Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: కొంప కొల్లేరు.. పక్కనోళ్లు ఇల్లు కట్టుకోవడానికి పునాదులు తీస్తుంటే..

ఎంకి పెళ్లి.. సుబ్బి చావుకు వచ్చిందంటే ఇదేనేమో.. పక్కనోళ్లు ఇల్లు కట్టుకోవడానికి పునాదులు తీస్తుంటే.. ఆ దెబ్బకి పక్కనే ఉన్న బిల్డింగ్‌ ఒరిగిపోయింది..!. కొంప కొల్లేరు అయ్యింది అంటే ఇదేనేమో! అగ్గిపెట్టంత స్థలంలో అంతస్తులపై అంతస్తులు కట్టేసే సరికి.. పక్కన ఉన్న ఖాళీ స్థలంలో గుంత తవ్వగానే భవనం ఒరిగిపోయింది.

Hyderabad: కొంప కొల్లేరు.. పక్కనోళ్లు ఇల్లు కట్టుకోవడానికి పునాదులు తీస్తుంటే..
Building Tilts
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 20, 2024 | 9:54 AM

హైదరాబాద్ కొండాపూర్‌ డివిజన్‌లోని సిద్ధిఖ్‌నగర్‌లో మంగళవారం రాత్రి టెన్షన్ వాతావరణం నెలకుంది.  ఒక్కసారిగా ఐదు అంతస్థుల భవనం వరగడంతో. బిల్డింగ్‌‌లోని 30 మంది ప్రాణభయంతో పరుగులు తీశారు. థర్డ్ ఫ్లోర్‌లో నివాసం ఉంటున్న.. ఇక్బాల్‌ హుస్సేన్‌ అనే వ్యక్తి భయంతో పైనుంచి కిందకు దూకడంతో తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పక్క స్థలంలో ఇంటి నిర్మాణం కోసం గుంతలు తవ్వడంతో ప్రమాదం జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళితే..  కొండాపూర్‌ డివిజన్‌లోని సిద్ధిఖీనగర్‌ ప్లాటు నం.1639లోని 50 గజాల స్థలంలో వి.లక్ష్మణ్, స్వప్న దంపతులు జీ+4+పెంట్‌హౌస్‌ బిల్డింగ్ కట్టుకున్నారు. దానికి హ్యాపీ రెసిడెన్సీ అని నామకరణం చేశారు. గ్రౌండ్‌ ఫ్లోరు, పెంట్‌హౌస్‌లో ఒక సింగిల్ రూమ్ ఏర్పాటు చేయగా, మిగిలిన నాలుగు అంతస్తుల్లో డబుల్ రూమ్ లెక్కన కట్టారు. ప్రస్తుతం ఆయా గదుల్లో..  మణిపుర్‌, అస్సాంకు చెందిన 50 మంది చిరుద్యోగులు ఉంటున్నారు. మూడు రోజుల క్రితం ఆ బిల్డింగ్ వెనుక.. మరో కొత్త భవన నిర్మాణ పనులు స్టార్ట్ చేశారు. మంగళవారం ఉదయం  రెండు పిల్లర్లకు గుంతలు తవ్వారు. దాని ఎఫెక్ట్‌తో రాత్రి 8.30 గంటల సమయంలో హ్యాపీ రెసిడెన్సీ  ఒక్కసారిగా గుంతల వైపునకు ఒరిగింది. భవనంలో నివాసం ఉంటున్న వారు భయాందోళనకు లోనై… బయటకు పరుగులు తీశారు. కాసేపటికి పోలీసులు, జీహెచ్‌ఎంసీ, రెస్క్యూ టీమ్స్ స్పాట్‌కు చేరుకుని.. హ్యాపీ రెసిడెన్సీతోపాటు పక్కనున్న రెండు బిల్డింగులను ఖాళీ చేయించారు. ఒరిగిన భవనాన్ని పూర్తిగా కూల్చివేసే ఏర్పాట్లు చేస్తున్నారు. రూల్స్‌కు విరుద్ధంగా తక్కువ విస్తీర్ణంలో ఆరు స్లాబులు వేసినట్లు అధికారులు గుర్తించారు.

బిల్డింగ్‌ ఓనర్‌ తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నాడు. తన జీవితం ఆగమైందంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. మిర్యాలగూడలో రెండెకరాల పొలం అమ్ముకొని.. ఇక్కడ ఇల్లు కట్టుకున్నానని.. ఇప్పుడు కూల్చేస్తే తనకు దిక్కెక్కవరు అంటూ భోరుమని విలపిస్తున్నాడు.

మరిన్ని తెలంగాణా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..