Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెంలో దారుణం.. అనారోగ్యంతో కూతురు మృతి.. అదితట్టుకోలేక..

Bhadradri Kothagudem: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుమార్తె మరణాన్ని తట్టుకోలేక.. దంపతులు..

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెంలో దారుణం.. అనారోగ్యంతో కూతురు మృతి.. అదితట్టుకోలేక..
Kothagudem Couple
Follow us

|

Updated on: Aug 06, 2021 | 10:52 AM

Bhadradri Kothagudem: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుమార్తె మరణాన్ని తట్టుకోలేక.. దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన బూర్గంపాడు మండలం కేటీపీఎస్ పంప్ హౌస్ వద్ద చోటు చేసుకుంది. వీరి మృతికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని ఈసిఐఎల్‌కు చెందిన దంపతులు పమ్మి హేమలత-లక్ష్మణచారి దంపతులు. వీరికి ఒక కూతురు ఉంది. అయితే, కొద్ది రోజుల క్రితం వారి కూతురు అనారోగ్యంతో కన్నుమూసింది. దాంతో వారు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ క్రమంలోనే పది రోజుల క్రితం పాల్వంచలోని బంధువుల ఇంటికి వచ్చారు దంపతులు. అయితే, కూతురు మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన ఈ దంపతులు.. గురువారం నాడు సూసైడ్ నోట్ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయారు.

దాంతో హేమలత తమ్ముడు వేమన కుమార్.. పాల్వంచ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వారి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. హేమలత-లక్ష్మణచారి కోసం గాలింపు చేపట్టారు. ఇంతలోనే బ్యాడ్ న్యూస్ అందింది. ఈ దంపతులిద్దరూ గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. బూర్గంపాడు మండలం కేటీపీఎస్ పంప్‌ హౌస్ వద్ద గోదావరి నదిలో రెండు మృతదేహాలు ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు. మృతులిద్దరూ హేమలత-లక్ష్మణచారి గా గుర్తించారు. వారి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

చాణక్య నీతి: మీరు కెరీర్‌లో ఉన్నత శిఖరాలను చేరుకోవాలనుకుంటున్నారా?.. అయితే ఈ విషయాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు..

Telangana: ప్రొఫెసర్ జయశంకర్ జయంతి నేడు.. నివాళులర్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్..

Viral Video: వధువు చుంబనం.. వరుడు ఢమాల్.. నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్న లవ్లీ వీడియో..