AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తొలిసారిగా అండర్ గ్రౌండ్ లో రూట్.. ఆ మార్గంలో అందుబాటులోకి..

ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తూ తక్కువ కాలంలోనే ఎక్కువ ప్రజాదరణ పొందని హైదరాబాద్ మెట్రో మరో అడుగు ముందుకేసింది. నగరంలో మొట్ట మొదటి సారిగా భూగర్భ మెట్రో తీసుకురానున్నట్లు..

Hyderabad: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తొలిసారిగా అండర్ గ్రౌండ్ లో రూట్.. ఆ మార్గంలో అందుబాటులోకి..
Hyderabad Metro Rail
Ganesh Mudavath
|

Updated on: Nov 29, 2022 | 9:10 PM

Share

ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తూ తక్కువ కాలంలోనే ఎక్కువ ప్రజాదరణ పొందని హైదరాబాద్ మెట్రో మరో అడుగు ముందుకేసింది. నగరంలో మొట్ట మొదటి సారిగా భూగర్భ మెట్రో తీసుకురానున్నట్లు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు రెండో దశలో 31 కిలోమీటర్లు చేపట్టనున్న మెట్రో కారిడార్‌లో విమానాశ్రయం సమీపంలో 2.5 కిలోమీటర్లు అండర్‌ గ్రౌండ్ లో మెట్రో నిర్మించనున్నారు. ఈ మెట్రో కారిడార్‌కు రూ. 6,250 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా.. ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. అమీర్‌పేట్‌ మెట్రో స్టేషన్‌లో మెట్రో రైల్‌ ఐదేళ్ల వేడుకలను నిర్వహించారు. మెట్రో రైలు అందుబాటులోకి వచ్చిన మొదటి రోజే రెండు లక్షల మంది ప్రయాణించారన్న ఎన్వీఎస్ రెడ్డి.. ప్రస్తుతం నాలుగు లక్షలకు పైగా ప్రజలు రాకుపోకలు సాగిస్తున్నారని చెప్పారు. రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు వరకు మెట్రో రెండో దశ నిర్మాణానికి డిసెంబర్ 9 న ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని స్పష్టం చేశారు.

కాగా.. హైదరాబాద్ మెట్రోరైలు రెండో దశకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మెట్రోరైలు మొదటి దశను నవంబర్ 2017 లో నాగోల్ – అమీర్‌పేట – మియాపూర్ మార్గంతో ప్రారంభించారు. తరువాత ఎల్‌బీ నగర్-అమీర్ పేట మార్గం అక్టోబర్ 2018 లో ప్రారంభించారు. అమీర్ పేట -హైటెక్ సిటీ మార్గాన్ని మార్చి 2019 న ప్రారంభించారు. ఆ తర్వాత 2020 ఫిబ్రవరి 7న జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మార్గం అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటితో మొదటి దశలో 69 కిలోమీటర్ల మార్గం అందుబాటులోకి వచ్చింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం హైదరాబాద్‌లో మెట్రోలో రోజుకు 4 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. కోవిడ్‌కంటే ముందే 5 లక్షల మంది ప్రయాణించగా ఇప్పుడా సంఖ్య తగ్గింది. ఇక ఎయిర్ పోర్ట్‌కు ప్రస్తుతం బస్సు లేదా క్యాబ్‌లపై ఎక్కువగా ఆధారపడే పరిస్థితి ఉంది. అయితే మెట్రో అందుబాటులోకి వస్తే ప్రయాణికులు వేగంగా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకునే అవకాశం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Follow Us
టీమిండియా సెమీఫైనల్‌ చేరడం పక్కా.. ఏ టీంను ఢీ కొట్టనుందో తెలుసా?
టీమిండియా సెమీఫైనల్‌ చేరడం పక్కా.. ఏ టీంను ఢీ కొట్టనుందో తెలుసా?
రోజుకు కేవలం రూ.150 ఆదా చేస్తే చేతికి రూ.26 లక్షలు..
రోజుకు కేవలం రూ.150 ఆదా చేస్తే చేతికి రూ.26 లక్షలు..
సింగర్ చిన్మయిపై నెటిజన్ దారుణమైన కామెంట్స్.. స్ట్రాంగ్ కౌంటర్
సింగర్ చిన్మయిపై నెటిజన్ దారుణమైన కామెంట్స్.. స్ట్రాంగ్ కౌంటర్
ఈ లడ్డూ రోజుకి ఒకటి తిన్నారంటే.. ఈ సమస్యలకు చూమంత్రం వేసినట్టే
ఈ లడ్డూ రోజుకి ఒకటి తిన్నారంటే.. ఈ సమస్యలకు చూమంత్రం వేసినట్టే
మీ పిల్లల కోసం ల్యాప్‌టాప్‌ కొంటున్నారా?
మీ పిల్లల కోసం ల్యాప్‌టాప్‌ కొంటున్నారా?
పాలు విరిగిపోకుండా చేసే సైంటిఫిక్ పద్ధతులు తెలుసా
పాలు విరిగిపోకుండా చేసే సైంటిఫిక్ పద్ధతులు తెలుసా
తెలంగాణ విద్యుత్‌ శాఖలో ఉద్యోగాలు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేదు
తెలంగాణ విద్యుత్‌ శాఖలో ఉద్యోగాలు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేదు
20 రోజులకే ఓటీటీలోకి తెలుగు హారర్ థ్రిల్లర్.. అధికారిక ప్రకటన
20 రోజులకే ఓటీటీలోకి తెలుగు హారర్ థ్రిల్లర్.. అధికారిక ప్రకటన
నాసా నుండి భారత్ వరకు ఎవరికీ అంతుచిక్కని రహస్యాలు!
నాసా నుండి భారత్ వరకు ఎవరికీ అంతుచిక్కని రహస్యాలు!
నోరూరించే ఉసిరికాయ కూర.. ఓసారి ఇలా ట్రై చేయండి.. టేస్ట్ అదుర్స్
నోరూరించే ఉసిరికాయ కూర.. ఓసారి ఇలా ట్రై చేయండి.. టేస్ట్ అదుర్స్