AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్టోబర్‌ నుంచి తెరుచుకోనున్న యూనివర్సిటీలు.. సెప్టెంబర్ 1 నుంచి వారికి మాత్రమే ఆన్‌లైన్ తరగతులు

రాష్ట్రంలో కరోనా తీవ్రత అదుపులోకి వస్తే అక్టోబర్-నవంబర్ మధ్య యూనివర్సిటీలలో చదివే విద్యార్ధులకు ఫిజికల్ క్లాసులు నిర్వహించాలని ఉన్నత విద్యామండలి..

అక్టోబర్‌ నుంచి తెరుచుకోనున్న యూనివర్సిటీలు.. సెప్టెంబర్ 1 నుంచి వారికి మాత్రమే ఆన్‌లైన్ తరగతులు
students
Ravi Kiran
|

Updated on: Jul 01, 2021 | 4:36 PM

Share

రాష్ట్రంలో కరోనా తీవ్రత అదుపులోకి వస్తే అక్టోబర్-నవంబర్ మధ్య యూనివర్సిటీలలో చదివే విద్యార్ధులకు ఫిజికల్ క్లాసులు నిర్వహించాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి వెల్లడించారు. తాజాగా ఆరు యూనివర్సిటీలకు సంబంధించిన వీసీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఈ మీటింగ్‌లో దోస్త్, యూజీసీ గైడ్‌లైన్స్, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ విధివిధానాలు, రూస నిధులతో యూనివర్సిటీలు చేయాల్సిన అభివృద్ధిపై వీసీలకు ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి పలు కీలక సూచనలు ఇచ్చారు.

సెప్టెంబర్ 1వ తేదీ నుంచి డిగ్రీ ఫస్టియర్ విద్యార్ధులకు ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభించాలని అన్ని వర్సిటీలకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే రాష్ట్రంలో కరోనా పూర్తిగా అదుపులోకి వస్తే.. అక్టోబర్-నవంబర్ మధ్య యూనివర్సిటీల విద్యార్ధులకు ఫిజికల్ క్లాసులు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలని తెలిపారు. అన్ని యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ, పీజీ ఎగ్జామ్స్ ఈ నెలలోనే నిర్వహిస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి స్పష్టం చేశారు.

Also Read: 

హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి అందుబాటులోకి మరిన్ని ఎంఎంటీఎస్ రైళ్లు..

సింగిల్‌గా ఉందని ఎండ్రకాయను రౌండప్ చేసిన సింహాలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే!

టీమిండియాపై ట్రిపుల్ సెంచరీ.. 48 బంతుల్లో శతకం.. బౌలర్లకు చుక్కలు చూపించిన ఆ ఓపెనర్ ఎవరంటే.!