AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మృతుడి వేలిముద్రతో ఫోన్ అన్‌లాక్.. ఓఆర్‌ఆర్ ప్రమాద బాధితులను పోలీసులు ఎలా గుర్తించారంటే..?

దేవుడి దర్శనం ముగించుకుని సంతోషంగా ఇంటికి వస్తున్న ఆ కుటుంబాన్ని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ధాటికి ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అయితే మృతదేహాల వద్ద ఎలాంటి ఆధారాలు లేని స్థితిలో.. పోలీసులు ఒక వేలిముద్ర సాయంతో మృతుల వివరాలను ఎలా ఛేదించారు? టెక్నాలజీని ఉపయోగించి కుటుంబ సభ్యులను ఎలా గుర్తించారు? అనేది తెలుసుకుందాం..

Telangana: మృతుడి వేలిముద్రతో ఫోన్ అన్‌లాక్.. ఓఆర్‌ఆర్ ప్రమాద బాధితులను పోలీసులు ఎలా గుర్తించారంటే..?
Police Use Fingerprint To Identify Victims
Vijay Saatha
| Edited By: |

Updated on: May 03, 2026 | 12:28 PM

Share

హైదరాబాద్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల గుర్తింపు కోసం పోలీసులు టెక్నికల్‌గా ఆలోచించారు . ఔటర్ రింగ్ రోడ్‌పై జరిగిన ఈ ప్రమాదంలో మృతదేహాల వద్ద ఎలాంటి పత్రాలు లభించకపోవడంతో పోలీసులు ఒక మృతుడి ఫింగర్‌ప్రింట్‌ను ఉపయోగించి అతని మొబైల్ ఫోన్‌ను అన్‌లాక్ చేసి కుటుంబ సభ్యులను గుర్తించారు. ఈ ఘటన షంషాబాద్ సమీపంలోని తుండుపల్లి వద్ద చోటుచేసుకుంది. వాగనర్ కారు రోడ్డుపై నిలిపి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో కారులో ఉన్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఒకరైన వ్యక్తి బైల్ ఫోన్ పక్కనే లభించడంతో అతని ఫింగర్‌ప్రింట్ ద్వారా ఫోన్‌ను అన్‌లాక్ చేసి నాన్న అనే కాంటాక్ట్‌ను సంప్రదించారు. ఆ తరువాత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తరువాత పోలీసులు మరిన్ని వివరాలు సేకరించి మృతులను శివకుమార్ కుటుంబంగా గుర్తించారు. ఈ ప్రమాదంలో శివకుమార్, అతని భార్య, పిల్లలు, బంధువులు కలిసి మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. యాదగిరిగుట్ట ఆలయ దర్శనం ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ దుర్ఘటన జరిగింది

పోలీసుల ప్రాథమిక విచారణలో డ్రైవర్ వేగంగా వాహనం నడపడం, అలాగే రోడ్డుపై నిలిపి ఉన్న లారీని గమనించకపోవడం ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. మరోవైపు లారీ రోడ్డుపక్కన పార్క్ చేయడం కూడా ప్రమాద తీవ్రత పెరగడానికి కారణమైందని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక ఔటర్ రింగ్ రోడ్ పై తరచుగా జరుగుతున్న ప్రమాదాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వరుస ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని డిజిపి సివి ఆనంద్ సమీక్ష సమావేశం నిర్వహించారు

Follow Us
మృతుడి వేలిముద్రతో ఫోన్ అన్‌లాక్.. ఓఆర్‌ఆర్ ప్రమాద బాధితులను..
మృతుడి వేలిముద్రతో ఫోన్ అన్‌లాక్.. ఓఆర్‌ఆర్ ప్రమాద బాధితులను..
స్టార్ల వైఫల్యంపై ముంబై కోచ్ జయవర్ధనే షాకింగ్ కామెంట్స్
స్టార్ల వైఫల్యంపై ముంబై కోచ్ జయవర్ధనే షాకింగ్ కామెంట్స్
ఇన్వర్టర్ Vs కన్వర్టిబుల్.. ఈ రెండిటిల్లో ఏది మంచిది..?
ఇన్వర్టర్ Vs కన్వర్టిబుల్.. ఈ రెండిటిల్లో ఏది మంచిది..?
పట్టపగలు తుపాకులతో గోల్డ్‌ షాప్‌లోకి చొరబడిన దొంగలు.. తర్వాత సీన్
పట్టపగలు తుపాకులతో గోల్డ్‌ షాప్‌లోకి చొరబడిన దొంగలు.. తర్వాత సీన్
ఇంటి డోర్‌ దగ్గర ఈ ఒక్కటి పెడితే ఆ చిక్కులన్నీ మాయం..
ఇంటి డోర్‌ దగ్గర ఈ ఒక్కటి పెడితే ఆ చిక్కులన్నీ మాయం..
మెచ్యూర్ కానీ అమ్మాయిలే టార్గెట్.. OTTలో రియల్ క్రైమ్ స్టోరీ
మెచ్యూర్ కానీ అమ్మాయిలే టార్గెట్.. OTTలో రియల్ క్రైమ్ స్టోరీ
కనకాంబరాలు గుత్తులు గుత్తులుగా పూయాలంటే ఇవి ఇవ్వండి..
కనకాంబరాలు గుత్తులు గుత్తులుగా పూయాలంటే ఇవి ఇవ్వండి..
కేవలం వాటర్ తాగితే సరిపోదూ.. కిడ్నీలోని రాళ్లు పోవాలంటే..
కేవలం వాటర్ తాగితే సరిపోదూ.. కిడ్నీలోని రాళ్లు పోవాలంటే..
సెట్‏లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. ఇప్పుడు చూస్తే గర్వంగా ఉంది..
సెట్‏లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. ఇప్పుడు చూస్తే గర్వంగా ఉంది..
మా టైం బాగోలేదు.. ఈ సీజన్ మాది కాదు.. హార్దిక్ సంచలన వ్యాఖ్యలు
మా టైం బాగోలేదు.. ఈ సీజన్ మాది కాదు.. హార్దిక్ సంచలన వ్యాఖ్యలు