AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GaneshNimajjanam: హుస్సేన్ సాగర్ చుట్టూ బారులు తీరిన గణనాథులు.. ఇప్పటివరకు ఎన్ని విగ్రహాలు నిమజ్జనం చేశారంటే?

Hyderabad: హైదరాబాద్ ట్యాంక్ బండ్ జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ నినాదాలతో మార్మోగిపోతుంది. గణేశ్ నిమజ్జనానికి సిటీ నలుమూలల నుంచి ఇంకా వేల సంఖ్యలో గణనాథుడి విగ్రహాలు ట్యాంక్‌బండ్‌కు తరలి వస్తున్నాయి.

GaneshNimajjanam: హుస్సేన్ సాగర్ చుట్టూ బారులు తీరిన గణనాథులు.. ఇప్పటివరకు ఎన్ని విగ్రహాలు నిమజ్జనం చేశారంటే?
Ganesh
Basha Shek
|

Updated on: Sep 10, 2022 | 7:45 AM

Share

Hyderabad: హైదరాబాద్ ట్యాంక్ బండ్ జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ నినాదాలతో మార్మోగిపోతుంది. గణేశ్ నిమజ్జనానికి సిటీ నలుమూలల నుంచి ఇంకా వేల సంఖ్యలో గణనాథుడి విగ్రహాలు ట్యాంక్‌బండ్‌కు తరలి వస్తున్నాయి. తొమ్మిది రోజులు పూజలు అందుకున్న వినాయకుడు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు . నిమజ్జనం సందర్భంగా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. ట్యాంక్ బండ్ పై అడుగు అడుగునా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విగ్రహాలు ఏయే మార్గాల్లో ట్యాంక్‌బండ్‌కు చేరుకోవాలో తెలియజేస్తూ పోలీసులు రూట్ మ్యాప్ ను ప్రజలకు అందుబాటులో ఉంచారు. అంతేకాదు నిమజ్జనం సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

ట్యాంక్ బండ్ పై భక్తుల సందడితో కోలాహలంగా మారింది. గంగమ్మ చెంతకు గణనాథుడిని చేర్చేందుకు భారీగా తరలివచ్చారు. డప్పు సప్పులు, నృత్యాలు చేస్తూ భక్త పరవశంలో మునిగిపోయారు. భారీ గణనాథులు ట్యాంక్ బండ్ కు చేరుకోవంతో క్రేన్ల సాయంతో ప్రశాంతంగా నిమజ్జనంచేస్తున్నారు. బై బై గణేశా అంటూ నిమజ్జనం చేస్తూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. గురువారం నుంచి సాయంత్రం నుంచి నిమజ్జనం ప్రారంభం కాగా ఈ రోజు మధ్యాహ్నం వరకు కొనసాగే అవకాశం ఉంది. శుక్రవారం కావటం, భారీ వర్షం కురవడంతో నిమజ్జనం ఆలస్యంగా కొనసాగుతుంది. కాగా హుస్సేన్ సాగర్ చుట్టూ గణనాథులు బారులు తీరాయి. ట్యాంక్ బండ్, ఎన్టీ ఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా లో నిమజ్జనం కొనసాగుతోంది. నిన్న, రాత్రి వర్షం కారణంగా నిమజ్జనం ఆలస్యంగా సాగుతోంది. ఇవాళ మధ్యాహ్నం వరకు నిమజ్జనం కొనసాగే అవకాశం ఉంది. నిన్న దాదాపు హుస్సేన్ సాగర్ లో 20 -30 వేల వరకు విగ్రహాల నిమజ్జనం జరిగింది. ఈవాళ మరో 10 వేల విగ్రహాల వరకు ఒక్క హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం జరిగే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
రూ.300 దర్శనం టికెట్లు లేకపోయినా శ్రీవారి దర్శన భాగ్యం
రూ.300 దర్శనం టికెట్లు లేకపోయినా శ్రీవారి దర్శన భాగ్యం
ఛాంపియన్ రాకతో ఫుల్ జోష్‌లో చెన్నై.. ఆ ఒక్క లోపమే శాపమయ్యేనా?
ఛాంపియన్ రాకతో ఫుల్ జోష్‌లో చెన్నై.. ఆ ఒక్క లోపమే శాపమయ్యేనా?
వాట్ ఇండియా థింక్స్ టుడే కార్యక్రమంలో కిషన్ రెడ్డి కీలక ప్రసంగం..
వాట్ ఇండియా థింక్స్ టుడే కార్యక్రమంలో కిషన్ రెడ్డి కీలక ప్రసంగం..
వందే భారత్ రైలు జన్మస్థలం ఎక్కడో తెలుసా? మేక్ ఇన్ ఇండియా అద్భుతం
వందే భారత్ రైలు జన్మస్థలం ఎక్కడో తెలుసా? మేక్ ఇన్ ఇండియా అద్భుతం
పంటి నొప్పి పీడిస్తోందా.. ఈ 4 చిట్కాలు పాటిస్తే మళ్లీ మీ దరిచేరదు
పంటి నొప్పి పీడిస్తోందా.. ఈ 4 చిట్కాలు పాటిస్తే మళ్లీ మీ దరిచేరదు
యుద్ధం ఆగాలంటే ఆదొక్కటే మార్గం- ఇరాన్ ప్రతినిధి ఇలాహీ
యుద్ధం ఆగాలంటే ఆదొక్కటే మార్గం- ఇరాన్ ప్రతినిధి ఇలాహీ
రైతులకు రేవంత్ సర్కార్ తీపికబురు.. 10 లక్షల మంది రైతులకు..
రైతులకు రేవంత్ సర్కార్ తీపికబురు.. 10 లక్షల మంది రైతులకు..
పంజాబ్ కింగ్స్ క్యాంప్‌లో పాంటింగ్ హంగామా.. ఆటగాళ్లకు వార్నింగ్
పంజాబ్ కింగ్స్ క్యాంప్‌లో పాంటింగ్ హంగామా.. ఆటగాళ్లకు వార్నింగ్
ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా.. 'ధురంధర్ 2' పై రజనీకాంత్
ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా.. 'ధురంధర్ 2' పై రజనీకాంత్
మృత్యువుతో దాగుడుమూతలు.. భారీ పాముతో ఎకసెక్కాలు.. కట్‌ చేస్తే..
మృత్యువుతో దాగుడుమూతలు.. భారీ పాముతో ఎకసెక్కాలు.. కట్‌ చేస్తే..