Governor Tamilisai: బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించనున్న గవర్నర్ తమిళి సై.. విద్యార్థులతో భేటీ..
Basara IIIT students: గవర్నర్ తమిళిసై బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్కు వెళ్లి విద్యార్థులతో భేటీ కానున్నారు. ఈ మేరకు గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ఈ రోజు రాత్రి రైలులో బాసరకు వెళ్లనున్నారు.
Tamilisai Soundararajan to visit IIIT-Basara: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు గత కొన్ని రోజుల నుంచి ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల అధికారులు హామీనివ్వడంతో వారంపాటు ఆందోళనలను వాయిదా వేస్తున్నట్లు విద్యార్థులు ప్రకటించారు. ఈ క్రమంలో గవర్నర్ తమిళిసై బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్కు వెళ్లి విద్యార్థులతో భేటీ కానున్నారు. ఈ మేరకు గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ఈ రోజు రాత్రి రైలులో బాసరకు వెళ్లనున్నారు. బాసర చేరుకున్న అనంతరం మొదట సరస్వతీ దేవీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం తమిళి సై బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్కు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో భేటీ కానున్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై రాత్రి బాసరలోనే బస చేయనున్నారు.
కాగా.. ఇటీవల మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఐఐటీ క్యాంపస్ను సందర్శించి.. హామీలను నెరవేరుస్తామని పేర్కొన్నారు. కానీ ఆ హామీలు ఏవీ అమలు కావడం లేదని విద్యార్థులు ఇటీవల ఆందోళన నిర్వహించారు. మెస్ టెండర్లకు నోటిఫికేషన్ ఇస్తే సరిపోదని, ఫైనలైజ్ చేసే వరకు ఆందోళన విరమించమని పేర్కొన్నారు. కానీ వీసీ హామీతో ఆందోళనను వారంపాటు వాయిదా వేశారు. ఈ క్రమంలో గవర్నర్ తమిళి సై బాసర ఐఐటీ క్యాంపస్ను సందర్శించడం హాట్ టాపిక్గా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి