Hyderabad: నాలుగేళ్ల తర్వాత నగరంలో ఏవియేషన్ షో.. వింగ్స్ ఇండియా 2022 ఎప్పుడు ప్రారంభం కానుందంటే..
మరో అంతర్జాతీయ వేడుకకు భాగ్యనగరం సిద్ధమైంది. దేశీయ, అంతర్జాతీయ సంస్థలకు చెందిన అత్యాధునిక విమానాలు, హెలికాప్టర్లు, జెట్ ఫైటర్లు హైదరాబాద్ నగరవాసుల్ని కనువిందు చేయనున్నాయి.
మరో అంతర్జాతీయ వేడుకకు భాగ్యనగరం సిద్ధమైంది. దేశీయ, అంతర్జాతీయ సంస్థలకు చెందిన అత్యాధునిక విమానాలు, హెలికాప్టర్లు, జెట్ ఫైటర్లు హైదరాబాద్ నగరవాసుల్ని కనువిందు చేయనున్నాయి. ఈ విమానాలపండగకు బేగంపేట ఎయిర్పోర్టు (Begumpet airport) వేదిక కానుంది. ఈమేరకు ఈనెల 24 నుంచి ‘వింగ్స్ ఇండియా-2022’ (wingsindia 2022)పేరుతో ఎయిర్ షోను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నాలుగు రోజుల పాటు (మార్చి 27వరకు) ఈ ప్రదర్శనలు కొనసాగనున్నాయి. కాగా ఈ ప్రదర్శనల్లో దాదాపు 200కు పైగా అంతర్జాతీయ సంస్థలు, ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు. అదేవిధంగా ఆరువేలకు పైగా ట్రేడ్ విజిటర్స్, 50వేల మంది సందర్శకులు పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే..
కాగా కరోనా కారణంగా నాలుగేళ్ల విరామం అనంతరం ఈ ఎయిర్ షోను నిర్వహిస్తున్నారు. విమానాల ప్రదర్శనలను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే వారు వింగ్స్ ఇండియా వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తొలి మూడురోజులు ప్రముఖులు, వ్యాపారవేత్తలను అనుమతిస్తారు. చివరిరోజు సాధారణ సందర్శకులు రూ.500 చెల్లించి ప్రదర్శనలను వీక్షించవచ్చు.
#WingsIndia2022 spreads its wings with the Government of Maharashtra @CMOMaharashtra as our partner state. Have you booked your dates for Asia’s largest #CivilAviation event? Join us from the 24th of March onwards at Begumpet Airport, Hyderabad. https://t.co/LtxJtEKBY0 pic.twitter.com/6mkcJfyz7e
— Wings India 2022 (@WingsIndia2022) March 12, 2022
Also Read: Tollywood Movies: ఈ వారం థియేటర్లలో..ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు ఇవే..
Viral Video: ఇదెక్కడి పిచ్చిరా బాబు.. లైకుల కోసం ఇలా చేస్తారా.. పట్టు తప్పితే యమలోకానికే!
Cheapest Electric Car: ఎలక్ట్రిక్ కార్ ప్రియులకు శుభవార్త.. అత్యంత తక్కువ ధరలో MG E230..