AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏఐ ఆధారంగా తప్పుడు వీడియోలు వైరల్‌ చేశారు.. కంచ గచ్చిబౌలి భూవివాదంపై సీఎం రేవంత్ ఏమన్నారంటే..

కంచ గచ్చిబౌలి భూ వివాదంపై జరిగిన అసత్య ప్రచారాలపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. ఫేక్‌ కంటెంట్‌పై విచారణ జరపాలని కోర్టును కోరుతామని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో ఏఐ ఆధారంగా తప్పుడు వీడియోలు వైరల్‌ చేశారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ఏఐ ఆధారంగా తప్పుడు వీడియోలు వైరల్‌ చేశారు.. కంచ గచ్చిబౌలి భూవివాదంపై సీఎం రేవంత్ ఏమన్నారంటే..
Cm Revanth Reddy
Shaik Madar Saheb
|

Updated on: Apr 05, 2025 | 9:30 PM

Share

కంచ గచ్చిబౌలి భూ వివాదంపై జరిగిన అసత్య ప్రచారాలపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. ఫేక్‌ కంటెంట్‌పై విచారణ జరపాలని కోర్టును కోరుతామని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో ఏఐ ఆధారంగా తప్పుడు వీడియోలు వైరల్‌ చేశారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ అంశంపై మంత్రులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి.. నిజాలను మార్చే ఫేక్‌ వీడియోలు ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు. ఏఐ ఫేక్‌ వీడియోలు కరోనా కంటే డేంజర్ అన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో వాస్తవాలు బయటికి రాకముందే అబద్ధాలను వైరల్‌ చేశారన్నారు. ఈ అంశంలో ఫేక్‌ కంటెంట్‌పై విచారణ జరపాలని కోర్టును కోరుతామని తెలిపారు. ఫేక్ వీడియోలు ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక ఫేక్‌ వీడియోలను అరికట్టేందుకు ఫోరెన్సిక్‌ టూల్స్‌ను సిద్ధం చేశామన్నారు సీఎం రేవంత్. ఫేక్‌ కంటెంట్‌ భవిష్యత్తులో యుద్ధాలకు బీజం వేస్తుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో సైబర్‌ క్రైమ్‌ విభాగాన్ని మరింత బలోపేతం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

వివాదంపై కాంగ్రెస్ నాయకత్వం ఫోకస్..

ఈ అంశంపై కాంగ్రెస్ నాయకత్వం కూడా ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ వచ్చిన పార్టీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ అంశంపై వివిధ వర్గాలతో చర్చిస్తామని తెలిపారు. ముగ్గురు మంత్రుల కమిటీతో సమావేశమైన ఆమె.. వివాదం మొదలైన తీరు, రాజకీయపక్షాల విమర్శలపై ఆరా తీశారు. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు, కౌంటర్ కాపీపైనా మంత్రుల కమిటీతో చర్చించారు. అన్ని వర్గాలతో చర్చించిన తరువాత సమస్యకు ఓ పరిష్కారం లభించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

మొత్తానికి కంచ గచ్చిబౌలి భూవివాదం వ్యవహారాన్ని ఇటు ప్రభుత్వం, అటు కాంగ్రెస్ నాయకత్వం చాలా సీరియస్‌గా తీసుకున్నట్టు కనిపిస్తోంది. దీంతో ఈ అంశంలో ప్రభుత్వం చర్యలు ఏ విధంగా ఉంటాయి ? కాంగ్రెస్ ఇంఛార్జ్ ఏ రకమైన అభిప్రాయానికి వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ముస్సోరీ కొండల్లో అట్టహాసంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి
ముస్సోరీ కొండల్లో అట్టహాసంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి
ఇరాన్ కొత్త లీడర్ మోజ్తాబా ఖమేనీ నిజంగానే గాయపడ్డారా?
ఇరాన్ కొత్త లీడర్ మోజ్తాబా ఖమేనీ నిజంగానే గాయపడ్డారా?
హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. త్వరలో శంకుస్ధాపన..
హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. త్వరలో శంకుస్ధాపన..
మొన్నటివరకు డెలాయిట్, అమెజాన్‌లో జాబ్స్.. ఇప్పుడు టాలీవుడ్ హీరో
మొన్నటివరకు డెలాయిట్, అమెజాన్‌లో జాబ్స్.. ఇప్పుడు టాలీవుడ్ హీరో
ఆకాశం నుండి మక్కా ఎలా కనిపిస్తుందో తెలుసా? క్లాక్ టవర్ పైనుండి
ఆకాశం నుండి మక్కా ఎలా కనిపిస్తుందో తెలుసా? క్లాక్ టవర్ పైనుండి
మీ టైమ్‌కి మీరే ఓనర్ కావాలంటే ‘జీనియస్ మ్యాట్రిక్స్’ ఫాలో అవ్వండి
మీ టైమ్‌కి మీరే ఓనర్ కావాలంటే ‘జీనియస్ మ్యాట్రిక్స్’ ఫాలో అవ్వండి
కొబ్బరి నీళ్లు Vs మజ్జిగ.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
కొబ్బరి నీళ్లు Vs మజ్జిగ.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
కరెంట్‌ బిల్లు కట్టినట్టు.. AI బిల్లు కట్టాల్సిందే!
కరెంట్‌ బిల్లు కట్టినట్టు.. AI బిల్లు కట్టాల్సిందే!
ఈ ఉగాది నుంచి ఆ రాశుల వారికి తిరుగే లేదు.. అదృష్టం, ఆదాయం డబుల్
ఈ ఉగాది నుంచి ఆ రాశుల వారికి తిరుగే లేదు.. అదృష్టం, ఆదాయం డబుల్
ఫార్మూలా సేమ్‌ టు సేమ్‌.. కానే అడ్రస్ ఛేంజ్..!
ఫార్మూలా సేమ్‌ టు సేమ్‌.. కానే అడ్రస్ ఛేంజ్..!