AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ జాతి ఆవులు ఉంటే.. రైతుల పాలిట కాసుల పంటే.. ధర ఎంతో తెలుసా..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేటలోని గుర్రాల చెరువు గ్రామానికి చెందిన సుబ్బరాజు అనే రైతు గిరిజాతికి చెందిన ఆవుల పోషణ చేపట్టారు. వాటి వల్ల కలిగే ఉపయోగాలు, లాభాలు తెలుసుకొని గుజరాత్ రాష్టం నుండి కొనుగోలు చేశారు. తన పొలంలో వాటి పోషణ చూసుకుంటున్నారు.

ఈ జాతి ఆవులు ఉంటే.. రైతుల పాలిట కాసుల పంటే.. ధర ఎంతో తెలుసా..
Giri Breed Cow
N Narayana Rao
| Edited By: |

Updated on: Feb 18, 2024 | 12:57 PM

Share

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేటలోని గుర్రాల చెరువు గ్రామానికి చెందిన సుబ్బరాజు అనే రైతు గిరిజాతికి చెందిన ఆవుల పోషణ చేపట్టారు. వాటి వల్ల కలిగే ఉపయోగాలు, లాభాలు తెలుసుకొని గుజరాత్ రాష్టం నుండి కొనుగోలు చేశారు. తన పొలంలో వాటి పోషణ చూసుకుంటున్నారు. ఈ ఆవుల వల్ల ఉపయోగాలు తెలుసుకొన్న మరికొంతమంది రైతులు ఈ జాతి ఆవుల పెంపకం కోసం ఉత్సాహం చూపుతున్నారు. సాధారణంగా ఉమ్మడి రాష్ట్రంలో ఆవు ఖరీదు రూ. 20 నుండి రూ. 30 వేలు ఉంటుంది. మామూలు ఆవులు రోజుకు 2 లీటర్ల పాలు ఇస్తాయని, కానీ గిరిజాతి ఆవులు రోజుకు 5 లీటర్ల పాలు ఇస్తాయని రైతులు అంటున్నారు.

అంతే కాకుండా ఈ పాల నుండి వచ్చే నెయ్యి ఆయుర్వేద ఔషదాలలో వాడతారని, వీటి పాలు, గో పంచకానికి మంచి డిమాండ్ ఉంటుందని చెబుతున్నారు. అలాగే కేజీ వెన్న 7000 రూపాయలకు పైగానే ఉంటుందని తెలిపారు. వీటి పాలను 10 రోజులు మరగపెట్టి వాటి నుండి వచ్చే కెమికల్ ద్వారా, పామ్ ఆయిల్, కొబ్బరి, జామ తోటలకు తెల్ల దోమ కాటు నుండి సంరక్షణకు వాడతారని పేర్కొన్నారు. వీటి మూత్రం పంటలకు రక్షణ, అధిక పోషకాలుగా బాగా పని చేస్తుందని చెప్పారు. ఈ గిరిజాతి ఆవుల వల్ల లాభాలే కాకుండా ఆరోగ్య సమస్యలకు ఎంతో ఉపయోగపడుతుందని రైతులు తెలిపారు. ఈ ఆవులకు ప్రస్తుతం డిమాండ్ బాగా పెరిగిందని.. దీంతో ఈ ఆవుల పెంపకంపై స్థానిక రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి