గణేష్ మండపంలో అగ్ని ప్రమాదం!
హైదరాబాద్లోని మల్కాజిగిరి విష్ణుపురి కాలనీ గణేష్ మండపంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మైత్రీ నివాస్ అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో అఖండ దీపం కిందపడి మంటలు చెలరేగాయి. దీంతో అపార్టుమెంట్ లోని వాహనాలు కాలి బూడిదయ్యాయి. ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. 2 కార్లు, 10 ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
హైదరాబాద్లోని మల్కాజిగిరి విష్ణుపురి కాలనీ గణేష్ మండపంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మైత్రీ నివాస్ అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో అఖండ దీపం కిందపడి మంటలు చెలరేగాయి. దీంతో అపార్టుమెంట్ లోని వాహనాలు కాలి బూడిదయ్యాయి. ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. 2 కార్లు, 10 ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.