BRS – Congress: తగ్గేదేలే.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య లీగల్ వార్.. నోటీసులు ఇచ్చుకుంటున్న నేతలు..
మాటలతోనే మజా ఏముంటుంది. దానిక్కాస్త లీగల్ ఫైట్ టచప్ కూడా ఇస్తే సంవాదం ఇంకా బలంగా ఉంటుంది. లీగల్ నోటీసులతో కొత్త ట్రెండ్ మొదలుపెట్టింది తెలంగాణ రాజకీయం. బీఆర్ఎస్ అగ్రనేతల్లో ఒకరు లీగల్ నోటీస్ అందుకుంటే.. మరొకరు కాంగ్రెస్ ఎంపీకి లీగల్ నోటీసిచ్చారు. అంతంకాదిది ఆరంభం అన్నట్లున్నాయ్ తెలంగాణ గడ్డపై లీగల్ పాలిటిక్స్.

తెలంగాణ పాలిటిక్స్లో కొత్త ట్రెండ్.. ఎప్పుడూ చూడని ట్రెండే.. అదేంటంటే.. ఏకవచన సంబోధనలు, వ్యక్తిగత ఆరోపణలకుదాకా వెళ్లే తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త ఒరవడి కనిపిస్తోంది. మాటకు మాటతో సరిపోవడం లేదు. కౌంటర్కి రివర్స్ కౌంటర్ ఇస్తే చాలడం లేదు. ఎన్ని చెప్పుకున్నా ఎంత తిట్టుకున్నా సంతృప్తి చెందడం లేదు. అంతకుమించి అన్నట్లు.. లీగల్ నోటీసులతో ప్రత్యర్థులు, ఆరోపణలు చేసినవాళ్లను కోర్టుకీడ్చాలనుకుంటున్నారు నేతలు. కొన్నివారాల వ్యవధిలోనే ఇద్దరి లీగల్ నోటీసులతో స్టేట్ పాలిటిక్స్లో ఇప్పుడు దీనిపైనే చర్చ. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అనిల్కుమార్యాదవ్కి లీగల్ నోటీసు ఇచ్చారు బీఆర్ఎస్కి చెందిన మాజీ మంత్రి హరీష్రావు. అవాస్తవ ఆరోపణలతో తన పరువుకు భంగం కలిగించారని న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు హరీష్రావు. ఎప్పట్నించో రాజకీయాల్లో ఉన్న హరీష్రావుకు ఆరోపణలు, సవాళ్లు కొత్తకాకపోయినా.. ఈసారి కౌంటర్తో సరిపెట్టకుండా కాంగ్రెస్ ఎంపీకి లీగల్ నోటీస్ కూడా పంపారు. హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలతో పాటు మూసీ ప్రక్షాళన.. రాజకీయాలను షేక్ చేస్తోంది. ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడుతున్నాయి విపక్షపార్టీలు. బీఆర్ఎస్ నుంచి హరీష్రావు, కేటీఆర్తో పాటు ముఖ్యనేతలు బాధితులకు అండగా నిలుస్తున్నారు. ఇదే సమయంలో హరీష్రావుపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. హిమాయత్ సాగర్ FTL పరిధిలో ఉన్న ఆనంద్ కన్వెన్షన్లో హరీష్కి వాటాలున్నాయని ఆరోపించారు ఎంపీ అనిల్ కుమార్. మూసీ పర్యటన పేరుతో రాజకీయ డ్రామాలు ఎందుకో తెలుసా.. హిమాయత్సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో కట్టిన కన్వెన్షన్లో హరీష్...