AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్ మరో ఘనత.. త్వరలో పౌర విమానయాన పరిశోధనా కేంద్రం ప్రారంభం

మార్చి 5న హైదరాబాద్ లో అంతర్జాతీయ స్థాయి పౌర విమానయాన పరిశోధనా కేంద్రం (సీఏఆర్ వో) దేశంలోనే తొలి 'గృహ-5' ప్రామాణిక భవనం ప్రారంభంకానుంది. ఈ మేరకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభంకాబోతోంది. ఇక ఆదిలాబాద్ లో రూ.6 వేల కోట్లతో ఎన్టీపీసీ నిర్మించిన 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని మార్చి 4న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.

Hyderabad: హైదరాబాద్ మరో ఘనత.. త్వరలో పౌర విమానయాన పరిశోధనా కేంద్రం ప్రారంభం
Pm Narendra Modi
Balu Jajala
|

Updated on: Mar 01, 2024 | 4:10 PM

Share

దేశంలోనే ముఖ్య సిటీ అయిన హైదరాబాద్ అన్ని రంగాల్లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. వైద్య, వైద్, ఉపాధి రంగాలకు కేరాఫ్ అడ్రస్ హైదరాబాద్. ఇక భాగ్య నగరం విమానయాన సేవల్లోనూ ముందుండబోతోంది. ఈ మేరకు మార్చి 5న హైదరాబాద్ లో అంతర్జాతీయ స్థాయి పౌర విమానయాన పరిశోధనా కేంద్రం (సీఏఆర్ వో) దేశంలోనే తొలి ‘గృహ-5’ ప్రామాణిక భవనం ప్రారంభంకానుంది. ఈ మేరకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభంకాబోతోంది. ఇక ఆదిలాబాద్ లో రూ.6 వేల కోట్లతో ఎన్టీపీసీ నిర్మించిన 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని మార్చి 4న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.

మోడీ ప్రభుత్వంలో తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తున్న ఈ నగరానికి ఇకపై కారోతో మరో ఘనత దక్కుతుందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాల పౌరవిమానయాన పరిశోధన సంస్థ పౌరవిమానయాన రంగంలో అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో బేగంపేట విమానాశ్రయంలో ఏర్పాటు కానుంది. ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కేంద్రాన్ని తొలిసారిగా అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నామని, రాబోయే రోజుల్లో విమానయాన రంగంలో జరగబోయే సాంకేతిక మార్పులకు అవసరమైన అత్యాధునిక, సాంకేతిక పరిశోధనలు నిర్వహిస్తామన్నారు.

ఎయిర్ పోర్ట్స్ అండ్ ఎయిర్ నావిగేషన్ రీసెర్చ్ ఫెసిలిటీస్, ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్ మెంట్ కమ్యూనికేషన్స్ డొమైన్ లో సిమ్యులేటర్లు, విజువలైజేషన్ అండ్ అనాలిసిస్ ల్యాబ్స్, సర్వైలెన్స్ ల్యాబ్స్ నావిగేషన్ సిస్టమ్స్, సైబర్ సెక్యూరిటీ అండ్ థ్రెట్ అనాలిసిస్ ల్యాబ్స్, డేటా మేనేజ్ మెంట్ సెంటర్, ప్రాజెక్ట్ సపోర్ట్ సెంటర్, సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ అండ్ టూల్స్ సెంటర్, నెట్ వర్క్ ఇన్ ఫ్రా సెంటర్ ఉన్నాయి. మార్చి 5న మోదీ ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు.

ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా రామగుండం ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్లాంట్ లో భాగంగా రూ.6 వేల కోట్లతో నిర్మించిన 800 మెగావాట్ల ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్లాంట్ ను మార్చి 4న ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. గత ఏడాది అక్టోబర్ లో నిజామాబాద్ పర్యటన సందర్భంగా మోడీ 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ స్థలాన్ని ప్రారంభించారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రారంభంతో థర్మల్ విద్యుత్ కేంద్రాల మొత్తం సామర్థ్యం 1,6000 మెగావాట్లకు చేరనుంది. తెలంగాణ ప్రజల గృహ, వాణిజ్య, వ్యవసాయ విద్యుత్ అవసరాలను థర్మల్ విద్యుత్ కేంద్రాలు తీరుస్తున్నాయన్నారు.

Follow Us