AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Crime: నీళ్లు ఎందుకు చిందించావని ప్రశ్నించినందుకు బైకును ఢీకొన్న కారు.. మహిళ మృతి!

రోడ్డుపై గుంటల్లో ఉన్న నీళ్లపై నుంచి వేగంగా వెళ్తున్న కారు పక్కనే ఉన్న బైక్‌పై నీళ్లు చిమ్మింది. ఎందుకు చేశావంటూ ప్రశ్నించడంతో.. కోపోధ్రిక్తుడైన కారు డ్రైవర్‌ 2 బైక్‌లను ఢీ కొట్టాడు. ఈ ఘటనలో..

Hyderabad Crime: నీళ్లు ఎందుకు చిందించావని ప్రశ్నించినందుకు బైకును ఢీకొన్న కారు.. మహిళ మృతి!
Car Driver Hits Bike
Srilakshmi C
|

Updated on: Dec 22, 2022 | 9:36 AM

Share

రోడ్డుపై గుంటల్లో ఉన్న నీళ్లపై నుంచి వేగంగా వెళ్తున్న కారు పక్కనే ఉన్న బైక్‌పై నీళ్లు చిమ్మింది. ఎందుకు చేశావంటూ ప్రశ్నించడంతో.. కోపోధ్రిక్తుడైన కారు డ్రైవర్‌ 2 బైక్‌లను ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. గచ్చిబౌలి ఏఐజీ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాయదుర్గం ఎస్ఐ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం..

ఎర్రగడ్డకు చెందిన సయ్యద్‌ సైఫుద్దీన్‌ (27), అతని భార్య మారియా మీర్‌ (25)తో కలిసి బైక్‌పై డిసెంబర్‌ 18న అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో మాదాపూర్ మీదుగా గచ్చిబౌలి బయల్దేరారు. వీరితోపాటు సయ్యద్‌ మిరాజుద్దీన్‌, రాషెద్‌ మాషా ఉద్దీన్‌ అనే వ్యక్తులు కూడా మరో బైక్‌పై మాదాపూర్‌ వంతెన మీదుగా గచ్చిబౌలికి వెళ్తున్నారు. ఏఐజీ సమీపంలోకి రాగానే, బెంజ్‌ కారులో వెళ్తున్న జూబ్లీహిల్స్‌కు చెందిన వ్యాపారి రాజసింహారెడ్డి (26) అక్కడి రోడ్డుపై ఉన్న నీటిలో నుంచి దూసుకెళ్లడంతో మిరాజుద్దీన్‌, రాషెద్‌ మాషా ఉద్దీన్‌లు ప్రయాణిస్తున్న బైక్‌పై నీళ్లు పడ్డాయి. దీంతో వారు కారు డ్రైవర్‌ను వెంబడించి.. అలా ఎందుకు చేశావని నిలదీశారు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహించిన రాజసింహారెడ్డి కారుతో ఢీకొట్టడంతో ఇద్దరూ కిందపడిపోయారు. దీన్ని గమనించిన సైఫుద్దీన్‌, మారియా మీర్ దంపతులు కారు డ్రైవర్‌ను వెంబడించి ప్రశ్నించారు. దీంతో రాజసింహారెడ్డి వారిని కూడా ఢీకొట్టాడు.

ఈ ఘటనలో మారియా వాహనంపై నుంచి ఎగిరి కొద్దిదూరంలో పడి తీవ్ర గాయాలపాలైంది. మారియాను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం (డిసెంబర్‌ 21) తెల్లవారుజామున మృతి చెందింది. మారియాకు 8 నెలల పాప ఉన్నట్లు బంధువులు చెబుతున్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు ఫైల్‌ చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైం సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
కిరాణా షాపులో ఒంటరిగా ఉన్న మహిళ.. బైక్‌పై వచ్చిన ముగ్గురు..
కిరాణా షాపులో ఒంటరిగా ఉన్న మహిళ.. బైక్‌పై వచ్చిన ముగ్గురు..
ఎరుపు రంగు చీరలలో ముద్దుగుమ్మలు.. హీరోయిన్స్ స్పెషల్ అట్రాక్షన్..
ఎరుపు రంగు చీరలలో ముద్దుగుమ్మలు.. హీరోయిన్స్ స్పెషల్ అట్రాక్షన్..
మీరు మీ బంధువుల ఇంటిని అద్దెకు తీసుకుంటున్నారా? ఇక కొత్త నిబంధనలు
మీరు మీ బంధువుల ఇంటిని అద్దెకు తీసుకుంటున్నారా? ఇక కొత్త నిబంధనలు
నారా లోకేశ్‌పై ప్రశంసలు కురిపించిన.. హీరోయిన్ జాన్వీ కపూర్
నారా లోకేశ్‌పై ప్రశంసలు కురిపించిన.. హీరోయిన్ జాన్వీ కపూర్
దారుణం.. రెండు ముక్కలైన ఐఐటీ విద్యార్థి తల..!
దారుణం.. రెండు ముక్కలైన ఐఐటీ విద్యార్థి తల..!
టాస్‌కు 30 నిమిషాల ముందు ఎంట్రీ ఇచ్చి సెంచరీ బాదేశాడు
టాస్‌కు 30 నిమిషాల ముందు ఎంట్రీ ఇచ్చి సెంచరీ బాదేశాడు
మంచి రోజులు ప్రారంభమయ్యే ముందు.. మీ ఇంటిలో కనిపించే సంకేతాలు ఇవే!
మంచి రోజులు ప్రారంభమయ్యే ముందు.. మీ ఇంటిలో కనిపించే సంకేతాలు ఇవే!
పాల్వంచలో ఎగ్జామ్ రాస్తూ మృత శిశువుకు జన్మనిచ్చిన ఓ మైనర్ బాలిక
పాల్వంచలో ఎగ్జామ్ రాస్తూ మృత శిశువుకు జన్మనిచ్చిన ఓ మైనర్ బాలిక
పెప్పర్ చికెన్..! ఇలా చేసి తింటే.. మళ్లీ మళ్ళీ కావాలంటారు..!
పెప్పర్ చికెన్..! ఇలా చేసి తింటే.. మళ్లీ మళ్ళీ కావాలంటారు..!
ఓలా నుండి ఏథర్ వరకు 8 ఏళ్లు వారంటీ ఉన్న టాప్ 5 ఈ- స్కూటర్స్
ఓలా నుండి ఏథర్ వరకు 8 ఏళ్లు వారంటీ ఉన్న టాప్ 5 ఈ- స్కూటర్స్