ణ (12), మ‌ధుప్రియ‌ (10), గౌత‌మ్‌ (8)గా గుర్తించారు. బాధిత మ‌హిళ‌ను చికిత్స నిమిత్తం కుటుంబ స‌భ్యులు ఆస్పత్రికి త‌ర‌లించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ర‌జిత ప‌రిస్థితి విషమంగా ఉన్నట్లు స‌మాచారం. అసలేం జరిగిందంటే..

గురువారం రాత్రి రంజిత త‌న ముగ్గురు పిల్లల‌కు పెరుగు అన్నం తినిపించింది. అనంతరం ఆమె కూడా అదే ఆహారాన్ని భుజించింది. భ‌ర్త చెన్నయ్యకు మాత్రం ప‌ప్పు అన్నం విడిగా పెట్టింది. పెరుగు అన్నం తిన్న ముగ్గురు పిల్లలు ఇంట్లోనే నిద్రపోయారు. భర్త చెన్నయ్య వాటర్ ట్యాంకర్ విధులకు వెళ్లి అర్ధరాత్రి 11 గంటలకు ఇంటికి తిరిగొచ్చాడు. అప్పటికే భార్య తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుంటే ఆమెను ఆస్పత్రికి తరలించాడు. నిద్రపోతున్న పిల్లలు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ క‌ల‌హాల కార‌ణంగానే ర‌జిత ఈ దారుణానికి పాల్పడిందా? లేదా ఎవరైనా వీరి ఆహారంలో విషం కలిపారా? అనే కోణంలో పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us