Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Virus: కామినేని ఆసుపత్రిలో దారుణం.. పెండింగ్ లో ఉన్న రూ. 12 వేలు కట్టలేదని బాధితురాలి ప్రాణం తీసిన వైనం

Corona Virus: ప్రభుత్వాలు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా.. అధికారులు ఎంత తనిఖీలు నిర్వహించినా ఎన్ని ప్రయివేట్ ఆస్పత్రులకు ఫైన్స్ వేసినా..

Corona Virus: కామినేని ఆసుపత్రిలో దారుణం.. పెండింగ్ లో ఉన్న రూ. 12 వేలు కట్టలేదని బాధితురాలి ప్రాణం తీసిన వైనం
ఆమె జూన్ 16 న ఆమె కరోనా నుంచి ఆరోగ్యంగా కోలుకుంది. దీంతో ఆమెను ఆమె ఇంటికి పంపించినట్లు జిల్లా కలెక్టర్ పోమా టుడు తెలిపారు. శాతాధిక వృద్ధురాలు కోలుకోని కరోనా బాధితులకు ధైర్యాన్ని నింపిందంటూ కొనియాడారు.
Follow us
Surya Kala

|

Updated on: Jun 02, 2021 | 6:59 PM

Corona Virus: ప్రభుత్వాలు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా.. అధికారులు ఎంత తనిఖీలు నిర్వహించినా ఎన్ని ప్రయివేట్ ఆస్పత్రులకు ఫైన్స్ వేసినా.. సరే కరోనా బాధితులకు చికిత్సనందించే విషయంలో కొన్ని ప్రయివేట్ ఆస్పత్రుల తీరు మారడం లేదు. వీరి ధనదాహం తీరడం లేదు అన్నట్లుగా ఉంది. తాజాగా హైదరాబాద్ ఎల్ బి నగర్ కామినేని లో దారుణం.చోటు చేసుకుంది. కరోనా కు చికిత్స తీసుకుంటున్న రోగి పెండింగ్ లో ఉన్న రూ. 12 వేల ను చెల్లించలేదని బాధితురాలి ప్రాణాలు తీసుకుంది కార్పొరేట్ వైద్యం. వివరాల్లోకి వెళ్తే..

బాచూపల్లి, మల్లంపేట్ కు చెందిన రాధ (51 ) కరోనా వైరస్ బారిన పడ్డారు చికిత్స నిమిత్తం కామినేని ఆస్పత్రిలో గత 18 రోజులుగా లంగ్ ఇన్ఫెక్షన్ తో వైద్యం పొందుతుంది. ఇప్పటికే ఆస్పత్రికి చికిత్స నిమిత్తం ఆరు లక్షల రూపాయలకు పైగా బిల్ చెల్లించారు కుటుంబ సభ్యులు. అయినప్పటికీ వైద్యంలో ఎటువంటి పురోగతి కనిపించలేదు. బాధితురాలి ఆరోగ్యం మెరుగుపడలేదు. ఈ నేపధ్యంలో బిల్ చెల్లించలేదని.. బాధితురాలికి ఆస్పత్రి సిబ్బంది వైద్యం నిలిపివేసింది. రాధ బంధువులు ఐదు రోజులు పైగా అడుగుతున్నా డాక్టర్లు రిపోర్ట్స్ ఇవ్వలేదని రాధా బంధువులు వాపోయారు. ఆంటీకాదు నిన్న (మంగళవారం ) రూ 80,000 కట్టేవరకు రాధకు తిరిగి వైద్యం మొదలు పెట్టలేదని ఆరోపిస్తున్నారు. ఆసుపత్రిలో 20 రోజుల ట్రీట్మెంట్ అనంతరం ఈ రోజు ఉదయం కార్డియాక్ అరెస్ట్ తో చనిపోయిందంటూ వైద్యు;లు రాధా బందువులకు తెలిపారు. అయితే 20 రోజుల క్రితమే తండ్రిని కోల్పోయిన పిల్లలు ఇప్పుడు తల్లి మరణ వార్త తో ఒక్కసారిగా కుప్పకూలారు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Also Read: కరోనా కోరల్లో నుంచి బయటపడానికి శ్వాస పక్రియ మెరుగుపరుచుకోవడానికి మేలు చేసే సింహ ప్రకియ..