Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రల్, డీజిల్ కొట్టిస్తున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త.. అంతా మాయే

అంతా మాయ... మీరు చూసేదంతా మాయే... మీ కళ్లు కూడా మిమ్మల్ని మోసం చేస్తాయ్... అంతా పర్ఫెక్ట్‌గా ఉన్నట్లు కనిపిస్తుంది... కానీ మీరు మోసపోతారు...

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రల్, డీజిల్ కొట్టిస్తున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త.. అంతా మాయే
Petrol Bunks Cheating
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 08, 2021 | 5:49 PM

అంతా మాయ… మీరు చూసేదంతా మాయే… మీ కళ్లు కూడా మిమ్మల్ని మోసం చేస్తాయ్… అంతా పర్ఫెక్ట్‌గా ఉన్నట్లు కనిపిస్తుంది… కానీ మీరు మోసపోతారు… మన కళ్ల ముందు… మనకు తెలియకుండానే మోసం చేస్తారు… ఇదేమీ మాయామంత్రం కాదు… గారడీ అస్సలే కాదు… అదెలాగంటారా? అదే మైక్రో చిప్ మాయ.  మీరు లీటర్ పెట్రోల్ పోయించుకున్నారా? కానీ, మీకు పోసింది 1000ML కాదు… 950ML మాత్రమే… కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. అదేంటి, డిస్ ప్లేలో లీటర్ చూపించింది కదా అనుకుంటున్నారా? అదే మాయ. మీకు తెలియకుండానే మీ పెట్రోల్ నుంచి 50ML కొట్టేస్తున్నారు.

పెట్రోల్ బంకుల్లో జరిగే మోసాల్లో మైక్రో మాయ ఒకటి. దీని ద్వారా మన కళ్ల మందే మనకు తెలియకుండా మన పెట్రోల్ ను కొట్టేస్తారు. అందుకోసం ప్రత్యేకంగా తయారుచేసిన సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తారు. ఒకే ఒక్క చిన్న చిప్‌తో దర్జాగా దోపిడీకి పాల్పడతారు. లీటరుకు యాభై నుంచి హండ్రెడ్ ఎంఎల్ కొట్టేస్తున్నారు. ఒకవైపు పెరిగిన పెట్రో ధరలతో వినియోగదారుల జేబులకు చిల్లు పడుతుంటే… మరోవైపు బంకు యజమానులు మైక్రో చిప్స్‌తో నిలువు దోపిడీ చేస్తున్నారు. ఈ మైక్రో చిప్ మాయగాళ్లు దేశమంతటా ఉన్నారు. అయితే, ఇలాంటి ముఠాలు ఎక్కువగా హైదరాబాద్‌లోనే ఉన్నట్లు తేలింది.

గప్‌చుప్‌గా సాగుతోన్న మైక్రో చిప్ మోసాలపై హైదరాబాద్‌లో తీగ లాగితే మూడు రాష్ట్రాల్లో డొంక కదిలింది. తెలంగాణ, ఏపీ, కర్నాటకలో మొత్తం 34 బంకుల్లో ఈ మైక్రో చిప్స్‌ అమర్చినట్లు ముఠా ఒప్పుకుంది. తెలంగాణలో కామారెడ్డి, వనపర్తి, ఖమ్మం, సిద్దిపేట, మహబూబ్‌నగర్‌, సూర్యాపేట తదితర ప్రాంతాల్లో మైక్రో చిప్స్ అమర్చినట్లు నిందితులు చెప్పడంతో స్టేట్ వైడ్‌గా రైడ్స్ చేశారు. ఖమ్మం వైరాలో చిప్స్‌తో మోసాలకు పాల్పడుతోన్న పెట్రోల్ బంక్‌ను పోలీసులు సీజ్ చేశారు.  మీరు కొట్టించుకున్న పెట్రోల్‌కు రావాల్సినంత మైలేజ్ రాకపోతే మీరు మోసపోతున్నట్టే. చిప్పులతో మీ జేబుకు చిల్లు పెట్టేశారని గుర్తించాలి. అనుమానం వస్తే నిలదీయండి. వెంటనే సంబంధిత అధికారులకు కంప్లైంట్ చేయండి.

Also Read: ‘కుంగుబాటు నుంచి కోలుకునేందుకు కొంత టైమ్ ఇవ్వండి’.. సమంత భావోద్వేగ లేఖ

నెట్టింట సంచలనంగా మారిన పూనమ్ కౌర్ ట్వీట్.. విపరీతమైన చర్చ