AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఇద్దర్నీ వేధించింది ఒక్కడే

హైదరాబాద్‌: మహిళా సెలబ్రిటీలు, రాజకీయ నాయకురాళ్లపై సోషల్ మీడియాలో వేధింపులకు పాల్పడేవారికి ఉచ్చు బిగిస్తుంది. వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి, నటి పూనం కౌర్‌లను సోషల్ మీడియాలో వేధించింది ఒక్కరేనని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. తమ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కొందరు వ్యక్తులు ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ ఛానళ్లలో అశ్లీల కథనాలు, అసభ్య రాతలు, మార్ఫింగ్ ఫోటోలు పోస్ట్‌ చేస్తున్నారంటూ లక్ష్మీపార్వతి, పూనం కౌర్‌ వేర్వేరుగా సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీస్‌ అధికారులు […]

ఈ ఇద్దర్నీ వేధించింది ఒక్కడే
Ram Naramaneni
|

Updated on: May 15, 2019 | 12:35 PM

Share

హైదరాబాద్‌: మహిళా సెలబ్రిటీలు, రాజకీయ నాయకురాళ్లపై సోషల్ మీడియాలో వేధింపులకు పాల్పడేవారికి ఉచ్చు బిగిస్తుంది. వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి, నటి పూనం కౌర్‌లను సోషల్ మీడియాలో వేధించింది ఒక్కరేనని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. తమ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కొందరు వ్యక్తులు ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ ఛానళ్లలో అశ్లీల కథనాలు, అసభ్య రాతలు, మార్ఫింగ్ ఫోటోలు పోస్ట్‌ చేస్తున్నారంటూ లక్ష్మీపార్వతి, పూనం కౌర్‌ వేర్వేరుగా సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీస్‌ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. పూనం కౌర్‌ ఫిర్యాదులో పేర్కొన్న ఒక పేరు.. లక్ష్మీపార్వతిని వేధించిన నిందితుడి పేరు ఒకటేనని గుర్తించారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. హైదరాబాద్‌ ఫిలింనగర్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్‌లో వాళ్లు కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారని సమాచారం సేకరించారు. లక్ష్మీపార్వతిపై ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి, పూనం కౌర్‌పై గత 8 నెలలుగా అసభ్య వ్యాఖ్యలు, అశ్లీల కథనాలను పోస్ట్‌ చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. డబ్బు కోసం ఇదంతా చేస్తున్నారా? వ్యక్తిగత కక్షతో చేస్తున్నారా? అనేది వారు పట్టుబడ్డాకే తెలుస్తుందని పోలీసులు వివరించారు.