Kamareddy:బార్లో తుపాకీతో యువకుడు..! దెబ్బకు మత్తువదిలి పారిపోయిన మందుబాబులు
బార్లో యువకుడు చేసిన వీరంగానికి మందుబాబులకు దెబ్బకు మత్తు దిగిపోయింది. చేతిలో గన్పట్టుకుని యువకుడి చేసిన వీరంగంతో అక్కడి మందుబాబులంతా తలోదిక్కు తప్పించుకు పారిపోయారు. బతికుంటే, మరెప్పుడైనా తాగొచ్చురా బాబోయ్ అనుకుని, మత్తు వదిలించుకుని కాళ్లకు పనిచెప్పారు.
బార్లో యువకుడు చేసిన వీరంగానికి మందుబాబులకు దెబ్బకు మత్తు దిగిపోయింది. చేతిలో గన్పట్టుకుని యువకుడి చేసిన వీరంగంతో అక్కడి మందుబాబులంతా తలోదిక్కు తప్పించుకు పారిపోయారు. బతికుంటే, మరెప్పుడైనా తాగొచ్చురా బాబోయ్ అనుకుని, మత్తు వదిలించుకుని కాళ్లకు పనిచెప్పారు. బతుకు జీవుడా అని ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఏ – వన్ బార్ లో చోటుచేసుకుంది. గత కొన్ని నెలల క్రితం ఓ ముగ్గురు వ్యక్తులు కామారెడ్డి శివారు లో సృష్టించిన వీరంగం మరువక ముందే, తాజా ఘటన సంచలనం రేపుతోంది. నెల క్రితం ఓ దాబా వద్ద భోజనం చేయడానికి వెళుతున్న నలుగురు యువకులను బెదిరించిన సంఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది. తాజాగా నిన్న రాత్రి ఓ వ్యక్తి తుపాకీతో బెదిరింపులకు పాల్పడ్డాడు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా గల ఏ – వన్ బార్ లోకి చొరబడ్డాడు అజంపూర్ కాలనీకి చెందిన వ్యక్తి రఫీక్ అనే వ్యక్తి. చేతిలో గన్ పట్టుకుని హల్చల్ చేశాడు. దీంతో అక్కడ మద్యం సేవిస్తున్న మందుబాబులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై పారి పోయారు. స్థానికులు అప్రమత్తమై కామారెడ్డి పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు..గన్తో రెచ్చిపోయిన రఫీక్ ను అదుపులోకి తీసుకొన్నారు. అతణ్ని అక్కడి నుంచి కామారెడ్డి పోలీస్ స్టేషన్ కు తరలించారు. యువకుడు ఉపయోగించిన గన్, ఎయిర్ గన్గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు రఫీక్ పై 385 సెక్షను కింద కెసు నమోదు చేశారు.
అక్రమంగా గన్ కలిగి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. రఫిక్ వద్ద ఉన్న గన్ ఎయిర్ గా గుర్తించిన పోలీసులు. కామారెడ్డి జిల్లాలో గన్ లైసెన్స్ కలిగిన వారు 27 మంది ఉన్నట్టుగా తెలిపారు. గతంలో రపీక్ పై బంధువులు దాడి చేయడంతో ఆత్మరక్షణ కోసం ఆన్ లైన్ లో ఎయిర్ గన్ కొనుగోలు చేసినట్టు కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.