Hyderabad: కూకట్పల్లిలో ఘోర ప్రమాదం.. బైక్ను ఢీకొట్టిన టిప్పర్.. ఆ తర్వాత
Kukatpally Road Accident: హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ను టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో సాఫ్ట్వేర్ ఉద్యోగి
Kukatpally Road Accident: హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ను టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో సాఫ్ట్వేర్ ఉద్యోగి దుర్మరణం చెందాడు. బైక్ను ఢీ కొట్టిన అనంతరం టిప్పర్ ఆగకుండా దూసుకెళ్లింది. దీంతో మృతదేహాన్ని టిప్పర్ 20 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో కేపీహెచ్బీ కాలనీలో జరిగింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడు సాఫ్ట్వేర్ ఉద్యోగి జగన్మోహన్ రెడ్డిగా గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఇదిలాఉంటే.. ఎల్బీనగర్లో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో ఉన్న శనివారం అర్ధరాత్రి ఎల్జీనగర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా అండర్ పాస్లో డివైడర్ని ఢీకొట్టి బోల్తా పడింది. కాగా ఆ కారుపై రూ.13,350 పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ పరారయ్యాడు. మద్యం మత్తులోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read: