AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: కారులో అనుమానాస్పదంగా నలుగురు వ్యక్తులు.. తనిఖీ చేసిన పోలీసులకు దిమ్మతిరిగే షాక్‌

నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో పూర్తిగా చెక్‌ చేశారు. మొత్తం 79 లక్షల హవాలా డబ్బులను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నలుగురు వ్యక్తుల్లో ఇద్దరు హైదరాబాద్‌కు చెందిన వారిగా, మరొకరు ఢిల్లీకి చెందిన వ్యక్తులుగా గుర్తించారు.

Hyderabad: కారులో అనుమానాస్పదంగా నలుగురు వ్యక్తులు.. తనిఖీ చేసిన పోలీసులకు దిమ్మతిరిగే షాక్‌
Hyderabad Police
Basha Shek
|

Updated on: Oct 09, 2022 | 7:48 AM

Share

హైదరాబాద్‌ పోలీసులు భారీ మొత్తంలో హవాలా నగదును స్వాధీనం చేసుకున్నారు. సంతోష్‌ నగర్‌ నుంచి కాటేదాన్‌ నుంచి ప్రయాణిస్తున్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న పోలీసులు చంద్రాయణ గుట్ట x రోడ్ వద్ద 2 కార్లను నిలిపేశారు. అందులోని నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో పూర్తిగా చెక్‌ చేశారు. మొత్తం 79 లక్షల హవాలా డబ్బులను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నలుగురు వ్యక్తుల్లో ఇద్దరు హైదరాబాద్‌కు చెందిన వారిగా, మరొకరు ఢిల్లీకి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.  ఈ డబ్బు ఎక్కడిది? ఎక్కడికి తీసుకెళుతున్నారు? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Follow Us