Telangana: ఆ వార్తలు నమ్మొద్దు.. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ పై ఇంటర్ బోర్డ్ క్లారిటీ
ఇంటర్ ఫలితాల విడుదలపై ఇంటర్మీడియట్ బోర్డ్(Intermediate Board) కీలక ప్రకటన చేసింది. గత కొన్ని రోజులుగా రిజల్స్ట్ పై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని సూచించారు. ఫలితాల వెల్లడి వార్తలపై తామే సమాచారం...

ఇంటర్ ఫలితాల విడుదలపై ఇంటర్మీడియట్ బోర్డ్(Intermediate Board) కీలక ప్రకటన చేసింది. గత కొన్ని రోజులుగా రిజల్స్ట్ పై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని సూచించారు. ఫలితాల వెల్లడి వార్తలపై తామే సమాచారం అందిస్తామని, అప్పటి వరకు విద్యార్థులు ఆందోళన చెందవద్దని అధికారులు సూచించారు. ఫేక్ వార్తలకు దూరంగా ఉండాలని కోరారు. కాగా.. తెలంగాణ(Telangana) రాష్ట్ర ఇంటర్మీడియట్ ఫలితాలు ఈరోజు (జూన్ 15న) విడుదలవుతాయంటూ సోషల్ మీడియాలో(Social Media) వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఐతే ఈ వార్తలపై తెలంగాణ ఇంటర్ బోర్డు మంగళవారం క్లారిటీ ఇచ్చింది. సదరు వార్తలన్నీ వాస్తవం కాదని, విద్యార్ధులు వాటిని నమ్మవద్దని, ఫలితాలు విడుదల ఎప్పుడనేది త్వరలోనే ప్రకటిస్తామని ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 9,07,393 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యారు. సమాధాన పత్రాల మూల్యాంకనం 14 కేంద్రాల్లో చేపట్టారు. మే 6 నుంచి 24 వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు జరిగాయి.

Telangana Inter Results
మరోవైపు.. తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు జూన్ 25 లేదా 26 విడుదల అవుతాయని పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. మే 23 నుంచి జూన్ 1 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. టెన్త్ పబ్లిక్ పరీక్ష పత్రాల స్పాట్ వాల్యుయేషన్ కొనసాగుతోంది. ఈ ఏడాది జూన్లో ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు మాత్రమే తరగతులను ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..