AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్లు చూస్తె స్టన్ అవ్వాల్సిందే

అబ్బబ్బ.! ఏం రుచిరా.. ఈ హైదరాబాదీలు 2024లో భలే భలేగా ఫుడ్ ఆర్డర్స్ చేసేశారు. ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. వామ్మో! భలేగా ఉందిగా.. మరి రోజుకు ఎన్ని ఆర్డర్లు.. ఏడాదిలో ఎన్ని ఆర్డర్లు.. దోశలు ఎన్ని.? బిర్యానీలు ఎన్ని.? ఇప్పుడు తెలుసుకుందామా..

Hyderabad: ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్లు చూస్తె స్టన్ అవ్వాల్సిందే
Dosa And Biryani
Ravi Kiran
|

Updated on: Dec 25, 2024 | 12:18 PM

Share

హైదరాబాదీలకు లవ్ ఆఫ్ బిర్యానీ ఈ ఏడాది పీక్స్‌కి చేరిందని చెప్పొచ్చు. ‘హౌ హైదరాబాద్ స్విగ్గీడ్’ నివేదికలో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. 2024లో హైదరాబాదీలు సుమారు 1.57 కోట్ల బిర్యానీ ఆర్డర్లు చేయగా.. ప్రతి నిమిషానికి 34 బిర్యానీలను ఆర్డర్ చేసినట్టు తెలిపింది. అటు హైదరాబాదీల ఫేవరెట్ స్వీటుగా ‘డబుల్ కా మీటా’ నిలిచింది.

ఇది చదవండి: బాబు బంగారం.! 20 బంతుల్లో మ్యాచ్ మడతెట్టేసాడు.. కట్ చేస్తే.. 9 నెంబర్‌లో తుఫాన్ ఇన్నింగ్స్

ఇక చికెన్ బిర్యానీల విషయానికొస్తే.. 2024లో హైదరాబాద్‌లో ఏకంగా 97.21 లక్షల చికెన్ బిర్యానీ ప్లేట్లు ఆర్డర్ అయ్యాయి. అంటే ప్రతి ఒక్క నిమిషానికి 21 చికెన్ బిర్యానీలు ఆర్డర్ చేశారు. అలాగే ఓ ఫుడ్డీ 60 బిర్యానీల కోసం ఒకే ఆర్డర్‌లో రూ.18,840 వెచ్చించాడట. అలాగే ఈ ఏడాది స్విగ్గీలో మొత్తం 4,46,000 చికెన్ బిర్యానీలను ఆర్డర్ చేశారు. అటు టీ20 ప్రపంచకప్ సమయంలో 8,69,000 ప్లేట్ల చికెన్ బిర్యానీని లాగించారు.

ఇవి కూడా చదవండి

ఇక హైదరాబాదీల బ్రేక్‌ఫాస్ట్ విషయానికొస్తే.. వారు దోశలను ఎక్కువగా ఇష్టపడుతున్నారని, అందులోనూ ఉల్లిదోశపై ఎక్కువగా మక్కువ చూపుతున్నారని ఫుడ్ డెలివరీ ఫ్లాట్‌ఫార్మ్ స్విగ్గీ తెలిపింది. దేశంలో ఉదయం పూట ఎక్కువగా దోశను ఆర్డర్ చేసింది హైదరాబాద్ వాసులే అని తేలింది. ఆనియన్ దోశలు అటుంచితే.. సాదాసీదా దోశలు కూడా ఈ ఏడాది ఏకంగా 17.54 లక్షల ఆర్డర్లు జరిగాయి.

ఇది చదవండి: ట్రైన్ ఏసీ భోగీలో చెక్ చేస్తూ.. ఓ బెర్త్‌ కింద కనిపించింది చూడగా

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి