AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KTR on Rains: భారీ వర్షాల నేపథ్యంలో అధికారులతో మాట్లాడిన కేటీఆర్ .. ముందస్తు చర్యలకు ఆదేశాలు జారీ

KTR on Rains: ఓ వైపు రుతుపవనాల ప్రభావం.. మరోవైపు బంగాళాఖాతం లో అల్పపీడనం దీంతో తెలుగు రాష్ట్రాలు భారీ వర్షాలతో తడిచి ముద్దవుతున్నాయి. గత మూడు రోజులుగా ఎడతెరపి..

KTR on Rains: భారీ వర్షాల నేపథ్యంలో అధికారులతో మాట్లాడిన కేటీఆర్  .. ముందస్తు చర్యలకు ఆదేశాలు జారీ
Ktr On Rains
Surya Kala
|

Updated on: Jul 22, 2021 | 6:17 PM

Share

KTR on Rains: ఓ వైపు రుతుపవనాల ప్రభావం.. మరోవైపు బంగాళాఖాతం లో అల్పపీడనం దీంతో తెలుగు రాష్ట్రాలు భారీ వర్షాలతో తడిచి ముద్దవుతున్నాయి. గత మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ భారీ వర్షాల నేపథ్యంలో పురపాలక శాఖ కేటీఆర్ స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి కేటీఆర్ కోరారు. ఈమేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తో పాటు ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడారు.ప్రధానంగా ఉత్తర తెలంగాణ లో నెలకొన్న భారీ వర్షాల వలన ఇప్పటికే పలు మున్సిపాలిటీల్లో నెలకొన్న పరిస్థితుల పైన ఎప్పటికప్పుడు సమీక్షించాలని ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ని ఆదేశించారు. ఇప్పటికే నిర్మల్ వంటి చోట్ల భారీగా కురిసిన వర్షాల నేపథ్యంలో జరుగుతున్న సహాయక చర్యలు ఆరాతీశారు. స్థానిక జిల్లా యంత్రాంగంతో అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు.

మరోవైపు హైదరాబాద్ నగరం లో మరో రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో జిహెచ్ఎంసి యంత్రాంగం సహాయ చర్యల కోసం సిద్ధంగా ఉండాలని కేటీఆర్ సూచించారు. జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో పనిచేసే డిజాస్టర్ రెస్పాన్స్ దళం సైతం అన్ని విధాలుగా అందుబాటులో ఉండాలన్నారు. ఈ వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టెంతవరకు ప్రతి ఒక్క పురపాలక శాఖ అధికారి.. ఉద్యోగి విధుల్లో ఉంటూ స్థానికంగా అందుబాటులో ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని పురపాలక శాఖ యంత్రాంగానికి మంత్రి కేటీఆర్ సూచించారు. పాత భవనాలు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పౌరులకు సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అవసరమైతే వారందర్నీ సురక్షిత ప్రాంతాలకు వెంటనే తరలించేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని కేటీఆర్ అధికారులను కోరారు.

Also Read:   కలిసి చనిపోదాం అంటూ ప్రియురాలికి పురుగులు మందు తాగించిన ప్రియుడు.. ఆపై పారిపోయిన వైనం