AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. రేపటి నుంచే బ్రేక్ దర్శనాల్లో ప్రయోగాత్మక మార్పులు..

తిరుమల శ్రీవారిని దర్శించుకునే బ్రేక్ దర్శన సమయం మార్పు చేపడుతున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. డిసెంబరు 1 నుంచి ప్రయోగాత్మకంగా ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు వివరించారు. నవంబరు 30న...

TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. రేపటి నుంచే బ్రేక్ దర్శనాల్లో ప్రయోగాత్మక మార్పులు..
Tirumala Tirupati Devasthanam
Ganesh Mudavath
|

Updated on: Nov 30, 2022 | 7:49 AM

Share

తిరుమల శ్రీవారిని దర్శించుకునే బ్రేక్ దర్శన సమయం మార్పు చేపడుతున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. డిసెంబరు 1 నుంచి ప్రయోగాత్మకంగా ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు వివరించారు. నవంబరు 30న మాధవంలో శ్రీవాణి ట్రస్టు దాతలకు కౌంటర్ ప్రారంభినట్లు చెప్పారు. తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు ఒకటో తేదీ నుంచి ప్రయోగాత్మకంగా బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 8 గంటలకు మారుస్తున్నట్లు తెలిపారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో రాత్రివేళ వేచి ఉండే భక్తులకు ఉదయం త్వరితగతిన దర్శనం కల్పించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఈ కారణంగా భక్తులు ఏరోజుకారోజు తిరుపతి నుంచి తిరుమలకు చేరుకుని బ్రేక్ దర్శనం చేసుకునే అవకాశం ఉందని, దీంతో తిరుమలలో గదులపై ఒత్తిడి తగ్గే అవకాశముందని అంచనా వేస్తున్నారు. శ్రీవాణి ట్రస్టు దాతల కోసం తిరుపతిలోని మాధవం విశ్రాంతి గృహంలో బుధవారం ఉదయం 10 గంటలకు టికెట్ కౌంటర్ ప్రారంభించనున్నారు. ఇకపై శ్రీవాణి ట్రస్ట్ దాతలకు ఇక్కడే ఆఫ్ లైన్ టికెట్లు కేటాయిస్తారు. గదులు కూడా ఇక్కడే మంజూరు చేస్తారు.

ప్రస్తుతం వీఐపీ బ్రేక్‌ దర్శనం టికెట్లున్న భక్తులను ఉదయం 6 గంటలకు దర్శనానికి అనుమతిస్తున్నారు. గురువారం నుంచి ఉదయం 8 గంటలకు అనుమతిస్తారు. స్వామికి రెండోగంట నివేదన తరువాత 10.30 గంటల నుంచి జనరల్‌ బ్రేక్‌ దర్శనం ప్రారంభిస్తారు. దీంతో సామాన్య భక్తులు స్వామి దర్శనం కోసం వేచి ఉండే సమయం తగ్గనుంది. నెలరోజులు ఈ విధానాన్ని పరిశీలిస్తారు. శ్రీవారి ఆలయంలో 1994కి పూర్వం వీఐపీ బ్రేక్‌ దర్శనాలు లేవు. భక్తులందరినీ స్వామి దర్శనానికి కులశేఖరపడి వరకు అనుమతిచ్చేవారు. వీఐపీలు ఏ సమయంలో వచ్చినా దర్శనానికి అనుమతించేవారు. ఆ తర్వాత వీఐపీ బ్రేక్‌ దర్శనాల్లో అనేక మార్పులు వచ్చాయి.

అయితే.. బ్రేక్‌ దర్శనాలకే మూడు నుంచి నాలుగు గంటలు సమయం పడుతుండడంతో సర్వదర్శనం కోసం వేచి చూసే టైమ్ పెరుగుతోంది. ముందురోజు అర్ధరాత్రి 12 గంటలకు నిలిపేసిన క్యూ లైన్‌ తరువాత రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతోంది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ సమయాన్ని తగ్గించేందుకు టీటీడీ మార్పులకు శ్రీకారం చుట్టింది. వీఐపీ బ్రేక్‌ దర్శనం టికెట్లున్న భక్తులు నేరుగా తిరుమలకు చేరుకుని స్వామిని దర్శించుకునే వెసులుబాటు లభిస్తుంది. నెలరోజులు పరిశీలించి ఈ విధానం అమలుపై టీటీడీ నిర్ణయం తీసుకోనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
జిమ్‌కి వెళ్తూ మధ్యలోనే హఠాత్తుగా మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..
జిమ్‌కి వెళ్తూ మధ్యలోనే హఠాత్తుగా మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..
రెండు చేతులు కలిపే విదానం బట్టి.. మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు
రెండు చేతులు కలిపే విదానం బట్టి.. మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు
కాకులు ఎంత కాలం జీవిస్తాయో తెలుసా? ముసలి కాకుల స్పెషాలిటీ అదే
కాకులు ఎంత కాలం జీవిస్తాయో తెలుసా? ముసలి కాకుల స్పెషాలిటీ అదే
రోహిత్ భారీ రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ.. అదేంటంటే?
రోహిత్ భారీ రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ.. అదేంటంటే?
మీరు కూరల్లో వేసే ఈ రెబ్బలు.. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే..
మీరు కూరల్లో వేసే ఈ రెబ్బలు.. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే..
ఒక్కసారిగా రూ. 25 పెరిగిన డీజిల్ ధర.. పెట్రోల్‌పై రూ.7.41..!
ఒక్కసారిగా రూ. 25 పెరిగిన డీజిల్ ధర.. పెట్రోల్‌పై రూ.7.41..!
ఆకివీడు చుట్టూ 500 మంది పోలీసులతో భారీ భద్రత
ఆకివీడు చుట్టూ 500 మంది పోలీసులతో భారీ భద్రత
వేసవిలో గుడ్లు ఇలా నిల్వ చేస్తే.. 3 నెలలైనా ఫ్రెష్ గా ఉంటాయ్!
వేసవిలో గుడ్లు ఇలా నిల్వ చేస్తే.. 3 నెలలైనా ఫ్రెష్ గా ఉంటాయ్!
అనుమానంతో ఆళిని బలి తీసుకున్నాడు...
అనుమానంతో ఆళిని బలి తీసుకున్నాడు...
సీన్ చూసి యాక్సిడెంట్ అనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే..
సీన్ చూసి యాక్సిడెంట్ అనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే..