AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మమ్మల్నే అడుగుతవా..? కరెంట్ బిల్లు చెల్లించాలన్నందుకు అధికారిపై దాడి.. వీడియో

హైదరాబాద్‌లో కరెంట్ బిల్లులు వసూలు చేయడం విద్యుత్ శాఖ ఉద్యోగులకు ప్రాణసంకటంగా మారింది. గతంలో విద్యుత్ బిల్లులు చెల్లించాలన్నందుకు దాడి చేసిన ఘటనలు ఎన్నో చూశాం.. తాజాగా.. కరెంట్‌ బిల్లు కట్టలేదని నిలదీసినందుకు ఉద్యోగిపై ఓ యువకుడు దాడి చేశాడు..

Hyderabad: మమ్మల్నే అడుగుతవా..? కరెంట్ బిల్లు చెల్లించాలన్నందుకు అధికారిపై దాడి.. వీడియో
Hyderabad
Shaik Madar Saheb
|

Updated on: Jul 19, 2024 | 1:33 PM

Share

హైదరాబాద్‌లో కరెంట్ బిల్లులు వసూలు చేయడం విద్యుత్ శాఖ ఉద్యోగులకు ప్రాణసంకటంగా మారింది. గతంలో విద్యుత్ బిల్లులు చెల్లించాలన్నందుకు దాడి చేసిన ఘటనలు ఎన్నో చూశాం.. తాజాగా.. కరెంట్‌ బిల్లు కట్టలేదని నిలదీసినందుకు ఉద్యోగిపై ఓ యువకుడు దాడి చేశాడు.. ఈ ఘటన హైదరాబాద్‌ మోతీనగర్‌ పరిధిలో చోటుచేసుకుంది.. వెంకటస్వామి అనే వ్యక్తికి సంబంధించిన కరెంటు బిల్లు దాదాపు 6 వేల 800 బకాయి ఉంది.

దీంతో వెస్ట్ జోన్ సర్కిల్లో విద్యుత్ బిల్లుల బకాయిలు చెల్లించాలంటూ లైన్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్‌ వెంకటస్వామి ఇంటికెళ్లి కోరాడు.. ఈ విషయంపై లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీకాంత్‌కి.. వెంకటస్వామి కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వాదం జరిగింది. బిల్లు కట్టని కారణంగా కరెంట్ కట్‌ చేస్తామని చెప్పడంతో కోపంతో ఊగిపోయిన వెంకటస్వామి కుమారుడు లైన్‌ ఇన్‌స్పెక్టర్‌పై దాడి చేశాడు. యువకుడు కొట్టడంతో శ్రీకాంత్‌ గాయపడ్డాడు.

వీడియో చూడండి..

4 నెలలుగా కరెంట్ బిల్లు చెల్లించకపోవడంతో పవర్ సప్లై నిలిపివేస్తామని చెప్పడంతో ఘర్షణ జరిగినట్లు పేర్కొంటున్నారు. దాడిలో విద్యుత్ అధికారి శ్రీకాంత్ కు తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలించారు.

లైన్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు సనత్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.. వెంకటస్వామి కుమారుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..