మంత్రి హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఉత్తమ్ కుమార్ రెడ్డికి తప్పిన పెను ప్రమాదం..!
రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ చేశారు. వాతావరణ పరిస్థితి సరిగా లేకపోవడంతో హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. దీంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. మంత్రి కోదాడ నుంచి హుజూర్ నగర్కు రోడ్డు మార్గంలో వెళ్లిపోయారు. యధావిధిగా తన పర్యటనను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనసాగించారు.

రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ చేశారు. వాతావరణ పరిస్థితి సరిగా లేకపోవడంతో హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. దీంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. మంత్రి కోదాడ నుంచి హుజూర్ నగర్కు రోడ్డు మార్గంలో వెళ్లిపోయారు. యధావిధిగా తన పర్యటనను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనసాగించారు.
హుజూర్ నగర్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనకు మంత్రి త్తమ్ కుమార్ రెడ్డి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందుకోసం హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో మంత్రి ఉత్తమ్ బయలుదేరారు. కోదాడ సమీపంలోకి రాగానే వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఒక్కసారిగా మబ్బులు కమ్ముకోవడం, సన్నపాటి వర్షం కూడా ప్రారంభమైంది. కమ్ముకున్న మబ్బులు, గాలివాన నేపధ్యంలో ఫైలట్ అప్రమత్తమయ్యారు. వాతావరణ శాఖ సూచన మేరకు ఉత్తమ్ ప్రయాణిస్తున్న చాపర్ను కోదాడలో అత్యవసర ల్యాండింగ్ చేశారు.
అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ నుండి నేరుగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం మేళ్లచెరువులో హెలికాఫ్టర్ ల్యాండ్ కావాల్సి ఉంది. కాగా, మంత్రి కోదాడ నుంచి హుజూర్ నగర్కు రోడ్డు మార్గంలో వెళ్లిపోయారు. యధావిధిగా తన పర్యటనను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనసాగించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
